ఆ పంచ్కి సమంత దవడ పగిలిపోయింది.. అరగంటపాటు అల్లాడిపోయిన స్టార్ హీరోయిన్..
సమంత రియల్ లైఫ్లో ఎంతో కష్టాలు ఫేస్ చేసింది. ప్రతికూల పరిస్థితులపై, హార్డ్ డేస్పై ఆమె పోరాడింది. కష్టాలపై ఫైట్ చేసి నిలబడింది. క్లిష్ట సమయంలో తనని తాను జయించింది. అలాంటి ఫైట్సే సినిమాలోనూ చేసిందట. కానీ దవడ పగిలిపోయిందని చెప్పింది.

సమంత ప్రస్తుతం `యశోద` చిత్రంలో నటించింది. ఈ సినిమా నవంబర్ 11న విడుదల కానుంది. సమంత తన అనారోగ్యం కారణంగా ప్రమోషన్లో పాల్గొనలేకపోయింది. తాజాగా సుమతో ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తన అనారోగ్యంపై స్పందిస్తూ ఎమోషనల్ అయ్యింది. ఒక్కో రోజు ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నానా? అనిపించిందంటూ కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే.
తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. తనకు యాక్షన్ అంటే ఇష్టమని తెలిపింది. డాన్సు కంటే తనకు యాక్షన్ చేయడమే ఇష్టమని పేర్కొంది. ఫైట్ సీన్లు చేస్తున్నానంటే రెండు మూడు రోజుల నుంచే ఎగ్జైట్ అవుతానని పేర్కొంది. యశోదలోనూ యాక్షన్ చేశానని పేర్కొంది. సినిమా చివరల్లో వచ్చే ఫైట్ సీన్ అదిరిపోయేలా ఉంటుందని తెలిపింది.
మరోవైపు కొన్నిసార్లు దెబ్బలు తగులుతుంటాయని చెప్పింది. అలా `యశోద` ఫైట్ సీన్లలోనూ తనకు దెబ్బలు తగిలాయని, దవడ పగిలిపోయిందని పేర్కొంది. ఫైట్ సీన్లో తన ముఖంపై పంచ్ పడిందని పేర్కొంది. దీంతో అరగంట సేపు అల్లాడిపోయినట్టు తెలిపింది. ఆ దెబ్బకి ముఖం వాచిపోయిందని చెప్పింది సమంత. కానీ ఫైట్ సీన్లని ఎంజాయ్ చేస్తానని తెలియజేయడం విశేషం.
మీ సినిమాలు ఎలా చూస్తారని సుమ అడగ్గా తాను థియేటర్లో సినిమాలు చూస్తానని తెలిపింది. ఆల్మోస్ట్ ప్రతి సినిమా తాను థియేటర్లలో ఆడియెన్స్ మధ్య కూర్చొని సినిమాలు చూస్తానని చెప్పి షాకిచ్చింది. మరోవైపు `యశోద` సినిమా ఎందుకు చూడాలో తెలిపింది. సరోగసి అనే కథ బ్యాక్ డ్రాప్లో జరిగే క్రైమ్ ఎలాంటిదో తెలిపే ఈ చిత్రంలో కథ కొత్తగా ఉంటుందని, సంగీతం, దర్శకుల టేకింగ్, యాక్షన్ సీన్లు అదిరిపోయేలా ఉంటాయని పేర్కొంది.
సమంత నటించిన తొలి పాన్ ఇండియా చిత్రమిది. హరి హరీష్ దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ పతాకాలపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్నిముకుందన్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో నవంబర్ 11న సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకి తెలుగు, తమిళంలో సమంతనే డబ్బింగ్ చెప్పడం విశేషం.