సందీప్ రెడ్డి వంగాకు రామ్ చరణ్ దంపతుల స్పెషల్ గిఫ్ట్ ఎంటో తెలుసా?
ఈమధ్య పాన్ ఇండియా సినిమాలతో పాటు..టైమ్ దొరికినప్పుడల్లా వివాదాలతో కాలక్షేపం చేస్తున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఇక ప్రస్తుతం స్పిరిట్ సినిమా హడావిడిలో ఉన్న స్టార్ డైరెక్టర్ కు మెగాఫ్యామిలీ నుంచి స్పెషల్ గిప్ట్ ఒకటి అందింది. ఇంతకీ ఏంటా గిప్ట్.
- FB
- TW
- Linkdin
Follow Us
)
యానిమల్, కబీర్ సింగ్, అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తరువాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో స్పిరిట్ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి ఈమధ్య వరుసగా అప్డేట్స్ వస్తుండగా, తాజాగా హీరోయిన్ విషయంలో హాట్ హాట్ వార్తలు బయటకువచ్చాయి.
మొదట స్పిరిట్ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకొణె నటించనుందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకోవడంతో అధికారికంగా త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా ఎంపికైనట్లు ప్రకటించారు. దీపికను ప్రాజెక్ట్ నుండి తొలగించారా? లేక ఆమె స్వచ్ఛందంగా తప్పుకున్నారా? అనే అంశంపై స్పష్టత లేకపోయినప్పటికీ, దీపిక ఈ చిత్రంలో లేనట్టే అని క్లారిటీ వచ్చింది.
ఈ నేపథ్యంలో దర్శకుడు సందీప్ రెడ్డి తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. దీని వెంటనే దీపిక పదుకొణె కూడా కౌంటర్ పోస్ట్ చేయడం వల్ల ఈ అంశం మరింత హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియా వేదికగా ఇది పెద్ద చర్చకు దారి తీసింది.
ఈ వివాదం నడుస్తుండగానే ఇంతలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన సందీప్ రెడ్డికి ఒక ప్రత్యేక గిఫ్ట్ పంపారు. ఈ గిఫ్ట్ విషయాన్ని స్వయంగా సందీప్ రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ఆమె కోడలు ఉపాసన కలిసి నిర్వహిస్తున్న "అత్తమ్మాస్ కిచెన్" లో తాజాగా చేసినటువంటి ఆవకాయ పచ్చడిని, సమ్మర్ స్పెషల్గా సందీప్ రెడ్డికి పంపించారు.
అత్తమాస్ కిచెన్ లో ఈ మధ్యే ఆవకాయను కూడా చేర్చారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి ఈ విధంగా రాసుకొచ్చారు స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్ పంపినందుకు రామ్ చరణ్, ఉపాసనకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఆవకాయ టేస్ట్ అద్భుతంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.