ఇక్కడ ఎదగాలంటే ఆ పనులు చేయాల్సిందే.. బాలీవుడ్ పై హాట్ బ్యూటీ కామెంట్స్
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం బాలీవుడ్లోని చీకటి కోణాలను తెర మీదకు తీసుకువస్తోంది. ఇప్పటికే వారసత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు విపిస్తుండగా తాజాగా హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ మరిన్ని అంశాలను తెర మీదకు తీసుకువచ్చింది.
సుశాంత్ సింగ్ మరణం ఎన్నో రకాల చర్చలకు తెర మీదకు తీసుకువచ్చింది. బాలీవుడ్లో నెపోటిజం (వారసత్వం) కారణంగా ఎంతో మంది గొప్ప నటులు అణచివేతకు గురవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ అంశంపై కంగనా రనౌత్ లాంటి వారు బహిరంగంగానే విమర్శిస్తుండగా మరికొందరు కొన్ని సందర్భాల్లో అలాంటి ఇబ్బందులు ఉన్నాయింటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
ఈ నేపథ్యంలో హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ బాలీవుడ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్లో ఎదగాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎవరెవరితో స్నేహం చేయాలి, వాళ్లను ఎక్కడ కలవాలి? ఇలా అన్ని అంశాలను ప్రస్తావించింది శ్రద్ధా. అంతేకాదు సాధారణంగా సినిమా అంటే ప్యాషన్తో వచ్చే వారు ఇక్కడ నెగ్గుకు రాలేరని తెగేసి చెప్పింది ఆ భామ. తన ఆవేదన సోషల్ మీడియా పేజ్లో షేర్ చేసింది.
ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం సినిమా అంటే ఇష్టంతో వచ్చిన వారు బాలీవుడ్ లో సక్సెస్ కాలేరని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పింది. ఒకవేళ అలా ఎవరైనా వచ్చిన ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆమె చెప్పింది.
`బాలీవుడ్లో నటిగా ఎదగాలంటే పార్టీలకు వెళ్లాలి, బాంద్రా జుహూల్లోని ఖరీదైన క్లబ్లకు వెళ్లాలి. అక్కడి వారితో స్నేహం చేయాలి. లేదంటే ఇండస్ట్రీలో గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఆలోచనలను నటీనటుల మీద అనవసరమైన ఒత్తడిని పెంచుతాయి` అని చెప్పింది.
ఇక కొత్త వచ్చిన వారు ఎంత డబ్బు ఇచ్చి పీఆర్లను పెట్టుకున్నా వాళ్ల వల్ల పెద్దగా ఉపయోగముండదని చెప్పింది శ్రద్ధా. వాళ్లు కూడా ఇలా పార్టీలకు వెళ్లాలని పెద్ద వాళ్లతో స్నేహం చేయాలనే చెప్తారని చెప్పుకొచ్చింది.
ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చేవారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చేవారు. బట్టలు, షూస్, కార్లు, పీఆర్ ఖర్చులు, స్టైలిష్ట్, సెలూన్ ఖర్చుల అసలు భరించలేరని అవన్ని తలకు మించిన భారమవుతాయని చెప్పింది. ఒక దశలో ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చాం, అసలు ఏం చేస్తున్నాం అన్న నిస్పృహ కూడా ఆవరిస్తుందని చెప్పింది శ్రద్ధా.