రానా పెళ్లి వేడుక.. ఇండస్ట్రీలో 30 మందికి మాత్రమే ఆహ్వానం
లాక్ డౌన్ కారణంగా సినీ రంగం స్థంభించి పోయింది. దీంతో ఖాళీ సమయం దొరకటంతో చాలా కాలంగా పెళ్లి వాయిదా వేస్తున్న బ్యాచిలర్ హీరోలు ఓ ఇంటి వారు అవుతున్నారు. ఇప్పటికే నిఖిల్, నితిన్, దర్శకుడు సుజిత్ లాంటి వారు పెళ్లి చేసుకోగా మరో నాలుగు రోజులు రానా కూడా ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తాజాగా రానా పెళ్లి వేడుకకు సంబంధించి ఆసక్తికర వార్త మీడియాల వైరల్ అవుతోంది.
యంగ్ రానా ఈ నెల 8న ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. మే నెలలో రానా తన ప్రేయసి ప్రపంచానికి పరిచయం చేశాడు. బిజినెస్ ఉమెన్ మిహీకా బజాజ్ను తన ప్రేమను అంగీకరించిదని అభిమానులతో షేర్ చేసుకున్నాడు రానా.
రానా, మిహీకా గురించి ప్రకటించటమే ఆలస్యం పెద్దలు అంగీకారం తెలపటం, పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేయటం చకచక జరిగిపోయాయి. ఇరు కుటుంబాల సమక్షంలో రోకా వేడుక కూడా ఘనంగా నిర్వహించారు.
అయితే ముందుగా కరోనా ప్రభావం తగ్గిన తరువాత ఘనంగా పెళ్లి చేయాలని భావించినా, ఇప్పట్లో సాధారణ పరిస్థితులు నెలకొనే పరిస్థితి లేకపోవటంతో ఆగస్టు 8న పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ పెళ్లి జరిపించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి.
అలా కూడా ముందుగా ఫలక్నుమా ఫ్యాలెస్లో భారీగా పెళ్లి వేడుక నిర్వహించాలని భావించారు. అయితే లాక్ డౌన్ సడలింపులతో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో అది కూడా వద్దని రామానాయుడు స్టూడియోస్లోనే అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు అది కొద్దిమంది అతిధులు మాత్రమే హాజరు కానున్నారు. రానా తెలుగుతో పాటు ఇతర భాషల్లో, ముఖ్యంగా హిందీలో కూడా పాపులర్ నటుడు కావటంతో అతిథుల ఎంపిక కాస్త కష్టమైందట. అయితే ఫైనల్గా సినీ రంగం నుంచి కేవలం 30 మందికి మాత్రమే ఆహ్వానం అందినట్టుగా తెలుస్తోంది.
తాజాగా మరో ఆసక్తికర వార్త ప్రచారం అవుతుంది. రానా పెళ్లి హాజరవుతున్న వారు కరోనా టెస్ట్ చేయించుకున్న తరువాత హాజరవుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.