- Home
- Entertainment
- రోజూ టార్చర్ నేను భరించలేను, వాడు మోసం చేశాడు... సిల్క్ స్మిత చనిపోయే ముందు లెటర్ లో ఏం రాసింది!
రోజూ టార్చర్ నేను భరించలేను, వాడు మోసం చేశాడు... సిల్క్ స్మిత చనిపోయే ముందు లెటర్ లో ఏం రాసింది!
సిల్క్ స్మిత అకాల మరణం పొందారు. ఆమె మృతిపై అనుమానాలు ఉన్నప్పటికీ ఆత్మహత్యగా పోలీసులు తేల్చారు. అయితే మరణానికి ముందు ఆమె ఒక లెటర్ రాశారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Silk Smitha
సిల్క్ స్మిత అకాల మరణం పొందారు. ఆమె మృతిపై అనుమానాలు ఉన్నప్పటికీ ఆత్మహత్యగా పోలీసులు తేల్చారు. అయితే మరణానికి ముందు ఆమె ఒక లెటర్ రాశారు.
Silk Smitha
సిల్క్ స్మిత 1996 సెప్టెంబర్ 23న తన నివాసంలో ఫ్యానుకు వేలాడుతూ కనిపించారు. పోలీసులు ఆమె రాసిన ఉత్తరం స్వాధీనం చేసుకున్నారు. సిల్క్ స్మిత ఆ లెటర్ లో సుదీర్ఘంగా తన వేదన వెళ్లగక్కారు. నా ఏడవ ఏట నుండే పొట్టకూటి కోసం కష్టపడుతున్నాను. నాకంటూ ఎవరూ లేరు. ప్రేమించేవారు లేరు. బాబు ఒక్కడే నన్ను అర్థం చేసుకున్నాడు. ఆదరించాడు. మిగతా వాళ్ళందరూ నా సొమ్ము తిన్నారు. నమ్మించి మోసం చేశారు. రాము, రాధాకృష్ణ నాకు చాలా అన్యాయం చేశారు. దేవుడనే వాడు ఉంటే వాళ్ళను చూసుకుంటారు.
Silk Smitha
ఐదేళ్ల క్రితం ఒకడు నాకు జీవితం ఇస్తాను అన్నాడు. ఇప్పుడు నాకు దూరమయ్యాడు. ప్రతి ఒక్కడూ నా రెక్కలు కష్టం తిన్నవాడే. బాబు తప్ప అందరూ నా సొమ్ము తిన్నారు. రోజూ టార్చర్ అనుభవించాను. ఈ బాధ భరించలేకపోతున్నాను... అంటూ సిల్క్ స్మిత రాసుకొచ్చారు. ఈ లెటర్ లో రాము, రాధాకృష్ణ అనే వ్యక్తుల గురించి ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. తనకు అన్యాయం చేసినట్లు వెల్లడించారు.
అయితే ఆ లెటర్లో ఎక్కడా సిల్క్ స్మిత చనిపోతున్నట్లు రాయలేదు. ఇక రాధాకృష్ణ అనే వ్యక్తి సిల్క్ స్మిత సెక్రటరీ. మరణం అనంతరం పోలీసులు అతన్ని విచారించారు. అయితే ఎవరినీ దోషులుగా తేల్చలేదు. ఆమె లేఖ ఆధారంగా సూసైడ్ అని నిర్ధారించారు.
Superstar Rajinikanth seduced Silk Smitha
దశాబ్దానికి పైగా సాగిన కెరీర్లో సిల్క్ స్మిత వందల చిత్రాల్లో నటించారు. చిరంజీవి, రజినీకాంత్, మోహన్ లాల్, బాలకృష్ణ... ఇలా టాప్ స్టార్స్ అందరితో జతకట్టారు. కానీ ఆమె అంత్యక్రియలు దారుణంగా జరిగాయి. ఒక అనాధ శవంలా అయిన వారు, పరిశ్రమ ప్రముఖులు ఎవరూ పక్కన లేకుండా సాగనంపారు. ఆమెతో నటించిన హీరోలు కన్నెత్తి చూడలేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిగాక సిబ్బంది అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే హీరో అర్జున్ మాత్రం ఆ రోజు సిల్క్ స్మిత భౌతికకాయాన్ని చూసేందుకు వెళ్ళాడట.
అర్జున్ తో సిల్క్ స్మిత పలు చిత్రాల్లో నటించారు. మంచి స్నేహితులట. తన ఒంటరితనం, చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా... నేను చనిపోయితే కనీసం నువ్వైనా చూడటానికి వస్తావా? అని సిల్క్ స్మిత తరచుగా అర్జున్ ని అడుగుతూ ఉండేవారట. ఖచ్చితంగా అని అర్జున్ హామీ ఇచ్చారట. ఇచ్చిన మాట ప్రకారం ఎవరేమనుకున్నా పర్లేదని అర్జున్ సిల్క్ స్మిత భౌతికకాయాన్ని సందర్శించారట.
ఈ విషయాన్ని తాజాగా ఓ జర్నలిస్ట్ బయటపెట్టారు. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా డర్టీ పిక్చర్ పేరుతో బయోపిక్ తెరకెక్కించారు. విద్యాబాలన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది.