కరీనా ప్రెగ్నెన్సీపై సైఫ్ మొదటి భార్య కొడుకు రియాక్షన్!
కరోనా సమయంలో అన్ని విషాద వార్తలే కాదు కొన్ని శుభవార్తలు కూడా వినిపిస్తున్నాయి. వరుసగా యంగ్ జనరేషన్ పెళ్లిళ్లు చేసుకుంటుండగా సీనియర్ స్టార్స్ ఫ్యామిలీని పెంచుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ బెబో కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్లు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టుగా ప్రకటించాడు. ఈ విషయంపై సైఫ్ మొదటి భార్య కొడుకు ఇబ్రహిం అలీ ఖాన్ కూడా స్పందించాడు.
సైఫ్ అలీఖాాన్ సోదరి సోహఅలీ ఖాన్ తన అన్న మరో సారి తండ్రి అవుతున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ఫన్నీ పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ పోస్ట్ తన అన్నకు కొత్త పేరు కూడా ఇచ్చింది.
సోహా సైఫ్ను క్వాడ్ ఫాదర్ (నాలుగు సారి తండ్రి) అంటూ కామెంట్ చేసింది. ఈ పోస్ట్లోో కరీనాను కూడా ట్యాగ్ చేసింది సోహా. మీరు సేఫ్ గా ఉండండి అంటూ సజెస్ట్ చేసింది సోహా.
అదే పోస్ట్ పై సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య కుమారుడు ఇబ్రహిం అలీ ఖాన్ కూడా స్పందించాడు. సైఫ్ కరీనాల తొలి సంతానం తైమూర్ అలీఖాన్ ఉద్దేశిస్తూ కామెంట్ చేశాడు ఇబ్రహిం.
సైఫ్ మొదటి భార్య అమృతకు విడాకులు ఇచ్చి కరీనాను పెళ్లి చేసుకున్నా.. మొదటి భార్య పిల్లలు సారా అలీ ఖాన్, ఇబ్రహింలు వారితో సన్నిహితంగానే ఉన్నారు.
తరుచూ వారి ఇంటికి వెళ్లి మరీ సైఫ్, కరీనాలతో స్పెండ్ చేస్తుంటారు సారా, ఇబ్రహిం.
సైఫ్, కరీనాలు 2012 అక్టోబర్లో పెళ్లి చేసుకున్నారు. వీరి డిసెంబర్ 2016లో తైమూర్ అలీఖాన్ జన్మించాడు.
ఇక సినిమాల విషయానికి వస్తే కరీనా ప్రస్తుతం తక్త్ సినిమాలో నటిస్తోంది. కరణ్ జోహార్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాలో రణవీర్ సింగ్, అలియా భట్, విక్కీ కౌషల్, జాన్వీ కపూర్లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా సినిమాలోనూ నటిస్తోంది కరీనా.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కరీనా తమకు ఇప్పట్లో రెండో బిడ్డను కనే ఆలోచన లేదని చెప్పింది. కానీ ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే కరీనా రెండో బిడ్డకు జన్మనివ్వనుందన్న వార్త బయటకు వచ్చింది.
కరీనా ప్రెగ్నెన్సీపై ఆమె తండ్రి రణదీర్ కపూర్ కూడా స్పందించారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఒకరికి ఒకరు కంపెనీ ఇవ్వడానికి ఇద్దరు పిల్లలు ఉండాలి అంటూ ఆయన కామెంట్ చేశాడు.