తన రెండు ఖరీదైన కార్లు అమ్మేసిన రేణూ దేశాయ్
రేణూ తన కార్లను ఆర్థిక సమస్యలతో అమ్మేయలేదు. ఇటీవల ఓ మీడియాలో పర్యావరణ కాలుష్యానికి లగ్జరీ కార్లు ఏ మేరకు కారణమవుతున్నాయో తెలుసుకున్న తరువాత ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. ఇది విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులు, ఫాలోవర్స్తో పంచుకుంది రేణూ దేశాయ్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఇటీవల తరుచూ వార్తల్లో కనిపిస్తోంది. ఇటీవల సోసైటీకి సంబంధించిన మెసేజ్లు ఇస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది రేణూ. తాజాగా ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి ఓ సంచలన నిర్ణయం తీసుకొని అందరికీ షాక్ ఇచ్చింది.
ఇటీవల రేణూ దేశాయ్, స్త్రీ సాధికారత, మహిళ స్వతంత్య్రానికి సంబంధించి సుధీర్ఘమైన పోస్ట్ చేసి అందరినీ ఆకట్టుకుంది. తాజాగా మరో ఆసక్తికర పోస్ట్ చేసింది. తన దగ్గర ఉన్న రెండు లగ్జరియస్ కార్లను అమ్మేసినట్టుగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది రేణూ దేశాయ్.
అయితే రేణూ తన కార్లను ఆర్థిక సమస్యలతో అమ్మేయలేదు. ఇటీవల ఓ మీడియాలో పర్యావరణ కాలుష్యానికి లగ్జరీ కార్లు ఏ మేరకు కారణమవుతున్నాయో తెలుసుకున్న తరువాత ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. ఇది విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులు, ఫాలోవర్స్తో పంచుకుంది రేణూ దేశాయ్.
మార్పు మన నుంచే మొదలు కావాలన్న మంచి ఉద్దేశంతో తాను ముందుగా కార్లు తీసేసి తరువాత మరొకరి చెప్పాలని ఈ పని చేసినట్టుగా వెల్లడించింది రేణూ దేశాయ్. పెట్రోల్, డీజిల్ కార్లు వాడటం ద్వారా గాలీలో కార్బన్ శాతం పెరిగిపోతుందని, ప్రజల ఆరోగ్యంగా తీవ్రంగా దెబ్బతింటుందని అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది.
కార్లలంటే ఎంతో ఇష్టపడే రేణూ దేశాయ్ దగ్గర ఆడి ఏ6, పోర్షే బాక్ట్సెర్ మోడల్స్కు సంబంధించి రెండు అత్యంత అధునాతన సదుపాయాలు ఉన్న కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు కార్లు అమ్మిన రేణూ ఓ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసింది. ఈ నిర్ణయం కొంత బాధ కలిగించినా బాధ్యత కలిగిన వ్యక్తిగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆమె వెల్లడించారు.
ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన రేణూ తన ఫాలోవర్స్ ను కూడా ఇంధన వినియోగం తగ్గించాలని కోరింది. అంతేకాదు, వీలైనంత వరకు పెట్రోల్, డీజిల్ కార్లకు బదులుగా ఎలక్ట్రిక్ కార్లను వాడాలని ఆమె కోరింది. ఈ నిర్ణయం ద్వారా తాను ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు ఎంతో డబ్బు కూడా మిగిల్చుకుంటున్నా అని చెప్పింది.