- Home
- Entertainment
- Guppedantha manasu: రిషి కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేసిన సాక్షి.. వసు, ఈగో మాస్టర్ రొమాన్స్!
Guppedantha manasu: రిషి కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేసిన సాక్షి.. వసు, ఈగో మాస్టర్ రొమాన్స్!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 4వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. దేవయాని సాక్షితో రిషికి నువ్వంటే ఇష్టం లేదు, రిషి నిన్ను ప్రేమించడం లేదు, రిషికే కాదు నువ్వంటే ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు, అని కళాకండిగా చెప్పేస్తుంది. మొన్నటి వరకు రిషితో నాకు పెళ్లి చేస్తానని మీరే చెప్పారు కదా? అప్పుడే ఎందుకు మారిపోయారు ఆంటీ? అని సాక్షి దేవయానిని అడుగుతుంది. రిషికి నీకు పెళ్లి చేద్దాం అనుకున్నాను. కానీ రిషి మనసులో నువ్వు లేవని తెలిసిన తర్వాత కూడా బలవంతంగా నేను ఎలా పెళ్లి చేయగలను?
నీకు నచ్చింది నువ్వు చేసుకో కానీ కాలేజ్ కి, ఇంటికి, వసుధారకి ఏ సమస్య వచ్చినా సరే ఇంట్లో అందరం ఒకటయ్యాము. నువ్వు ఏం చేయలేవు అని దేవియాని అంటుంది.అప్పుడు సాక్షి, ఇంకో రెండు రోజుల్లో మాకు లగ్నపత్రికలు రాకపోతే మీరే నా చావుకు కారణం అనే విషయం తాగి ఇక్కడ చచ్చిపోతాను అని బెదిరించి, మీ కుటుంబం అందరినీ నాశనం చేయకపోతే నా పేరు సాక్షి కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సీన్లో,రిషికి ఆ కారులో ఏమైందో అర్థం కాక ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటాడు.
ఈ లోగా అక్కడ గ్రామంలో ఒక మనిషి వచ్చి నమస్కారం పెట్టి మీ వల్లే మా ఇద్దరు పిల్లలు చదువుకోగలుగుతున్నారు. మీరు చేసిన సహాయానికి ధన్యవాదాలు అని రిషికి ధన్యవాదాలు చెప్పి, మీరేం అనుకోకపోతే కార్ బాగు అయ్యేంతవరకు మా ఇంట్లో ఉండండి అని చెప్తాడు. ఈలోగా దేవయాని, కుటుంబం అందరి మధ్య కూర్చొనీ బాధపడుతుంది. "మీ అందరి ముందే నన్ను అది ఎన్నెన్ని మాటలు అనింది" అని సాక్షిని తిడుతూ ఉంటుంది. మిగిలిన వాళ్ళకి అది నిజమో నాటకము అర్థం కాదు.
ఈ సమయంలో నాకు ఋషిని చూడాలని ఉంది ఒంట్లో బాలేదు నా ఫోన్ చెప్పి రిషి ని ఫోన్ చేయవా అని దేవయాని గౌతమ్ ని అడుగుతుంది. ఈలోగా దేవయాని మనసులో "నా మైండ్ ఏంటో, నా ఆలోచన ఏంటో ఎవరూ కనిపెట్టలేరు" అనుకుంటుంది. మరోవైపు వసుధార, రిషి అతని ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్ళ కుటుంబం అంతా రిషికిఎంతో బాగా మర్యాదలు ఇస్తారు. ఎలాగో కార్ మెకానిక్ రావడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఇక్కడే భోజనం చేయండి అని ఆ కుటుంబం అంతా రిషి ని అడుగుతారు.
రిషి సరే అని అంటాడు. ఆ రాత్రి వసుధార ఆ ఇంట్లో ఉన్న పిల్లలతో చదువుకుంటున్న సమయంలో అక్కడ కరెంటు పోతుంది. పక్కింట్లో కరెంటు ఉంది,ఇక్కడ ఇంట్లో కరెంట్ లేదు ఎందుకు అని చూడ్డానికి వెళ్తుంది. ఆ తర్వాత సీన్లో దేవయాని వాళ్ళ కోడలిని తిడుతూ ఉంటది అప్పుడు జగతి అక్కడికి వచ్చి, ఏమైంది అని అడుగు సాక్షి మీ అందరినీ వదిలి నన్ను జైలుకు పంపుతా అంటుంది. మన కుటుంబం పరువు ఏమైపోతుంది అని నేను బాధపడుతున్నాను అని అంటుంది.
మరోవైపు వసుధరావు అక్కడ కరెంటు ఎందుకు పోయింది అని చూస్తూ ఉంటుంది అక్కడ ఫ్యుస్ పోయింది అని తెలుసుకొని దాన్ని బాగు చేస్తుంది. ఈలోగా కుర్చీలో నుంచి పడిపోతున్నప్పుడు రిషి వసుధారని పట్టుకుంటాడు.ఈ సమయంలో తన మనసులో మాట రిషి చెబుదాం అనుకుంటుంది వసుధార ఈ లోగా కరెంట్ వచ్చిందా అని ఆ పిల్లలు అడగగా ఆ ఫ్యూజ్ ని అక్కడ పెట్టి వచ్చేస్తారు కరెంట్ వచ్చేస్తుంది అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు భోజనానికి రమ్మని పిలుస్తారు.
ఎలాగో ఇంత రాత్రి అయింది కదా మెకానిక్ కూడా రాలేదు, రాత్రికి ఇక్కడే ఉండండి అని వాళ్ళు రిషి ని అడుగుతారు. రిషి సరే అంటాడు. ఈలోగా దేవయాని కుటుంబ సభ్యులందరూ దేవయాని నటిస్తుందో, నిజంగానే చేస్తుందో అర్థం కాక అయోమయ స్థితిలో ఉంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!!