- Home
- Entertainment
- Ramu Rathod Remuneration: పారితోషికం డబుల్ చేసిన రాము రాథోడ్.. ఒక్క పాటకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?
Ramu Rathod Remuneration: పారితోషికం డబుల్ చేసిన రాము రాథోడ్.. ఒక్క పాటకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?
ఫోక్ సింగర్ రాము రాథోడ్ పాడిన జానపద పాటలు యూట్యూబ్లో దుమ్మురేపుతున్నాయి. అలాగే ఇప్పుడు సినిమా పాటలతోనూ బిజీ అవుతున్నాడు. మరి ఒక్క పాట పాడితే రాము రాథోడ్ ఎంత పారితోషికం తీసుకుంటున్నాడో తెలుసా.

రాము రాథోడ్ ప్రస్థానం
తెలంగాణ జానపద సంగీత ప్రపంచంలో రాము రాథోడ్ ఒక సంచలనం. మారుమూల పల్లె నుంచి వచ్చిన ఈ అద్భుతమైన గాయకుడు, జానపద గీతాలకు ఒక కొత్త ఊపిరి పోశారు. బంజారా నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ, ఆయన పాడిన పాటలు కులమతాలకు అతీతంగా ప్రతి ఇంట్లోనూ మార్మోగుతున్నాయి. పక్కా గ్రామీణ యాసలో, ఎంతో సహజత్వంతో కూడిన ఆయన గాత్రం శ్రోతలను అలరిస్తోంది. ముఖ్యంగా యూట్యూబ్ లో ఆయన విడుదల చేసిన పాటలు మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి, ఆయనను రాత్రికి రాత్రే స్టార్గా మార్చేశాయి.
పాటలో జీవం.. పల్లె పదాల వైభవం
రాము రాథోడ్ కేవలం ఒక గాయకుడు మాత్రమే కాదు, పాటలోని భావాన్ని తన గొంతుతో పలికించే గొప్ప కళాకారుడు. ఆయన పాటల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పల్లెల్లో ఉండే కల్మషం లేని ప్రేమలు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా 'తెలంగాణ జానపదాలు' (Folk Songs) అంతరించిపోతున్న తరుణంలో, ఆధునిక సంగీతాన్ని జోడించి యువతకు చేరువ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. పల్లె కన్నీరు పెట్టినా, ప్రేమికుల మధ్య విరహం కలిగినా.. రాము రాథోడ్ పాట వింటే ఆ భావం నేరుగా గుండెకు తాకుతుంది.
రాము రాథోడ్ పాపులర్ సాంగ్స్
రాము రాథోడ్ పాడిన `రాను బొంబాయికి రాను` పాట యూట్యూట్నే షేక్ చేసిన విషయం తెలిసిందే. దీనికి 80కోట్లకు వ్యూస్ వచ్చాయి. జానపద పాటల్లో ఇది టాప్లో ఉంది. ఈ పాటతో పాపులర్ అయ్యాడు రాము రాథోడ్. దీంతోపాటు `రింగు రింగుల జుట్టు దాన`, `సొమ్మ సిల్లి పోతున్నవే ఓ చిన్న రాములమ్మ`, `సిరులైనా సరిపోతాయా`, `డీజే పిల్లా` వంటి పాటలతో పాపులర్ అయ్యాడు రాము రాథోడ్. దీంతో అతను `బిగ్ బాస్ తెలుగు 9`లోకి వచ్చాడు. ఉన్నన్ని రోజులు నవ్వించే ప్రయత్నం చేశాడు. విచిత్రమైన ప్రవర్తనతో నవ్వులు పూయించాడు. ఆ తర్వాత తనే ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ షో రాము రాథోడ్కి విశేషమైన గుర్తింపుని తెచ్చింది. ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయాడు. అంతేకాదు సినిమా పాటలతోనూ అలరిస్తున్నాడు.
రాము రాథోడ్ పారితోషికం
రాము రాథోడ్ ఇప్పుడు సినిమా పాటలతోనూ బిజీ అవుతున్నాడు. ఇటీవలే ఆయన `బ్యాండ్ మేళం` చిత్రంలో `తిప్పుతున్నావే` అనే పాటని ఆలపించాడు. సినిమా ఆడలేదుగానీ, పాట మాత్రం దుమ్మురేపుతోంది. ఇంకా ట్రెండింగ్లో ఉంది. మరి సినిమా పాటలకు రాము రాథోడ్ ఎంత పారితోషికం తీసుకుంటున్నాడనేది చూస్తే, ఒక్కో పాటకి ఆయన యాభై వేల వరకు అందుకుంటున్నాడట. పాపులర్ అయిన సింగర్స్ రూ.1.50లక్షల నుంచి రెండు లక్షలు తీసుకుంటున్నారు. కానీ రాము రాథోడ్ ఇప్పటి వరకు యాభై వేలు మాత్రమే తీసుకున్నాడట. కానీ `తిప్పుకున్నావే` పాటతో తను కూడా పారితోషికం పెంచాడట. ఇప్పుడు లక్ష రూపాయలు అడుగుతున్నాడట. కొత్తగా రాము రాథోడ్ పాట పాడితే లక్ష రూపాయలు చెల్లించుకోవాల్సిందే. అయితే చాలా పేదరికం నుంచి వచ్చిన రాము రాథోడ్ ఇప్పుడు ఒక్కో పాటకి లక్ష రూపాయలు తీసుకునే స్థాయికి ఎదగడం గొప్ప విషయమనే చెప్పాలి. అది ఆయన పెరిగిన స్థాయిని, ఆయనకున్న డిమాండ్ని తెలియజేస్తుందని చెప్పొచ్చు.
కళాకారుడిగా సమాజం పట్ల బాధ్యత
రాము రాథోడ్ తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఒక సామాన్యమైన స్థితి నుంచి వచ్చి, ఈరోజు జానపద కళకు బ్రాండ్ అంబాసిడర్గా మారడం వెనుక ఎంతో కృషి ఉంది. ఇతర వర్ధమాన కళాకారులను ప్రోత్సహించడంలో కూడా ఆయన ముందుంటారు. తెలంగాణ ప్రభుత్వం, వివిధ సాంస్కృతిక సంస్థలు ఆయన ప్రతిభను గుర్తించి అనేక పురస్కారాలతో గౌరవించాయి. జానపదం ఉన్నంత కాలం రాము రాథోడ్ గొంతు మారుమోగుతూనే ఉంటుంది.

