MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Rashmi Gautam పై దారుణంగా ట్రోల్స్.. వైసీపీ నాయకులకు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన జబర్దస్త్ యాంకర్‌

Rashmi Gautam పై దారుణంగా ట్రోల్స్.. వైసీపీ నాయకులకు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన జబర్దస్త్ యాంకర్‌

Rashmi Gautam: ఎద్దుపై నిరసన తెలియజేసిన వైసీపీ నాయకుడిని ఉద్దేశించి యాంకర్‌ రష్మి గౌతమ్‌ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో తనని ట్రోల్ చేసిన వైసీపీ నాయకులకు కౌంటర్‌ ఇచ్చింది రష్మి. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 02 2026, 04:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వైసీపీ నాయకుడిపై రష్మి గౌతమ్‌ ఫైర్‌
Image Credit : youtube/@pressclub

వైసీపీ నాయకుడిపై రష్మి గౌతమ్‌ ఫైర్‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి చేపట్టిన ఒక రాజకీయ నిరసనపై ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా అభినయ్ రెడ్డి ఒక ఎద్దు ఉన్న బండిపై భారీ ఆటోను ఉంచి, దానిపై మనుషులు కూర్చుని ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ బరువును మోయలేక ఒకే ఒక్క ఎద్దు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేవలం రాజకీయ ప్రచారం కోసం, 'జబర్దస్త్' తరహా స్కిట్లు చేస్తూ మూగజీవులను హింసించడం ఏమాత్రం తగదని రష్మీ మండిపడ్డారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎద్దు అనుభవించిన నరకం వాళ్లు అనుభవించాలి
Image Credit : youtube/@mallemalatv

ఎద్దు అనుభవించిన నరకం వాళ్లు అనుభవించాలి

ఆ మూగజీవి పడుతున్న వేదన చూసి చలించిపోయిన రష్మీ, తన సోషల్ మీడియా  ద్వారా నిరసనకారులపై శాపనార్థాలు పెట్టారు. ఆ ఎద్దు అనుభవించిన నరకం ఆ మనుషులపై వెయ్యి రెట్లు పడాలని, ప్రచారం కోసం ఇంత క్రూరత్వానికి ఒడిగట్టడం హేయమైన చర్య అని ఆమె అభివర్ణించారు. ఈ క్రమంలో ఆమె పెటా (PETA) ఇండియా, భారత జంతు సంక్షేమ బోర్డులను ట్యాగ్ చేస్తూ, ఇలాంటి రాజకీయ కార్యక్రమాల్లో జంతువులను వాడుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలోనూ జంతు హక్కుల కోసం పోరాడే రష్మీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి.

35
రష్మి గౌతమ్‌పై ట్రోల్స్
Image Credit : Asianet News

రష్మి గౌతమ్‌పై ట్రోల్స్

అయితే, రష్మీ చేసిన వ్యాఖ్యలపై వైసిపి కార్యకర్తలు, సోషల్ మీడియా ట్రోలర్స్ విరుచుకుపడ్డారు. ఆమెది 'ఓవర్ యాక్షన్' అని, ఎద్దులకు అంత బరువు లాగే సామర్థ్యం ఉంటుందని వాదిస్తూ రష్మీని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. నిరసనలోని రాజకీయ కోణాన్ని వదిలేసి జంతువుల గురించి మాట్లాడటం ఏంటని ఆమెను విమర్శిస్తూ దారుణంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో రష్మీ వెనక్కి తగ్గకుండా, తనకు వ్యతిరేకంగా కామెంట్ చేస్తున్న వారికి స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు.

45
వైసీపీ నాయకులకు రష్మి గౌతమ్‌ కౌంటర్‌
Image Credit : our own

వైసీపీ నాయకులకు రష్మి గౌతమ్‌ కౌంటర్‌

తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కు స్పందిస్తూ.. ఇలాంటి అవమానాలు ఎదుర్కోవడం తనకు కొత్తేమీ కాదని రష్మీ స్పష్టం చేశారు. పండుగలు, జాతర్ల సమయంలో జరిగే జంతుబలుల గురించి ప్రశ్నించినప్పుడు కూడా తనను ఇలాగే తిట్టారని ఆమె గుర్తు చేశారు. చివరకు గణపతి వేడుకల్లో ఏనుగుల పట్ల చూపే క్రూరత్వాన్ని ప్రశ్నిస్తే తనను ఏకంగా 'దేశద్రోహి' అని కూడా ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు సమస్యను పరిష్కరించడం మానేసి, కేవలం ఒక అంశాన్ని మరొక దానితో పోలుస్తూ కాలక్షేపం చేస్తున్నారని ఆమె విమర్శించారు.

55
అలా చేస్తే మీ పార్టీకి సపోర్ట్ చేస్తా
Image Credit : our own

అలా చేస్తే మీ పార్టీకి సపోర్ట్ చేస్తా

చివరగా, తాను ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదని రష్మీ కుండబద్దలు కొట్టారు. ఏ పార్టీ అయితే జంతువుల సంక్షేమం కోసం నిజాయితీగా కృషి చేస్తుందో, తాను ఆ పార్టీకి బహిరంగంగా సపోర్ట్ చేస్తానని ప్రకటించారు. జంతు హింస ఎక్కడ జరిగినా తన గళం వినిపిస్తూనే ఉంటానని, కేవలం రాజకీయాల కోసమో, మతాల కోసమో మూగజీవుల ప్రాణాలతో ఆడుకోవడం సరికాదని ఆమె హితవు పలికారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది, జంతు ప్రేమికులు ఆమెకు అండగా నిలుస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
వినోదం
ఆంధ్ర ప్రదేశ్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
AK 47 Teaser Review: ఫ్యామిలీ ఇమేజ్‌ని పక్కన పెట్టిన వెంకటేష్‌, ఎందుకంటే?.. ఆదర్శ కుటుంబ టీజర్‌ ఎలా ఉందంటే?
Recommended image2
Tollywood Senior Heroes: దసరా నుంచి సంక్రాంతి వరకు, క్యూ కట్టిన సీనియర్ హీరోలు..300 కోట్లు కొట్టే బొమ్మ ఏది ?
Recommended image3
Panchanama Review: ఉదయభాను నిర్మించిన 'పంచనామా' సిరీస్ రివ్యూ.. ఒక్క క్లూతో కూపీ మొత్తం లాగిన పోలీస్
Related Stories
Recommended image1
Savitri: ఉదయం 4 గంటలకే లేచి క్యూలో నిల్చొన్న సావిత్రి.. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లకు నిద్రలేని రాత్రులు.. ఏం జరిగిందంటే?
Recommended image2
Nagababu LoveStory: నాగబాబు లవ్‌ స్టోరీ, జెలసీతో రగిలిపోయాడట.. పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved