జీన్స్ లో మెరిసిన సాయి పల్లవి, ఫోటోస్ వైరల్.. అది నా గొప్పతనం కాదు..
సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా నటించిన లవ్ స్టోరీ చిత్రం ఈ శుక్రవారం గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా గడుపుతోంది.
సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా నటించిన లవ్ స్టోరీ చిత్రం ఈ శుక్రవారం గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా గడుపుతోంది. ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి, అమీర్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు.
ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్స్ లో చైతు, సాయి పల్లవి జోడి మధ్య కెమిస్ట్రీ అదిరింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాలో మ్యాజిక్ వర్కౌట్ అయితే లవ్ స్టోరీ మూవీ భారీ విజయం ఖాయం.
సాయి పల్లవి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడుపుతోంది. ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది సాయి పల్లవి. సాయి పల్లవి పాటలు యూట్యూబ్ లో 100 మిలియన్ పైగా వ్యూస్ సాధిస్తున్నాయి. లవ్ స్టోరీ చిత్రంలోని సారంగ దారియా సాంగ్ 300 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. అలాగే ఫిదా చిత్రంలోని 'వచ్చిండే' సాంగ్ కూడా ఆ ఘనత సాధించింది. ఈ ఘనత సాయి పల్లవికి మాత్రమే సాధ్యం.
దీనిపై సాయి పల్లవి స్పందిస్తూ.. నాకన్నా డాన్స్ బాగా చేసేవాళ్ళు చాలా మందే ఉన్నారు. నా అదృష్టం కొద్దీ ఆ పాటల్లో పెర్ఫామ్ చేసే అవకాశం నాకు వచ్చింది. మంచి దర్శకులు, కొరియోగ్రాఫర్స్ దొరికారు. అంతే కానీ నా గొప్పతనం ఏమి లేదు అంటూ సాయి పల్లవి తన హుందా తనాన్ని చాటుకుంది.
ఇక తాను నటిస్తున్న విరాటపర్వం,శ్యామ్ సింగ రాయ్ చిత్రాల షూటింగ్ పూర్తయింది అని సాయి పల్లవి తెలిపింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొంది.
ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై సాయి పల్లవి మరోసారి స్పందించింది. తన డ్యాన్స్ ని చిరంజీవి గారు మెచ్చుకోవడం ఆయన గొప్పతనం. ఇక బోళా శంకర్ చిత్రానికి నో చెప్పడంపై సాయి పల్లవి మరోసారి స్పందించింది. బోలా శంకర్ చిత్రంతమిళ తమిళ వేదాళం చిత్రానికి రీమేక్.
ఆల్రెడీ ఒకరు చేసిన పాత్ర చేయాలంటే నాకు భయం. ఆ స్థాయిలో నటించగలమా లేదా అనే ఫిలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ తో క్యారెక్టర్ చేస్తే పూర్తి న్యాయం చేయలేను. అంతకు మించి మరేం లేదు. చిరంజీవి గారితో వర్క్ చేయడాన్ని ఎవరు కాదంటారు అని సాయి పల్లవి తెలిపింది.