- Home
- Entertainment
- Rashmi Gautam పై దారుణంగా ట్రోల్స్.. వైసీపీ నాయకులకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన జబర్దస్త్ యాంకర్
Rashmi Gautam పై దారుణంగా ట్రోల్స్.. వైసీపీ నాయకులకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన జబర్దస్త్ యాంకర్
Rashmi Gautam: ఎద్దుపై నిరసన తెలియజేసిన వైసీపీ నాయకుడిని ఉద్దేశించి యాంకర్ రష్మి గౌతమ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఈ క్రమంలో తనని ట్రోల్ చేసిన వైసీపీ నాయకులకు కౌంటర్ ఇచ్చింది రష్మి.

వైసీపీ నాయకుడిపై రష్మి గౌతమ్ ఫైర్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి చేపట్టిన ఒక రాజకీయ నిరసనపై ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా అభినయ్ రెడ్డి ఒక ఎద్దు ఉన్న బండిపై భారీ ఆటోను ఉంచి, దానిపై మనుషులు కూర్చుని ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ బరువును మోయలేక ఒకే ఒక్క ఎద్దు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేవలం రాజకీయ ప్రచారం కోసం, 'జబర్దస్త్' తరహా స్కిట్లు చేస్తూ మూగజీవులను హింసించడం ఏమాత్రం తగదని రష్మీ మండిపడ్డారు.
ఎద్దు అనుభవించిన నరకం వాళ్లు అనుభవించాలి
ఆ మూగజీవి పడుతున్న వేదన చూసి చలించిపోయిన రష్మీ, తన సోషల్ మీడియా ద్వారా నిరసనకారులపై శాపనార్థాలు పెట్టారు. ఆ ఎద్దు అనుభవించిన నరకం ఆ మనుషులపై వెయ్యి రెట్లు పడాలని, ప్రచారం కోసం ఇంత క్రూరత్వానికి ఒడిగట్టడం హేయమైన చర్య అని ఆమె అభివర్ణించారు. ఈ క్రమంలో ఆమె పెటా (PETA) ఇండియా, భారత జంతు సంక్షేమ బోర్డులను ట్యాగ్ చేస్తూ, ఇలాంటి రాజకీయ కార్యక్రమాల్లో జంతువులను వాడుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలోనూ జంతు హక్కుల కోసం పోరాడే రష్మీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి.
రష్మి గౌతమ్పై ట్రోల్స్
అయితే, రష్మీ చేసిన వ్యాఖ్యలపై వైసిపి కార్యకర్తలు, సోషల్ మీడియా ట్రోలర్స్ విరుచుకుపడ్డారు. ఆమెది 'ఓవర్ యాక్షన్' అని, ఎద్దులకు అంత బరువు లాగే సామర్థ్యం ఉంటుందని వాదిస్తూ రష్మీని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. నిరసనలోని రాజకీయ కోణాన్ని వదిలేసి జంతువుల గురించి మాట్లాడటం ఏంటని ఆమెను విమర్శిస్తూ దారుణంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో రష్మీ వెనక్కి తగ్గకుండా, తనకు వ్యతిరేకంగా కామెంట్ చేస్తున్న వారికి స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు.
వైసీపీ నాయకులకు రష్మి గౌతమ్ కౌంటర్
తనపై జరుగుతున్న ట్రోలింగ్కు స్పందిస్తూ.. ఇలాంటి అవమానాలు ఎదుర్కోవడం తనకు కొత్తేమీ కాదని రష్మీ స్పష్టం చేశారు. పండుగలు, జాతర్ల సమయంలో జరిగే జంతుబలుల గురించి ప్రశ్నించినప్పుడు కూడా తనను ఇలాగే తిట్టారని ఆమె గుర్తు చేశారు. చివరకు గణపతి వేడుకల్లో ఏనుగుల పట్ల చూపే క్రూరత్వాన్ని ప్రశ్నిస్తే తనను ఏకంగా 'దేశద్రోహి' అని కూడా ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు సమస్యను పరిష్కరించడం మానేసి, కేవలం ఒక అంశాన్ని మరొక దానితో పోలుస్తూ కాలక్షేపం చేస్తున్నారని ఆమె విమర్శించారు.
అలా చేస్తే మీ పార్టీకి సపోర్ట్ చేస్తా
చివరగా, తాను ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదని రష్మీ కుండబద్దలు కొట్టారు. ఏ పార్టీ అయితే జంతువుల సంక్షేమం కోసం నిజాయితీగా కృషి చేస్తుందో, తాను ఆ పార్టీకి బహిరంగంగా సపోర్ట్ చేస్తానని ప్రకటించారు. జంతు హింస ఎక్కడ జరిగినా తన గళం వినిపిస్తూనే ఉంటానని, కేవలం రాజకీయాల కోసమో, మతాల కోసమో మూగజీవుల ప్రాణాలతో ఆడుకోవడం సరికాదని ఆమె హితవు పలికారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది, జంతు ప్రేమికులు ఆమెకు అండగా నిలుస్తున్నారు.

