సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న రష్మీ కొత్త ఫోటోలు
ఓ వైపు సిస్టర్ అనసూయ సోషల్ మీడియాని ఊపు ఊపేస్తుంటే, తాను మాత్రం తక్కువ తిన్నానా అని అక్కకి పోటీ ఇస్తోంది రష్మీ గౌతమ్. టీవీ షోలకు గ్లామర్ని అద్దిన రష్మీ గౌతమ్ ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో సోషల్ మీడియా అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా కొత్త ఫోటో షూట్తో రచ్చ చేసింది.
బ్లాక్ వైట్ మిక్స్ డ్రెస్లో, గ్రీన్ డ్రెస్తోపాటు బ్లూ జీన్ అండ్ టాప్ డ్రెస్సుల్లో రష్మీ తాజా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి. ఇంకా చెప్పాలంటే రచ్చ చేస్తున్నాయి.
విరహం, పొగరు, ధైర్యం, కాన్ఫిడెన్స్ మేళవించిన రష్మి భామ లుక్స్ కి నెటిజన్లని ఫిదా అవుతున్నారు. తెగ కామెంట్లు చేస్తున్నారు.
రష్మీ గౌతమ్ టీవీ రంగంలో చాలా ఫేమస్. రష్మి పేరు వింటే `జబర్థస్త్` గుర్తుకొస్తుంది. అంతేకాదు అందులో కమేడియన్ సుడిగాలి సుధీర్, రష్మిల మధ్య రొమాన్సే గుర్తుకొస్తుంది. వీరిద్దరి మధ్య ఏదో ఉందనే పుకారు, స్టేజ్పై వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ `జబర్దస్త్` షోకి గ్లామర్ తెచ్చింది. అంతేకాదు పాపులర్ చేసింది.
ఈటీవీలో జబర్దస్త్ షో బాగా పాపులర్ కావడానికి అనసూయ, రష్మీలే కారణం. కామెడీ స్కిట్ల కోసమే కాదు, ఈ ఇద్దరు హాట్ అందాల భామలను చూసేందుకూ కూడా ఈ షోని తిలకించే ఆడియెన్స్ కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
`జబర్దస్త్`, `ఢీ` వంటి పలు టెలివిజన్ షోస్లో రష్మీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సెక్సీ బ్యూటీ `గర్ల్ పవర్-సరిలేరు మనకెవ్వరు` షోకి హోస్ట్ గా వ్యవహరిస్తుంది.
టీవీ షోస్తోపాటు సినిమాల్లోనూ నటిస్తూ తన సత్తా చాటుతోంది. మంచి పాత్రలు వచ్చినప్పుడు చాలా సెలక్టీవ్గా సినిమాలు చేస్తుంది. ఇటీవల కాలంలో `గుంటూరు టాకీస్` రష్మికి మంచి పేరుని తీసుకొచ్చింది. `నెక్ట్స్ నువ్వే`, `అంతకు మించి` చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.
ఇక ప్రస్తుతం మరో సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది రష్మి. నందుతో కలిసి `బొమ్మ బ్లాక్బస్టర్` సినిమా చేస్తుంది. ఇందులో పోతురాజుగా నందు నటిస్తుండగా, ఆయనకు ప్రియురాలుగా వాణి పాత్రలో రష్మి కనిపించనుంది. ఈ సినిమాలోని తన లుక్ ని ఇటీవల విడుదల చేయగా, దీనికి మంచి స్పందన లభిస్తుంది.