- Home
- Entertainment
- Shreya Ghoshal Net Worth: శ్రేయా ఘోషల్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా? ఇండియాలోనే రిచ్చెస్ట్
Shreya Ghoshal Net Worth: శ్రేయా ఘోషల్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా? ఇండియాలోనే రిచ్చెస్ట్
Shreya Ghoshal Net Worth: సింగర్ శ్రేయా ఘోషల్ తన 41వ పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా, ఆమె రిచెస్ట్ సింగర్ ఎలా అయ్యింది? ఆమె ఆస్తుల గురించి తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Shreya Ghosha
Shreya Ghoshal Birthday: సింగర్ శ్రేయా ఘోషల్, మార్చి 12, 1984న పశ్చిమ బెంగాల్లోని బ్రహ్మపూర్లో జన్మించారు. బెంగాలీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శ్రేయా ఘోషల్ రాజస్థాన్లోని కోటా సమీపంలోని రావత్భట్టలో పెరిగారు.
శ్రేయా తండ్రి విశ్వజిత్ ఘోషల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారు. శ్రేయాకు 4 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు పాడటం ప్రారంభించింది. శ్రేయా 6 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు సంగీతంలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది.
శ్రేయా ఘోషల్
2000 సంవత్సరంలో తన 16 ఏళ్ల వయస్సులో 'సరిగమప' మ్యూజిక్ షోలో విజేతగా నిలిచిన శ్రేయా ఘోషల్, 2002లో సంజయ్ లీలా బన్సాలీ చిత్రం 'దేవదాస్' ద్వారా బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అదే ఏడాది కార్తీక్ రాజా సంగీతంలో తమిళంలో రూపొందిన ఆల్బమ్ చిత్రం కోసం ‘చెల్లమే చెల్లం’ అనే పాట పాడింది.
ఆమె పాడిన మొదటి పాటతోనే బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత ఆమెకు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా, ఏ.ఆర్.రెహమాన్, అనిరుధ్ వంటి పలువురు ప్రముఖ సంగీత దర్శకుల సంగీతంలో పాడే అవకాశం వచ్చింది.
శ్రేయా ఘోషల్ పుట్టినరోజు
తమిళంలో మాత్రమే 200 కంటే ఎక్కువ పాటలు పాడారు శ్రేయా ఘోషల్. ఇందులో చాలా పాటలు హిట్ అయ్యాయి. ఆమెకు మొత్తం 5 జాతీయ అవార్డులు వచ్చాయి. ఇందులో హిందీలో ఆమె పాడిన మొదటి చిత్రం `దేవదాస్` చిత్రానికి తన మొదటి జాతీయ అవార్డును గెలుచుకుంది శ్రేయా ఘోషల్.
ఆ తర్వాత 2005లో `పహేలీ` చిత్రానికి, 2007లో `జబ్ వే మెట్` చిత్రానికి జాతీయ అవార్డును గెలుచుకున్న ఆమెకు 2008లో `అంటాహీన్` అనే బెంగాలీ చిత్రానికి, 2021లో `ఇరవిన్ నిజల్` చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది.
శ్రేయా ఘోషల్ ఆస్తుల విలువ
శ్రేయా ఘోషల్ ఈరోజు తన 41వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆమె ఆస్తుల వివరాలు కూడా బయటకు వచ్చాయి. దీని ప్రకారం శ్రేయా ఘోషల్ దాదాపు రూ.185 కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్నారు.
ఇలా ఇండియాలోనే రిచ్చెస్ట్ సింగర్స్ లో ఒకరిగా నిలిచారు. ఆమె ఒక్కో పాటకు 25 లక్షల రూపాయలు తీసుకుంటుందని సమాచారం. దీంతోపాటు యాడ్స్, రియాలిటీ షోలలో న్యాయమూర్తిగా పనిచేయడం ద్వారా కూడా శ్రేయా బాగానే సంపాదిస్తున్నారు.
శ్రేయా ఘోషల్ భర్త
శ్రేయా ఘోషల్ కుటుంబం విషయానికొస్తే, ఆమె 2015లో తన చిన్ననాటి స్నేహితుడు శిలాదిత్య ముఖోపాధ్యాయను వివాహం చేసుకుంది. శిలాదిత్య స్మార్ట్ఫోన్ అప్లికేషన్ ట్రూ కాలర్ యొక్క గ్లోబల్ హెడ్. 2021లో శ్రేయా ఘోషల్, శిలాదిత్య దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు, అతనికి దేవ్యాన్ అని పేరు పెట్టారు.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠి, బెంగాలీ ఇలా దాదాపు అన్ని భాషల్లోనూ పాటలు పాడి అలరిస్తున్న శ్రేయా ఘోషల్ వేల పాటలు పాడి అలరించారు. ఇప్పటికీ అలరిస్తున్నారు. ప్రస్తుతం టాప్ సింగర్స్ లో ఒకరిగా రాణిస్తున్నారు.
గమనికః ఇది ఆడియెన్స్ ఆసక్తి మేరకు సోషల్ మీడియాలో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చిన వార్త మాత్రమే. ఇదే నిజమని చెప్పడానికి లేదు.
read more: మహేష్ ,రాజమౌళి చిత్రంకి బేస్ 'రామాయణం'లో ఆ ఘట్టమే ?
also read: ఆసుపత్రి బెడ్పై అమ్మ, మరో మహిళతో నాన్న.. ఆ దారుణాన్ని తలుచుకుని యాంకర్ సౌమ్యరావు కన్నీళ్లు