- Home
- Entertainment
- 4000 కోట్లు ఎందుకు, రామాయణ్ టీజర్ పై మొదలైన ట్రోలింగ్, విజువల్స్ గురించి నెటిజన్లు ఏమంటున్నారంటే?
4000 కోట్లు ఎందుకు, రామాయణ్ టీజర్ పై మొదలైన ట్రోలింగ్, విజువల్స్ గురించి నెటిజన్లు ఏమంటున్నారంటే?
హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం రణ్బీర్ కపూర్, డైరెక్టర్ నితేష్ తివారీ 'రామాయణ్' టీజర్ రిలీజైంది. సోషల్ మీడియాలో ఈ టీజర్ తెగ వైరల్ అవుతోంది. చాలామంది టీజర్ను మెచ్చుకుంటున్నా, మరికొందరు మాత్రం అందులో లోపాలను ఎత్తిచూపుతున్నారు.

రామాయణ్ టీజర్ రిలీజ్..
డైరెక్టర్ నితేష్ తివారీ భారీ బడ్జెట్ మూవీ 'రామాయణ్' సినిమా టీజర్ వచ్చేసింది. గురువారం రిలీజైన ఈ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. జనాలు మళ్లీ మళ్లీ చూస్తున్నారు. రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్ లుక్ చాలామందికి తెగ నచ్చేసింది. అయితే, సినిమాలో చూపించిన కొన్ని వీఎఫ్ఎక్స్ సీన్లు చూసి జనాల మైండ్ బ్లాంక్ అయింది. చాలామంది టీజర్ను ట్రోల్ చేస్తూ, అందులో ఉన్న తప్పులను, లోపాలను ఎత్తిచూపుతున్నారు. కాగా, రూ.4000 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది దీపావళికి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
రామాయణ్ టీజర్ కు నెటిజన్ల రివ్యూ..
రణ్బీర్ కపూర్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'రామాయణ్' టీజర్ రిలీజైంది. ఈ టీజర్ కోసం అభిమానులు దేశ వ్యాప్తంగా చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. చివరికి మేకర్స్ హనుమాన్ జయంతి శుభ సందర్భంగా దీన్ని లాంచ్ చేశారు. కొద్దిరోజుల క్రితం అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో దీనికి సంబంధించిన చిన్న గ్లింప్స్ చూపించారు.
ఇప్పుడు గురువారం అందరి కోసం రిలీజ్ చేశారు. ఈ టీజర్ను కేవలం 4 గంటల్లోనే 39 లక్షల మందికి పైగా చూడటం ఈ సినిమాపై ఉన్న హైప్కు నిదర్శనం. 'రామాయణ్' సినిమాలో హై క్వాలిటీ వీఎఫ్ఎక్స్ వాడారని, అది సినిమాను అద్భుతంగా మలుస్తుందని అంటున్నారు. మరి, ఈ టీజర్ చూసిన తర్వాత జనాలు ఎక్స్ (ట్విట్టర్)లో ఎలాంటి రివ్యూలు ఇచ్చారో చూద్దాం.
ట్రోలింగ్కు గురైన 'రామాయణ్' టీజర్
‘రామాయణ్’ టీజర్పై ఒకవైపు ప్రశంసలు వస్తుంటే, మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం ఈ టీజర్ ను విమర్శిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ లో.. అసలు హనుమంతుడు కనిపించలేదు. కానీ ఆయనకు ఇష్టమైన రాముడిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు అనిపించింది.
ఇక కొన్ని సీన్లు ఫేక్గా, ఏఐ (AI)తో చేసినట్టు ఉన్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. రేడియోయాక్టివ్ అనే హ్యాండిల్ నుంచి ఒక యూజర్ పోస్ట్ చేస్తూ.. "ఇంత పెద్ద బడ్జెట్ సినిమాలో కొన్నిచోట్ల ఏఐ వాడినట్టు అనుమానంగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కాస్త ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. డెప్త్ ఉంటుందనుకుంటే, యావరేజ్ రెండరింగ్ లాగా ఉంది. మాకు 2026 స్థాయి క్వాలిటీ కావాలి, కేవలం పిక్సెల్స్ కాదు" అని రాశారు.
గౌరవ్ చౌబే అనే యూజర్.. "కొత్త రామాయణ్ టీజర్ను ఇష్టపడదామనుకున్నా, కానీ విజువల్స్ ఇబ్బంది పెడుతున్నాయి. ఇది నాకే అనిపిస్తోందా లేక వీఎఫ్ఎక్స్ కొంచెం తేడాగా ఉందా? కొన్ని సీన్లు హై-బడ్జెట్ సినిమా లాగా కాకుండా, ఏఐ ప్రాంప్ట్ లాగా ఉన్నాయి" అని కామెంట్ చేశారు.
గ్రాఫిక్స్ పై వస్తున్న విమర్శలు..
శుభమ్ సకుజా అనే యూజర్ అయితే.. "#రామాయణ్ ఫస్ట్ లుక్ చూసి నిరాశపడ్డాను. వీఎఫ్ఎక్స్ అసంపూర్తిగా ఉంది. రాక్షసులు 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' నుంచి వచ్చినట్టు అసహజంగా ఉన్నారు. భారీ బడ్జెట్ అయినా ఆర్టిఫిషియల్ ఎఫెక్ట్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. జలపాతాలు, అడవులు, ప్రకృతి దృశ్యాల్లో డీటెయిలింగ్ లేదు. అవి ప్లేస్టేషన్ గేమ్ క్లిప్లా ఉన్నాయి. అయోధ్య కూడా డల్గా, కృత్రిమంగా ఉంది. రణ్బీర్ కొన్ని సీన్లలో బాగున్నాడు, కొన్నింట్లో ఫేక్గా ఉన్నాడు. రిలీజ్కు ముందు మెరుగుపరుస్తారని ఆశిస్తున్నా, కానీ ప్రస్తుతానికి ఇది 'ఆదిపురుష్' ఏఐ వెర్షన్లా ఉంది" అని ఏకిపారేశారు.
బడ్జెట్ కు తగ్గట్టుగా లేదంటున్నారు..
‘రామాయణ్’ టీజర్ను చూసి డా. బధాకిస్త్ అనే యూజర్.. "#రామాయణ్ టీజర్ బాగుంది. విజువల్స్ అందంగా ఉన్నాయి, రణ్బీర్ నటన అద్భుతం, మ్యూజిక్ పర్వాలేదు. కానీ 4000 కోట్ల బడ్జెట్ ఎక్కడా కనిపించడం లేదు. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే ఒక్క సీన్ కూడా టీజర్లో లేదు. ఇది 'ఆదిపురుష్' లాంటిదేనా?" అని ప్రశ్నించారు.
ఎనిర్ మికాషా అనే యూజర్.. "అన్నీ బాగున్నాయి. రణ్బీర్ ఓకే. మొదటి ఐస్ సీన్ తప్ప మిగతా వీఎఫ్ఎక్స్ బాగుంది. ఏఆర్ రెహమాన్ ఏడుపు సీన్ నచ్చలేదు, అక్కడ ఆయన ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. ఆయన ఏదైనా తప్పు చేయరని ఆశిస్తున్నా. మిగతాదంతా బాగుంది" అని రాశారు. ఇలాగే చాలామంది యూజర్లు 'రామాయణ్' టీజర్లోని లోపాలను ఎత్తిచూపారు.
రామాయణ్ సినిమా రిలీజ్ ఎప్పుడు..?
ఈ సినిమాకు నమిత్ మల్హోత్రా నిర్మాతగా వ్యవహరిస్తుండగా, నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీధర్ రాఘవన్ కథను అందించారు. ఆస్కార్ విజేతలు హన్స్ జిమ్మెర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రవి బన్సల్, రామ్సే ఎవరీ ప్రొడక్షన్ డిజైనర్లుగా పనిచేస్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా తీస్తున్నారు. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది.
సినిమాలో రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, రవి దూబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. వీరితో పాటు అరుణ్ గోవిల్, లారా దత్తా, అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్, ఇందిరా కృష్ణన్, కాజల్ అగర్వాల్, వివేక్ ఒబెరాయ్, కునాల్ కపూర్, షీబా చద్దా, శోభన, మోహిత్ రైనా కూడా నటిస్తున్నారు.
మీడియా కథనాల ప్రకారం, ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ, ఇంగ్లీష్తో సహా 50కి పైగా భారతీయ, అంతర్జాతీయ భాషల్లో విడుదల చేయనున్నారు.

