- Home
- Entertainment
- రాము రాథోడ్ ఒక్క పాటతో ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా? యూట్యూబ్ షేక్ అయ్యే లెక్కలు
రాము రాథోడ్ ఒక్క పాటతో ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా? యూట్యూబ్ షేక్ అయ్యే లెక్కలు
`రాను బొంబాయికి రాను` పాటతో యూట్యూబ్ని షేక్ చేస్తోన్న ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఈ పాటతో ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా? ఆ లెక్కలు తెలిస్తే మతిపోవాల్సిందే.

ఒక్క పాటతో ఓవర్నైట్లో స్టార్ అయిన రాము రాథోడ్
సోషల్ మీడియా కారణంగా ఎప్పుడు ఎవరి దశ తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్స్ అయిన వారు ఎందరో ఉన్నారు. అయితే కేవలం పాపులారిటీ మాత్రమే కాకుండా మట్టి వాసన ఉన్న ఒక జానపద(ఫోక్ సాంగ్)తో కాసుల వర్షం కురిపించిన ఘనత తెలంగాణ జానపద కళాకారుడు రాము రాథోడ్ సొంతం. ఆయన పాడిన `రాను బొంబాయి రాను` పాట సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ ఒక్క పాటతో సెలబ్రిటీ అయిపోయాడు రాము రాథోడ్. బిగ్బాస్ షోలోకి వెళ్లి తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు. ఇప్పుడు సరికొత్త పాటలతో సందడి చేస్తున్నాడు.
3 లక్షలతో తీసిన `రాను బొంబాయికి రాను` పాట
మరి యూట్యూబ్ని షేక్ చేసిన `రాను బొంబాయి రాను` పాటకి ఎన్ని వ్యూస్ వచ్చాయి? దీనికి ఎంత ఖర్చు చేశాడు? ఎన్నికోట్లు సంపాదించాడనేది చూస్తే మతిపోయే విషయాలు బయటకు వచ్చాయి. సాధారణంగా ఒక సినిమా పాటను నిర్మించాలంటే లక్షలు, కోట్లు ఖర్చవుతాయి. కానీ రాము రాథోడ్ తన టీమ్తో కలిసి ఈ పాటను కేవలం 3 లక్షల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. మొదట వేములవాడలో, ఆ తర్వాత జగిత్యాల సమీపంలోని లొకేషన్లలో ఈ పాటను చిత్రీకరించారు. విడుదలైన కొన్ని నెలల్లోనే ఈ పాట యూట్యూబ్లో వైరల్ అయ్యి, ఊహించని రీతిలో వ్యూస్ సాధించింది.
80కోట్ల వ్యూస్ సాధించిన రాను బొంబాయికి రాను పాట
తాజాగా ఈ పాట యూట్యూబ్లో ఏకంగా 80 కోట్ల (804 Million) వ్యూస్ మార్కును దాటి, అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు జానపద గీతంగా చరిత్ర సృష్టించింది. ఈ వ్యూస్ ద్వారా కేవలం యూట్యూబ్ యాడ్స్ రెవెన్యూ రూపంలోనే ఈ టీమ్కు దాదాపు ఒక కోటి రూపాయలకు పైగా ఆదాయం వచ్చినట్లు ఇండస్ట్రీ టాక్. రాము రాథోడ్ సంపాదన కేవలం ఒక్క పాటకే పరిమితం కాలేదు. ఈ పాట తెచ్చిన క్రేజ్తో ఆయనకు అనేక మార్గాల్లో ఆదాయం సమకూరింది. 80కోట్ల వ్యూస్ పొందిన ఈ పాటకిగానూ సుమారు రెండు కోట్ల వరకు ఆదాయం వచ్చిందట. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ పాటకు డాన్స్ చేసిన లిఖిత వెల్లడించింది. ఏడాది క్రితమే కోటి రూపాయలు అంటే, ఇప్పుడు అది రెండు కోట్లు దాటిందని సమాచారం.
రాము రాథోడ్ సంపాదన
అయితే ఈ పాట రాము రాథోడ్ లైఫ్నే మార్చేసింది. ఇప్పుడు సెలబ్రిటీ అయ్యాడు. దాని కారణంగా ఆయన కమర్షియల్ యాడ్స్ చేస్తున్నాడు. మరోవైపు ఆ మధ్య బిగ్ బాస్ షోలోనూ పాల్గొన్నారు. ఆ షో నుంచి ఇరవై లక్షలకుపైగానే ఆదాయం పొందాడు. ఇక ఆయన ఒక్క షోగానీ, ఈవెంట్లుగానీ చేస్తే, లక్షల్లో పారితోషికం తీసుకుంటున్నాడు. సినిమా పాటలు కూడా వస్తున్నాయి. మొన్న వచ్చిన `బ్యాండ్ మేళం` చిత్రంలో `తిప్పూకుంటున్నావ్` అనే పాటని రాము రాథోడ్ ఆలపించాడు. అదితి భవరాజుతో కలిసి పాడగా ఈ పాట విశేషంగా ఆకట్టుకుంది. యూట్యూబ్లో వైరల్ అవుతుంది.
కోట్లు సంపాదిస్తున్న రాము రాథోడ్
ఒకప్పుడు సామాన్య జీవితం గడిపిన రాము రాథోడ్, ఈ ఒక్క పాటతో తన తలరాతను మార్చుకున్నారు. `మొదట్లో ఈ పాట ఇంత హిట్ అవుతుందని అనుకోలేదు. కానీ ప్రేక్షకులు మా కష్టాన్ని గుర్తించారు అని రాము రాథోడ్ ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యాడు. తన సంపాదనతో తన కుటుంబానికి ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చుకోవడమే కాకుండా, తనలాంటి మరికొంతమంది జానపద కళాకారులకు ఆయన ఆదర్శంగా నిలిచారు. అదే సమయంలో ఫోక్ సాంగ్స్ కి ఊపు తీసుకొచ్చారు. వాటికి మంచి గుర్తింపుని, క్రేజ్ని తీసుకొచ్చారు. దీంతో ఇప్పుడు వరుసగా చాలా సినిమాల్లో ఇలాంటి ఫోక్ సాంగ్స్ ని పెడుతుండటం విశేషం. మొత్తంగా రాము రాథోడ్ `రాను బొంబాయికి రాను` పాటతో రెండు కోట్లకుపైగా సంపాదించాడని చెప్పొచ్చు.

