- Home
- Entertainment
- Bigg Boss Telugu 7: జనాల పేరు చెప్పి డ్రామాలు.. శివాజీని నిలదీసిన శోభా శెట్టి.. కిచెన్లో రచ్చ
Bigg Boss Telugu 7: జనాల పేరు చెప్పి డ్రామాలు.. శివాజీని నిలదీసిన శోభా శెట్టి.. కిచెన్లో రచ్చ
బిగ్ బాస్ తెలుగు 7 షో నాల్గో వారం మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. నామినేషన్ల ప్రక్రియనే హాట్ హాట్ గా సాగింది. ఇక ఎప్పుడూ లేనిది కిచెన్ గొడవలు కూడా ఆటకెక్కాయి. అదిప్పుడు రచ్చ రచ్చ చేస్తుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
బిగ్ బాస్ తెలుగు ఏడో(Bigg Boss Telugu 7) సీజన్ గత సీజన్ కంటే కాస్త బెటర్ గానే ఉంది. చాలా బోల్డ్ గా ఈ షో సాగుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కంటెస్టెంట్ల గేములు అర్థమవుతున్నాయి. ఎవరు ఫేక్, ఎవరు రియల్ అనేది గేమ్లో, వారి డిస్కషన్లో ఆడియెన్స్ కి అర్థమయ్యేలా సాగుతుంది. అందుకే ఇది కాస్త రంజుగా సాగుతుంది. అందులో భాగంగా తాజాగా గురువారానికి సంబంధించిన ఎపిసోడ్లో కిచెన్ గొడవ పీక్లోకి వెళ్లింది.
ఇందులో యావర్ (Yawar) గార్డెన్ ఏరియాలో టిఫిన్ చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) ద్వారా తన టిఫిన్ తెప్పించుకుని తింటున్నాడు. అయితే అందరు కిచెన్లో ఏదో వర్క్ చేస్తూ టిఫిన్ చేస్తున్నారు. కానీ ఈ ఇద్దరు మాత్రం గార్డెన్ ఏరియాలో చేయడం ఆట సందీప్కి నచ్చ లేదు. ఇదే విషయాన్ని అందరి ముందు లేవనెత్తాడు. యావర్ రాగా, ఆయనకు కూడా ఇలా చేయడం తనకు నచ్చలేదని చెప్పాడు. దీంతో యావర్ తన ప్లేట్ని అక్కడే పెట్టి వెళ్లిపోయాడు. అలా పెట్టి పోవడం సరి కాదంటూ అంతా వాదించాడు, తినడం తనకు ఇష్టం లేదని వెళ్లిపోతున్నట్టు వారించాడు.
ఆ సమయంలోనే శివాజీ (Shivaji) వచ్చాడు.. ఇంతకు ముందు ఆమ్లేట్ తెచ్చి ఇచ్చాడుగా అంటూ వాదించారు. అది వేరు, ఇది వేరంటూ సందీప్(Sandeep) చెప్పాడు. యావర్..కావాల్సి వస్తే మీరు కూడా అక్కడ కూర్చొని తినండి అంటూ తన ఆన్సర్ ఇచ్చాడు. ఆ తర్వాత శోభా శెట్టి ఇందులోకి ఎంటరయ్యింది. జనాలకు వదిలేద్దామని శివాజీ చెప్పాడు. జనాలు జనాలు ఏంటన్నా అంటూ సందీప్, శోభాశెట్టి వారించారు. నేను అంటానమ్మా అంటూ శివాజీ ఫైర్ అయ్యాడు.
దీంతో ఓకే నేను తప్పు చేస్తే జనాలు నన్ను హౌజ్ నుంచి గెంటేస్తారు అని శోభా శెట్టి చెప్పగా అదిగో మళ్లీ మీరు జనాలు అంటున్నారని శివాజీ పాయింట్ పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీనికి మండిపోయిన శోభాశెట్టి (Shobha Shetty). ఇది సరి కాదని, రాంగ్గా పోట్రే అవుతుందని ఆమె చెప్పగా, ఏది వర్కౌట్ అవద్దు అని శివాజీ రెచ్చగొట్టాడు.
నేను చెబుతున్నాను కదా ఆ ఇంటెన్షన్ ఈ ఇంట్లో మీ ఒక్కరికే ఉందంటూ ఆరోపించింది. దీంతో చేసేదేం లేక అక్కడ నుంచి సైలెంట్గా జారుకున్నాడు శివాజీ. మొత్తంగా కిచెన్లో రచ్చ పీక్లోకి వెళ్లింది. శివాజీ టార్గెట్గా శోభా శెట్టి రెచ్చిపోవడం విశేషం. ఓ రకంగా ఆయనకు గట్టిగా కౌంటర్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇది ఆద్యంతం ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది.
మరో ప్రోమోలో `బిగ్ బాస్ లాగా` ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఇందులో హౌజ్మేట్స్ అంతా విభిన్నమైన గెటప్స్ లో రెడీ కావాల్సి ఉంటుంది. వారు ర్యాంప్ వాకులు చేస్తూ, ఇతర యాక్టివిటీస్ చేస్తూ ఎంటర్టైన్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో గెటప్లో తమకి నచ్చినట్టుగా విచిత్రంగా వినోదాన్ని పంచి విన్నర్ అవుతారో వారే ఈ వారం కంటెండర్గా నిలుస్తారని తెలిపారు బిగ్ బాస్. ఇందులో తేజ కూరగాయలన్నీ మీద వేసుకుని బట్టలు విప్పేసి ఆదివాసిలా మారిపోయాడు. ప్రియాంక దెయ్యం గెటప్లో కనిపించింది. రతిక ఉబకాయురాలిగా, అమర్ దీప్ సగం అమ్మాయి, సగం అబ్బాయిలా, యావర్ ముసలోడిగా, ప్రశాంత్ బిచ్చగాడిలా కనిపించి నవ్వులు పూయించారు.