హనీమూన్లో చైతూ - సమంత ఏం చేశారో తెలుసా?
సినీ తారలకు సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్ని తెలుసుకునేందుకు అభిమానులు ప్రయత్నిస్తుంటారు. ఇక నాగ చైతన్య, సమంత లాంటి స్టార్ కపుల్కు సంబంధించి విషయాల గురించి అయితే ప్రతీ ఒక్కరు తెగ సెర్చ్ చేస్తుంటారు. లాక్ డౌన్ సమయంలో సినిమా అప్డేట్స్ లేకపోవటంతో అభిమానులు గతంలో సెలబ్రిటీ విషయాల మీద దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో చైతు, సమంతలు హనీమూన్ ట్రిప్లో ఎలా స్పెండ్ చేశారన్న విషయాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
పెళ్లి అయిన వెంటనే చైతూ సమంతలు చిన్న హనీమూన్ ట్రిప్కు మాత్రమే వెళ్లారు. అప్పటికే కమిట్ అయిన సినిమాలు పెండింగ్ ఉండటంతో అవి పూర్తి చేసిన తరువాత మరోసారి లాంగ్ ట్రిప్ ప్లాన్ చేశారు. అక్టోబర్ 2017లో పెళ్లి చేసుకున్న నాగచైతన్య సమంత అ దే ఏడాది డిసెంబర్లో లాంగ్ హాలీడేకు వెళ్లనున్నట్టుగా తెలిపారు.
అయితే హనీమూన్కు లండన్ వెళ్లిన సమయంలో సమంత కొన్ని రొమాంటిక్ ఫోటోలను షేర్ చేసింది. ముఖ్యంగా ఆ ట్రిప్లో వారిద్దరు ఐదు పనులు చేశారు.
మినీ హనీమూన్కు లండన్ వెళ్లిన జంట అక్కడ రెస్టారెంట్లలో ఫుడ్ను ఎంజాయ్ చేసిన ఫోటోలను సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీల్లో పోస్ట్ చేసింది.
అంతేకాదు అక్కడ గుస్సీ కంపెనీ ఫ్లిప్ ప్లాప్స్ను కొన్న విషయాన్ని కూడా సామ్ వెల్లడించింది. ఆ ఫ్లిప్ ఫ్లాప్స్ ఫోటోతో పాటు ఇలాంటి బ్యూటీపుల్ పాదరక్షలు ప్రతీ అమ్మాయి తన కలెక్షన్ లో ఉండాలని కోరుకుంటుంది అంటూ కామెంట్ చేసింది.
సమంత మంచి నటి అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆమె మంచి ఫోటోగ్రాఫర్ కూడా అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. అందుకే మినీ హనీమూన్ సమయంలో భర్త నాగచైతన్యను ఇంట్రస్టింగ్గా ఫోటోలు తీసింది.
మినీ హనీమూన్లో క్లబ్ హోపింగ్తో పాటు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ టైం స్పెండ్ చేశారు. అంతేకాదు కొన్ని ఫోటోల్లో బాక్సింగ్ చేస్తూ కూడా కనిపించాడు సామ్ చై.
మరో ఫోటోలో తన చేతికి ఉన్న డైమండ్ రింగ్ కనిపించేలా ఫోజ్ ఇచ్చింది సమంత, అమ్మడు బికినీలో ఉన్న ఆ ఫోటో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది.
నాగచైతన్య, సమంత అక్టోబర్ 6, 2017న పెళ్లి చేసుకున్నారు. సాంప్రదాయ బద్ధంగా జిరగిన వివాహం తరువాత అక్టోబర్ 8న క్రిస్టియన్ సాంప్రధాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.