సైలెంట్ గా సమంత చేస్తున్నది ఇదీ, భలే తెలివైన స్కెచ్
స్టార్ హీరోయిన్ సమంత ఫ్యాషన్ ఐకాన్. అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆమె బ్రాండ్స్ ఎండార్స్ చేసుకోవటంలో ప్రస్తుతం బిజీగా ఉంది. ఆమె సినిమాలు తగ్గిస్తోంది..కొన్నాళ్లు రెస్ట్ తీసుకోబోతోంది అన్న రూమర్స్ కు ఆమె సైలెంట్ గా చెక్ చెప్తోంది.
పర్శనల్ లైఫ్ లో సమస్యలను ప్రక్కన పెట్టి సమంత హైదరాబాద్ వచ్చింది. ఆమె ప్రస్తుతం ఓ యాడ్ కమర్షియల్ షూట్ లో పాల్గొంటోంది. గత కొద్ది కాలంగా వరస సక్సెస్ లతో దూసుకుపోతున్న ఆమెకు బ్రాండ్ ఈక్విటీ బాగా పెరిగింది. దాంతో రకరకాల బ్రాండ్స్ తమ ప్రమోషన్ కోసం ఆమెను ఆశ్రయిస్తున్నాయి. రీసెంట్ గా ఆమె ఓ టూత్ పేస్ట్ కంపెనీ యాడ్ కు పనిచేసిందామె. అలాగే ఇప్పుడు ఓ టాప్ బ్రాండ్ షూటింగ్ లో పాల్గొంటోంది.
అలాగే సమంత సోషల్ మీడియా ద్వారా కోట్లు సంపాదిస్తోంది. ఒక్క ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఒక పోస్ట్ వేస్తె లక్షలు లక్షలు వస్తాయి. అందుకే, ఇప్పుడు ట్విట్టర్ లో యాక్టివిటీ తగ్గించింది సమంత. పూర్తిగా ఇన్ స్టాగ్రామ్ పైనే ఫోకస్.
సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్గా ఉండే సమంత.. ఎప్పటికప్పుడు తన అభిమానులతో ఇంటరాక్ట్ అవుతుంటారు. యోగా, జిమ్ సెషన్స్ మొదలుకొని.. తన హాలీడే ట్రిప్స్ వరకూ ప్రతీది ఫోటోల రూపంలో ఫ్యాన్స్తో పంచుకుంటారు.
Samantha
స్టార్ హీరోయిన్ సమంత ఫ్యాషన్ ఐకాన్. అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆమె బ్రాండ్స్ ఎండార్స్ చేసుకోవటంలో ప్రస్తుతం బిజీగా ఉంది. ఆమె సినిమాలు తగ్గిస్తోంది..కొన్నాళ్లు రెస్ట్ తీసుకోబోతోంది అన్న రూమర్స్ కు ఆమె సైలెంట్ గా చెక్ చెప్తోంది.
Samantha
సమంత ప్రస్తుతం గుణశేఖర్ తీస్తోన్న “శాకుంతలం” షూటింగ్ లో పాల్గొంటోంది. తెలుగులో మరో సినిమా సైన్ చెయ్యలేదు. స్లో అండ్ స్టడ్ అన్నట్లుగా ఉంది పాలసీ. పలు బ్రాండ్స్కు ప్రచారం చేస్తోన్న సమంత.. అందుకు సంబంధించిన ఫోటోషూట్స్ను తరచూ తన ఇన్స్టా అకౌంట్లో పోస్ట్ చేస్తారు.
Samantha
ఆమె రీసెంట్ గా రెండు ఫ్యాషన్ బ్రాండ్ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ ఫోటో షూట్ చేశారు. అందులో ఒకటి ప్రముఖ డిజైనర్ నీతా లుల్లాది కాగా.. మరొకటి లూయిస్ విట్టన్ బ్రాండ్ ఉత్పత్తులది. కొద్దిరోజుల క్రితం గోవా టూర్కు వెళ్లిన సమంత.. అక్కడి విశేషాలను తెలియజేస్తూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అవి కాస్తా క్షణాల్లో వైరల్గా మారాయి.
Samantha
ఒకవైపు సినిమాలు చేస్తూనే.. సమంత సమాజ సేవను కూడా చేస్తుంటారు. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది అనాధలకు అండగా నిలవడమే కాకుండా ఎందరికో చేయూతను అందిస్తున్నారు.
Samantha
‘జెస్సీ’, ‘ఇందు’, ‘బిందు’, ‘గీత’, ‘శశి’, ‘అంజలి’, ‘సమీర’, ‘రామలక్ష్మి’, ‘మధురవాణి’, ‘శ్రావణి’ తదితర వైవిధ్య పాత్రలు పోషించి ప్రేక్షకుల హృదయాల్ని దోచుకుంది నటి సమంత (Samantha).
Samantha
వైవిధ్యతని వెండితెరపైనే కాకుండా డిజిటల్ మాధ్యమాల్లోనూ చూపించాలనుకుంది. అలా చేసిన ప్రయత్నం, ప్రయోగమే ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ (The family man 2) వెబ్ సిరీస్. ఇందులో ‘రాజీ’ పాత్రని పోషించి, విమర్శకుల ప్రశంసలూ అందుకుంది.
డీ గ్లామర్గా కనిపించి ‘తను సమంతనేనా?’ అనే ఆశ్చర్యంలో పడేసింది. ఉత్తమ నటిగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (Indian film festival of melbourne) అవార్డు దక్కించుకుంది.
సామాజిక మాధ్యమాల ఖాతాల్లో అక్కినేని సమంత పేరుని తొలగించి ఎస్ అని పెట్టారు. అది హాట్ టాపిక్ అయింది. దీనిపై మాట్లాడుతూ.. అది హాస్యాస్పదమైన గాసిప్. సాధారణంగా నేను రూమర్స్ కు స్పందించను. ఇప్పుడూ అంతే అని చెప్పుకొచ్చారు.
‘శాకుంతలం’లో నటించడం గురించి చెప్తూ.. పీరియాడికల్ చిత్రంలో నటించాలని ఎప్పటి నుంచో కోరిక. అది ‘శాకుంతలం’తో నెరవేరింది. ఈ సినిమాకి పని చేయడం గొప్ప అనుభూతిని పంచింది. ఇటీవల చిత్రీకరణ పూర్తయింది. సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్), వి.ఎఫ్.ఎక్స్ (విజువల్ ఎఫెక్ట్స్)లతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని ఆసక్తి ఎదురుచూస్తున్నా అన్నారామె.
‘కాతువాకుల రెండు కాదల్’ చిత్రం కోసం నయనతార, విజయ్ సేతుపతితో నటించడం గురించి చెప్తూ.. నేనెప్పుడూ కామెడీ పాత్రని పోషించడాన్ని ఆనందిస్తా. ఈ చిత్రం పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ కావడంతో బాగా ఎంజాయ్ చేస్తూ నటించా. ఇందులో భాగమవడం, ఇద్దరు సూపర్స్టార్లు నయనతార, విజయ్ సేతుపతితో కలిసి పనిచేయడం మంచి థ్రిల్ పంచింది. ఇది తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన సినిమా. అందరినీ నవ్విస్తుందనే నమ్మకం నాకు ఉంది.