MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • షాకింగ్ : రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ ఒక్కొక్క వ్యూకి రూ.11 వేలు

షాకింగ్ : రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ ఒక్కొక్క వ్యూకి రూ.11 వేలు

వైఎస్ జగన్ జీవితం ఆధారంగా రూపొందిన 'వ్యూహం' సినిమా ఆర్థిక అవకతవకలకు సంబంధించిన వివాదంలో చిక్కుకుంది. ఏపీ ఫైబర్‌నెట్ ద్వారా సినిమా ప్రదర్శనకు సంబంధించి అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.

2 Min read
Author : Surya Prakash
Published : Dec 20 2024, 08:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


ఎలక్షన్ సమయంలో  ప్రముఖ దర్శకుడు  రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం వ్యూహం. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు 'వ్యూహం' చిత్రాన్ని తెరకెక్కించారు వర్మ.  

రిలీజ్ కు ముందు ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి కానీ సినిమా వర్కవుట్ కాలేదు. అందుకు రకరకాల కారణాలు ఉన్నా,సినిమా బాగోలేదనేది నిజం. అది ప్రక్కన పెడితే ఇప్పుడు వ్యూహం చిత్రం మరోసారి వార్తలకు ఎక్కింది. ఈ సినిమా విషయంలో అక్రమాలు జరిగాయని చెప్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


  వైఎస్సార్‌ మరణం తర్వాత ఎపీ రాజకీయాల్లో చోటుచేసుకున్న పెనుమార్పులను ఎదర్కొని జగన్ ఎలా నిలబడ్డారు..? అనేది వ్యూహంలో వర్మ చూపించారు. తండ్రి ఆశయాలకు గండిపడుతున్న సమయంలో నేనున్నానంటూ ప్రజల కోసం జగన్‌ పోరాటం.. కేంద్రాన్ని ఎదురించి తనను నమ్ముకున్న ప్రజల కోసం జగన్‌ ప్రారంభించిన ఓదార్పు యాత్ర.. దాంతో కేంద్రం నుంచి జగన్‌ ఎలాంటి చిక్కులు ఎదుర్కొన్నారు..? వంటివి ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేసారు. ఆ క్రమంలో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, పవన్ కళ్యాణ్ ని ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ లో చూపించారు.
 

36

‘వ్యూహం సినిమా ఒక్కరు ఒక్కసారి చూసినందుకు ఆర్జీవీ ఆర్వీ అనే సంస్థకు ఏపీ ఫైబర్‌నెట్‌ రూ.11 వేలు చెల్లించింది. ఇలా మొత్తం రూ.2.10 కోట్లు ఫైబర్‌నెట్‌ బ్యాంకు ఖాతా నుంచి డైరెక్టర్‌ రాంగోపాల్‌వర్మ (ఆర్జీవీ ఆర్వీ) సంస్థ బ్యాంకు ఖాతాలోకి వెళ్లాయి’ అని ఏపీ ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ జీవీరెడ్డి పేర్కొన్నారు. ఏపీ ఫైబర్‌నెట్‌ ఛానల్‌లో ‘వ్యూహం’ సినిమా విడుదల చేస్తే.. అప్పట్లో 1,863 మంది మాత్రమే చూసారన్నారు. ఒప్పందం ప్రకారం ఒకసారి చూసినందుకు రూ.100 చెల్లించాలని, ఈ లెక్కన ఆర్జీవీ సంస్థకు రూ.2 లక్షలకు మించి చెల్లించకూడదని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సంస్థలో ఇలా ఎన్నో అక్రమాలు జరిగినట్లు గుర్తించామన్నారు.
 

46


  సంస్థ కార్యాలయంలో జీవీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.... ‘గత ఐదేళ్లలో ఫైబర్‌నెట్‌లో ఏకంగా రూ.6,869 కోట్లు ఖర్చు చేసినట్లు చూపారు. వ్యాపార సామర్థ్యాన్ని పెంచారా అంటే అదీ లేదు. తెదేపా హయాంలో 10 లక్షలున్న కనెక్షన్ల సంఖ్య గత ఐదేళ్లలో 5 లక్షలకు పడిపోయింది. ఇతర పథకాల కింద వేసిన లైన్లనే మళ్లీ లెక్కల్లో చూపి, అక్రమంగా బిల్లులు చేసుకున్నట్లు తెలుస్తోంది. 
 

56


2019లో తెదేపా ప్రభుత్వం ఉండగా ఫైబర్‌నెట్‌లో 108 మంది సిబ్బందికి జీతాల కింద నెలకు రూ.40 లక్షలు చెల్లించాం. వైకాపా హయాంలో ఎంపీ, ఎమ్మెల్యే వాట్సప్‌ మెసేజ్‌ చేస్తే చాలు.. నియామక ఉత్తర్వులు ఇచ్చేయడంతో ఉద్యోగుల సంఖ్య 1,363కు పెరిగింది. వారి జీతాలకే ప్రతి నెలా రూ.4 కోట్లు ఖర్చవుతోంది. వారంతా ఎక్కడ పనిచేస్తున్నారో కూడా తెలియదు. గత ప్రభుత్వ తీరుతో సంస్థ రూ.1,262 కోట్ల అప్పుల్లోకి వెళ్లింది. వీటన్నింటిపై విజిలెన్స్‌ విచారణ జరుగుతోంది’ అని వివరించారు.

66

చిత్రం కథ విషయంకు వస్తే..  కేంద్రాన్ని దిక్కారించడం వల్ల జగన్‌ జైలుకు వెళ్లిన సమయంలో తన అనుకున్న వారందరూ దూరం అయినా కూడా ఆయన సతీమణి వైఎస్‌ భారతి(సినిమాలో మాలతి) గారు ఎలా ధైర్యంగా ముందు అడుగు వెశారో వర్మ తనదైన స్టైల్లో చూపించే ప్రయత్నం చేసారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా పోటీకి సింగిల్‌గానే జగన్‌ బరిలోకి దిగితే... ఓటమి భయంతో చంద్రబాబు కూటమిని ఏర్పాటు చేసుకుని పోటీకి సిద్ధమౌతాడు.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మనసేన (జనసేన) అధినేత అయిన శ్రవణ్‌ కల్యాణ్‌ను తప్పించేందుకు బాబు ఎలాంటి ఎత్తుగడలు వెశాడో చూసారని తెలుస్తోంది..

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Duniya Vijay Divorce: భార్యకి విడాకులు ఇచ్చిన బాలయ్య విలన్‌, భరణం కింద 2 కోట్లు.. మరో కండీషన్‌ కూడా
Recommended image2
Vijay Deverakonda: రామ్ చరణ్ కాదు, శ్రీకృష్ణుడిగా విజయ్ దేవరకొండ.. రీమేక్ మూవీపై పెరుగుతున్న అంచనాలు
Recommended image3
Trisha Krishnan: పుకార్లకు చెక్ పెట్టిన త్రిష, లండన్ టూర్‌ వెనుక అసలు కథ ఇదే.. అభిమానులకు గుడ్‌న్యూస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved