- Home
- Entertainment
- నన్ను ఫాలో కావద్దు, నేను చేసిన తప్పు మీరు చేయవద్దు.... కెజిఎఫ్ డైరెక్టర్ ఇలా అనేశాడేంటి?
నన్ను ఫాలో కావద్దు, నేను చేసిన తప్పు మీరు చేయవద్దు.... కెజిఎఫ్ డైరెక్టర్ ఇలా అనేశాడేంటి?
ప్రశాంత్ నీల్ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. బడా స్టార్స్ ఆయనతో సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాంటి దర్శకుడు నన్ను ఫాలో కావద్దంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసింది నాలుగు సినిమాలే. ఈ నాలుగు సినిమాలు తీయడానికి ఆయనకు పదేళ్ల సమయం పట్టింది. ఉగ్రం మూవీతో ప్రశాంత్ నీల్ దర్శకుడిగా మారారు. రెండో చిత్రమే పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేశాడు.
Prashanth Neel
2018లో విడుదలైన కెజిఎఫ్ ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసింది. దానికి కొనసాగింపుగా వచ్చిన కెజిఎఫ్ 2 అంతకు మించిన వసూళ్లు రాబట్టింది. కెజిఎఫ్ 2 దాదాపు రూ. 1200 కోట్లు కొల్లగొట్టింది. ఇక ప్రశాంత్ నీల్ నాలుగో చిత్రం సలార్.ప్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ గత ఏడాది విడుదలైంది. అందుకు కారణాలు ఏమిటో వివరించిన ప్రశాంత్ నీల్... తాను చేసిన తప్పు మిగతావాళ్ళు చేయవద్దని అంటున్నాడు .
ప్రభాస్-పృథ్విరాజ్ సుకుమారన్ మిత్రులుగా నటించారు. సలార్ మూవీ వరల్డ్ వైడ్ రూ. 700 కోట్ల వసూళ్లు రాబట్టింది. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ సలార్ 2 చేయనున్నారు. అసలు కథ అంతా సలార్ 2 లోనే ఉంటుందట. షూటింగ్ కి కూడా సిద్ధం అవుతున్నట్లు సమాచారం. స్క్రిప్ట్ లాక్ చేశారట .
సలార్ 2 అనంతరం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మూవీ చేశాడు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ ఫస్ట్ మూవీ ఉగ్రం తెరకెక్కించడానికి ఏకంగా నాలుగేళ్లు సమయం పట్టిందట.
అయితే సుభాష్ రెడ్డి కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. కొన్నేళ్ల క్రితమే ప్రశాంత్ నీల్ తండ్రి చనిపోయారు. ఆయనను నీలకంఠాపురంలోనే అంత్యక్రియలు చేసి.. మెమోరియల్ కూడా కట్టారు. అప్పుడప్పుడు నీల్ తన హోమ్ విలేజ్ కు ఫ్యామిలీతో పాటు వచ్చి వెళ్తుంటాడట.ఇక కేజీఎఫ్ 2 రిలీజ్ రోజు కూడా ప్రశాంత్ నీల్ ఈ గ్రామానికి వచ్చిన తన తండ్రి సమాధిదగ్గర ఆశీర్వాదాలు తీసుకుని వెళ్లాడట.
ప్రశాంత్ నీల్ కి ఎలాంటి అనుభవం లేదట. ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయలేదట. కనీసం ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేదట. డైరెక్ట్ గా మెగా ఫోన్ పట్టే ఛాన్స్ వచ్చింది. అయితే అనుభవం లేకపోవడం వలన ఉగ్రం పలుమార్లు రీ షూట్ చేశారట . సినిమా ఎలా తీయాలో నేర్చుకుని తెరకెక్కించే నాటికి చాలా సమయం పట్టిందట.
\
ఉగ్రం షూటింగ్ ఆలస్యం కావడంతో చిత్ర యూనిట్ తో పాటు తాను కూడా ఒత్తిడికి గురయ్యాడట. ఆరు నెలల్లో పూర్తి కావాల్సిన సినిమా నాలుగేళ్ల సమయం తీసుకుందట. కాబట్టి ఈ విషయంలో నన్ను ఫాలో కావద్దు. నేను చేసిన మిస్టేక్ మీరు చేయవద్దు. అసిస్టెంట్ గా పని నేర్చుకుని తర్వాత సినిమా తెరకెక్కించండి అని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు. ఉగ్రం మూవీ విడుదలై పదేళ్లు అవుతున్న సందర్భంగా ప్రశాంత్ నీల్ ఈ కామెంట్స్ చేశాడు. ఎలాంటి అనుభవం లేకుండా తీసినప్పటికీ ఉగ్రం భారీ విజయం సాధించింది. విచిత్రం ఏమిటంటే... ఉగ్రం మూవీ సలార్ కథకు దగ్గరగా ఉంటుంది. ఉగ్రం కి కొన్ని మార్పులు చేసి ప్రశాంత్ నీల్ సలార్ తెరకెక్కించాడు...