మేడం టుస్సాడ్స్ లో రాంచరణ్ కి ఘనస్వాగతం.. ఫ్యాన్స్ హంగామా వైరల్
లండన్ లోని మేడం టుస్సాడ్స్ లో రామ్ చరణ్ స్టాచ్యూని ఆవిష్కరించబోతున్న సంగతి తెలిసిందే.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Ram Charan
మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొన్ని రోజుల క్రితం యూకే టూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఉపాసన, రాంచరణ్ .. తమ కుమార్తె క్లీంకారతో లండన్ వెళ్లారు. వీరితోపాటు మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు కూడా యూకే లో ఉన్నారు. లండన్ లోని మేడం టుస్సాడ్స్ లో రామ్ చరణ్ స్టాచ్యూని ఆవిష్కరించబోతున్న సంగతి తెలిసిందే.
Ram Charan
మేడం టుస్సాడ్స్ లో నేడు స్టాచ్యూ లాంచ్ ఘనంగా జరగబోతోంది. దీనికోసమే మెగా ఫ్యామిలీ అక్కడికి వెళ్లారు. తాజాగా చరణ్, చిరంజీవి, సురేఖ, ఉపాసన అంతా మేడం టుస్సాడ్స్ కి చేరుకున్నారు. లండన్ లోని మెగా అభిమానులు రాంచరణ్ కి ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హంగామా చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Ram Charan
రాంచరణ్ స్టైలిష్ లుక్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. మేడం టుస్సాడ్స్ స్టాచ్యూ లాంచ్ కావడం అరుదైన గౌరవం అని చెప్పాలి. సినిమాల విషయానికి వస్తే రాంచరణ్ చివరగా గేమ్ ఛేంజర్ చిత్రంలో నటించారు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్ తీవ్రంగా నిరాశపరిచింది.
Ram Charan
ప్రస్తుతం రాంచరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ మూవీ రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ చిత్రంగా రూపొందుతోంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ వీడియో సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా అభిమానులు ఆ వీడియోకి రీల్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో రాంచరణ్ కొట్టిన క్రికెట్ షాట్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు.
Ram Charan
రాంచరణ్ ఇప్పటికే పెద్ది చిత్రం కోసం కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేశారు. లండన్ నుంచి తిరిగి వచ్చి మరో షెడ్యూల్ లో పాల్గొంటారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. లెజెండ్రి మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.