అందంతో పిచ్చెక్కిస్తూ.. వరుస ఆఫర్లతో సర్ప్రైజ్ చేస్తున్న రెజీనా..
రెజీనా మళ్లీ పుంజుకుంటోంది. వరుసగా భారీ సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతుంది. ఓ వైపు అందాలతో పిచ్చెక్కిస్తూనే వరుస ఛాన్స్ లతోనూ మతిపోగొడుతుందీ హాట్ అందాల భామ. ఆ వివరాలు చూస్తే..
రెజీనా ప్రస్తుతం ఓ సౌత్ కొరియన్ రీమేక్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. సురేష్ ప్రొడక్షన్, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్ సంస్థలు కలిసి కొరియన్ సినిమాని తెలుగులోకి తీసుకొస్తున్నారు.
గతంలో `మిస్ గ్రానీ` అనే సౌత్ కొరియన్ చిత్రాన్ని సమంతతో `ఓ బేబీ`గా రీమేక్ చేసి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు `మిడ్నైట్ రన్నర్స్` అనే చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారు. దీనికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. తాజాగా దీన్ని అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమాలో రెజీనా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆమెతోపాటు నివేదా థామస్ కీలక పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చిత్రీకరణ దశలో ఉండటం విశేషం. షూటింగ్లో దిగిన ఫోటోని పంచుకున్నారు.
ఇక దీంతోపాటు రెజీనా బాలీవుడ్ ఆఫర్ని అందుకుందట. బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో `ఛత్రపతి` రీమేక్లో నటించబోతుందని సమాచారం.
వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ `ఛత్రపతి` రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. ఇందులో హీరోయిన్గా రెజీనాని ఫైనల్ చేశారట.
ఇలా రెజీనా ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ రెండు రీమేక్ చిత్రాల్లో నటిస్తుండటం విశేషం. మరోవైపు తమిళంలో అరడజను సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది రెజీనా. తెలుగులో `ఆచార్య`లో స్పెషల్ సాంగ్లో మెరవనుంది.
రెజీనా చివరగా `ఎవరు` చిత్రంలో నటించి విజయాన్ని అందుకుంది.కానీ తెలుగులో ఆఫర్స్ లేవు. ఆమె తెలుగుకి నో చెప్పిందా? ఆమెకి ఆఫర్స్ రావడం లేదా? అన్నది సస్పెన్స్ గా మారింది.
ఇప్పుడొస్తున్న సినిమాలతో ఆమె మళ్లీ తెలుగులో బిజీ హీరోయిన్ కాబోతుందని చెప్పొచ్చు.
రెజీనా లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు.
రెజీనా లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు.
రెజీనా లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు.