- Home
- Entertainment
- జాకెట్ విప్పేసి బ్రా అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన బాలయ్య భామ.. సాగర కన్య అందాల విందు మైండ్ బ్లోయింగ్
జాకెట్ విప్పేసి బ్రా అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన బాలయ్య భామ.. సాగర కన్య అందాల విందు మైండ్ బ్లోయింగ్
సాగర కన్య శిల్పా శెట్టి నెటిజన్లకి కనువిందునిస్తుంది. ఆమె చాలా రోజుల తర్వాత సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ని తన గ్లామర్ షోతో కట్టిపడేస్తుంది. లేటెస్ట్ ఫోటో షూట్లో ఆమె రెచ్చిపోయిన తీరు షాక్కి గురి చేస్తుంది.

`సాహస వీరుడు సాగరకన్య`గా తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైంది శిల్పా శెట్టి. చాలా గ్యాప్ తో ఆమె సినిమాల్లో నటిస్తుంది. గతేడాది ఆమె `హంగామా 2`తో వచ్చినా ఆ సమయంలో తన భర్త `పోర్నోగ్రఫీ` కేసు కారణంగా ఆమె ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయింది. పైగా ఆ చిత్రం ఓటీటీలో విడుదలైంది. దీంతో దాదాపు 15ఏళ్ల తర్వాత శిల్పా శెట్టి వెండితెరపై సందడి చేయబోతుంది.
ప్రస్తుతం ఆమె `నికమ్మా` చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్ర ట్రైలర్ మంగళవారం ముంబయిలో విడుదలైంది. ఈ ట్రైలర్ ఈవెంట్లో పాల్గొని సందడి చేసింది శిల్పాశెట్టి. ఈ ఈవెంట్ కోసం ఆమె గ్లామర్గా ముస్తాబై అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది.
శిల్పాశెట్టి ఇందులో ఏల్లో జాకెట్, రెడ్ బ్రా ధరించింది. బ్లూ హాఫ్ శారీలో ట్రెండీగా ముస్తాబైంది. ఈ సరికొత్త లుక్ ఆద్యంతం కట్టిపడేస్తుంది. అయితే ఇందులో శిల్పా శెట్టి ఇచ్చిన హాట్ పోజులు మతిపోగొడుతున్నాయి. జాకెట్ విప్పేసి, బ్రాలో ఎద అందాల చూపిస్తూ రెచ్చిపోయింది. కుర్రాళ్లకు అందాల విజువల్ ట్రీట్నిచ్చింది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా శిల్పాశెట్టి పలు ఆసక్తికర విషయాలను తెలిపింది. చాలా గ్యాప్ తో వెండితెరపై సందడి చేయబోతున్నందుకు ఆనందంగా ఉందని చెప్పింది. ఈ రెండేళ్లు తనతోపాటు అందరికి ఎంతో కష్టంగా సాగిందని చెప్పింది. గతేడాది భర్త రాజ్కుంద్ర `పోర్నోగ్రఫీ` కేసులో ఇరుక్కోవడంతో శిల్పా ఫ్యామిలీ ఎంతగా స్ట్రగుల్ అయ్యిందో తెలిసిందే. పరోక్షంగా ఆ విషయాన్ని కూడా ప్రస్తావించింది శిల్పా.
భర్త రాజ్కుంద్రా `పోర్నోగ్రఫీ` కేసులో ఆరోపణలు ఎదుర్కొని వార్తల్లో నిలిచారు. ఈ కేసుతో శిల్పాకి సంబంధం లేకపోయినా ఆమె చాలా దారుణంగా ట్రోల్స్ కి గురైంది. అనేక విమర్శలు ఎదుర్కొంది. రాజ్కుంద్ర ఫ్యామిలీపై సోషల్ మీడియాలో, ప్రధాన మీడియా మాధ్యమాల్లోనూ వార్తలు అనేక కథనాలు ప్రసారమయ్యాయి. ఇలాంటి వార్తలు ఆపాలని ఆమె కోర్ట్ కి వెళ్లగా, కోర్ట్ ఆ పిటిషన్ని కొట్టేయడం విశేషం.
ఇక కొన్ని రోజుల తర్వాత శిల్పాశెట్టి తిరిగి తన రెగ్యూలర్ లైఫ్ని ప్రారంభించింది. టీవీ షోస్, సినిమాలు చేస్తూ వచ్చింది. అందులో భాగంగానే ఆమె నటించిన `నికమ్మా` చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. సబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శిల్పాశెట్టి కీ రోల్ పోషించగా, అభిమణ్యు డీ, షెర్లీ సేతియా జంటగా నటించారు. ఈ సినిమా వచ్చే నెల 17న విడుదల కాబోతుంది.
శిల్పాశెట్టి తెలుగులో వెంకటేష్తో `సాహస వీరుడు సాగర కన్య`, మోహన్బాబుతో `వీడెవడండీ బాబు`, నాగార్జునతో `అజాద్`, బాలకృష్ణతో `భలేవాడివి బాసు` చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత పూర్తిగా ఆమె హిందీ సినిమాలకే పరిమితమయ్యింది. 2007 వరకు కంటిన్యూగా సినిమాలు చేసిన శిల్పాశెట్టి మ్యారేజ్ తర్వాత బ్రేక్ తీసుకుంది.
మధ్యలో రెండు మూడు సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసింది. కానీ పూర్తి స్థాయిలో రోల్ చేసింది లేదు. గతేడాది ఆమె `హంగామా 2`లో మెరిసింది. ఇప్పుడు `నికమ్మా` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.