నన్ను చూసి చైతూ నర్వస్ అయ్యాడు.. మా ఫస్ట్ క్రష్కి అదే వేదికః సీక్రెట్ బయటపెట్టిన సమంత
`నాగచైతన్య నన్ను చూసి నర్వస్ అయ్యాడు. అతను చాలా చిన్న పిల్లాడిలా కనిపించాడు` అని అంటోంది సమంత. టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్యని ప్రేమించి సమంత పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మ్యారేజ్ అయి మూడేళ్లు దాటింది. తాజాగా ఫస్ట్ మీట్, ఫస్ట్ క్రష్ గురించిన సీక్రెట్స్ బయటపెట్టింది సమంత.
సమంత, నాగచైతన్య మొదట `ఏం మాయ చేసావె` చిత్రంలో నటించారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఓ స్వచ్ఛమైన ప్రేమ కథగా పెద్ద విజయాన్ని సాధించింది. చైతన్య, సామ్ లవ్ స్టోరీకి పునాది వేసింది.
ఈ సినిమా టైమ్లో పుట్టిన ప్రేమ దాదాపు ఏడేళ్ల తర్వాత పెళ్లి పీటలు ఎక్కింది. ప్రస్తుతం టాలీవుడ్లో చై-సామ్ క్రేజీ కపుల్గా, ఆదర్శ జంటగా నిలుస్తుంది.
అయితే వీరిద్దరికి ఫస్ట్ మీట్ ఎలా జరిగింది? ఫస్ట్ ఏం మాట్లాడుకున్నారనేది ఇప్పటికీ ఆసక్తికరం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత ఈ విషయాన్ని వెల్లడించింది.
తమ ఫస్ట్ మీట్ ఎక్కడ జరిగింది? ఆ టైమ్లో ఏం జరిగింది? చైతూ రియాక్షన్ ఏంటి? అనే విషయాలను రివీల్ చేసింది సమంత.
`ఏం మాయ చేసావె` సినిమా లుక్ టెస్ట్ సమయంలో ఈ ఇద్దరు కలిశారట. మొదట సెలూన్లో వీరి పరిచయం జరిగిందని చెప్పింది సమంత.
సెలూన్లో రెడీ అవుతున్న సమయంలో చైతన్యని చూసి చిన్న కుర్రాడనుకుందట. `చాలా చిన్నగా ఉన్నాడు` అని తెలిపింది.
అంతేకాదు ఫస్ట్ లుక్ కోసం రెడీ అవుతున్నప్పుడు తన వద్దకు వచ్చాడని, ఆ సమయంలో చైతన్య నర్వస్గా ఫీలవుతున్నాడు. ఆయనలో టెన్షన్ ఉన్నట్టు గమనించిందట. కానీ చాలా స్వీట్గా అనిపించాడని చెప్పింది.
అతని నర్వస్ని చూసి తనే హాయ్ అని పలకరించిందట. అందుకు చై కూడా నర్వస్గానే హాయ్ అని చెప్పాడని తెలిపింది సమంత. అయితే ఫస్ట్ టైమ్ కలిసినప్పుడే తమలో ప్రేమ పుట్టలేదని, తమ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదని చెప్పింది.
`ఏం మాయ చేసావె` పూర్తయ్యేలోపు తమ మనసులు కలిశాయని చెప్పింది. సుదీర్ఘంగా తమ లవ్ స్టోరీ సాగిందని వెల్లడించింది. చై దొరకడం అదృష్టమని చెప్పకనే చెప్పిందీ స్టార్ హీరోయిన్.
సమంత, చైతూ 2017 అక్టోబర్ 7న వైభవంగా వీరి వివాహం జరిగింది. ఇటీవలే మూడేళ్లు పూర్తి చేసుకున్నారు.
ఆ సినిమా తర్వాత వీరిద్దరు కలిసి `ఆటోనగర్ సూర్య`, `మనం`, `మజిలి` చిత్రాల్లో నటించారు. ఇందులో `ఆటోనగర్ సూర్య` పరాజయం చెందగా, మిగిలిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
ప్రస్తుతం సమంత `సామ్జామ్` షో చేస్తున్న విషయం తెలిసిందే. ఇది చివరికి చేసుకుంది. ఫినిషింగ్ టచ్లో భాగంగా చైతన్య గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ ఆసక్తిగా మారింది.
మరోవైపు చైతూ ప్రస్తుతం `లవ్స్టోరీ` చిత్రంలో నటిస్తున్నారు. సాయిపల్లవి హీరోయిన్గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే సమంత తాజాగా భగవాన్ సద్గురుని కలిసిన విషయం తెలిసిందే. ఇది చర్చనీయాంశంగా మారింది.