క్రేజ్ తగ్గినా ఆస్తులు మాత్రం గట్టిగానే కూడబెట్టుకున్న శ్రియా శరణ్.. హాట్ బ్యూటీ రేర్ ఫ్యాక్ట్స్
ఒకప్పుడు టాలీవుడ్ని ఓ ఊపు ఊపేసింది శ్రియాశరణ్. అనుష్క, నయనతార, త్రిష వంటి స్టార్ హీరోయిన్ల జోరు నడుస్తున్న సమయంలో వారికి దీటుగా రాణించి స్టార్ డమ్ పొందిందీ అందాల భామ.
టాలీవుడ్లో హాట్ హీరోయిన్గా పేరుతెచ్చుకుంది శ్రియా(Shriya Saran). చీరలో యమ హాట్గా కనిపిస్తూ కుర్రాళ్ల మతిపోగొట్టింది. దాదాపు దశాబ్దంపాటు తెలుగు చిత్ర పరిశ్రమని ఓ ఊపు ఊపేసిన శ్రియా శరణ్ నేడు(సెప్టెంబర్ 11) 40వ పుట్టిన రోజు(Shriya Birthday) జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకి సంబంధించిన పలు ఆసక్తికర, అరుదైన విషయాలు, ఆస్తుల సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
శ్రియా శరణ్ 1982లో శ్రియా శరణ్ భట్నగర్గా ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జన్మించిన శ్రియా తండ్రి బీహెచ్ఈఎల్ లో ఉద్యోగి కాగా, తల్లి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కెమిస్ట్రీ టీచర్గా పనిచేవారు. మోడల్గా కెరీర్ని ప్రారంభించిన శ్రియా చిన్నప్పట్నుంచే క్లాసికల్ డాన్సులో శిక్షణ తీసుకుంది. ఆమె కతక్ డాన్స్, రాజస్థాని ఫోక్ డాన్సు నేర్చుకుంది.
ఎల్ఎస్ఆర్ కాలేజ్లో చదువుకునే రోజుల్లో ఆమెకి వీడియో షూట్ చేసే అవకాశం వచ్చింది. అలా మ్యూజిక్ వీడియో మొదట నటించింది. ఇందులో ఆమెని చూసిన రామోజీ ఫిల్మ్స్ వారు `ఇష్టం` చిత్రంలో హీరోయిన్గా ఆఫర్ ఇచ్చారు. అలా సినిమాల్లో తొలి ఛాన్స్ అందుకుంది. ఈసినిమాలో నటించడానికి ముందే ఆమెకి నాలుగు సినిమా ఆఫర్లు రావడం విశేషం. అందులో `చెన్న కేశవ రెడ్డి, `నీకు నేను నాకు నువ్వు`, `నువ్వే నువ్వే` కూడా ఉంది.
నాగార్జునతో కలిసి నటించిన `సంతోషం` చిత్రం ఆమెకి బిగ్ బ్రేక్నిచ్చింది. ఇక వెన్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. చిరంజీవితో చేసిన `ఠాగూర్`తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇలా వరుసగా `ఎలా చెప్పను`, `నేనున్నాను`, `అర్జున్`, `నా అల్లుడు`, `సదా మీ సేవలో`, `సోగ్గాడు`, `సుభాష్ చంద్రబోస్`, `చత్రపతి`, `భగీరథ` వంటి చిత్రాలతో మెప్పించింది. ఆల్మోస్ట్ ఆసమయంలో స్టార్ హీరోలందరికి శ్రియానే హీరోయిన్ కావడం విశేషం.
శ్రియా స్టార్ హీరోయిన్గా రాణించే సమయంలో ఆమె దాదాపు ఒక్కో సినిమాకి కోటి రూపాయల వరకు పారితోషికం అందుకున్నట్టు టాలీవుడ్ టాక్. కొన్నాళ్లపాటు అత్యధిక పారితోషికం అందుకున్న కథానాయికగా నిలిచింది శ్రియా. తెలుగులోనే కాదు, తమిళం, హిందీలోనూ స్టార్ హీరోయిన్గా వెలిగింది.
శ్రియాకి ఇష్టమైన హీరోలు షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మధుబాలా, మాధురీ దీక్షిత్. రజనీకాంత్తో `శివాజీ` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇది అప్పట్లో సంచలన విజయం సాధించింది. హిందీలోనే కాదు హాలీవుడ్ ఫిల్మ్స్ కూడా చేసింది. `ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్`, `కూకింగ్ విత్ స్టెల్లా` చిత్రాలు చేసింది. అంతగా పేరుని తీసుకు రాలేకపోయాయి.
స్టార్ హీరోయిన్గా రాణించే సమయంలో కమర్షియల్ బ్రాండ్లకు కేరాఫ్గా నిలిచింది. ఫుల్ డిమాండెడ్ నటిగా నిలిచింది. ఆమె కోకా కోలా, ఫెయిర్ అండ్ లవ్లీ, హెడ్ అండ్ షోల్డర్ వంటి యాడ్ చేసింది. వీటి ద్వారా కూడా బాగానే సంపాదించింది శ్రియా. ఒక్కో యాడ్కి యాభై లక్షల వరకు తీసుకునేదని టాక్.
శ్రియా దానధర్మాలు కూడా బాగానే చేస్తుంటుంది. ఆమె 2011లో ముంబయిలో `శ్రీ` పేరుతో ఓ స్పా సెంటర్ని ఏర్పాటు చేసింది. ఇందులో అందరు విజువల్లీ ఛాలెంజ్డ్ ఉద్యోగులే పనిచేస్తుండటం విశేషం. ప్రస్తుతం శ్రియా సినిమాల్లో అంతగా యాక్టివ్గా లేదు. అలాగని చేయడం లేదని కాదు, అంత జోరులో లేదు. అడపాదడపా సినిమాలు చేస్తూ రాణిస్తుంది.
ఆమె రష్యాకి చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప కూడా ఉన్నారు. ప్రస్తుతం శ్రియాచాలా వరకు ఇండియాలోనే ఉంటున్నారు. ముంబయిలో ఆమెకి ఓ లగ్జరీ అపార్ట్ మెంట్ కూడా ఉందని సమాచారం. చాలా వరకు ముంబయి లేదంటే స్పెయిల్లోని బర్సిలోనాలో ఉంటుంటారు ఈ జంట.
అయితే ఇప్పుడు శ్రియా జోరు తగ్గినా ఆస్తులు మాత్రం బాగానే కూడబెట్టుకుందని తెలుస్తుంది. ప్రస్తుతం శ్రియా వద్ద 12 మిలియన్ డాలర్లు ఆస్తులున్నట్టు తెలుస్తుంది. దీని వాల్యూ దాదాపు 90కోట్లు అని సమాచారం. కొంత ల్యాండ్స్, కార్లు, శ్రీ స్పా సెంటర్ అందులో భాగంగా ఉన్నాయి. అలాగే ఒక ఎస్ క్లాస్ మెర్సిడేజ్ బెంజ్, జాగ్వార్ ఎక్స్ ఎఫ్, ఆడి క్యూ 7 వంటి కార్లున్నాయి.
ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉంది. హిందీలో `దృశ్యం 2` చేస్తుంది. అలాగే `మ్యూజిక్ స్కూల్`, `తడ్కా`లతోపాటు కన్నడలో `కబ్జా`, `తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది. ఇవి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అడపాదడపా గ్లామర్ ఫోటో షూట్లతో ఇంటర్నెట్లో దుమారం రేపుతుందీ సెక్సీ బ్యూటీ.