అనసూయ, రష్మీలతో సమంత పోటీ.. రకుల్తో ఏం చెప్పించబోతుంది?
హాట్ యాంకర్స్ అనసూయ, రష్మీ, శ్రీముఖి మాదిరిగానే సమంత మారిపోయారు. షో.. షోకి ట్రెండీ డ్రెస్సుల్లో మెరుస్తుంది. తాను హోస్ట్ గా చేస్తున్న `సామ్జామ్` కోసం బ్లూ డ్రెస్సుల్లో కనువిందు చేస్తుంది. అయితే ఈ సారి రకుల్ ప్రీత్ సింగ్ కూడా మెరవడం విశేషం.
ఓటీటీ ఫ్లాట్ఫామ్ `ఆహా` లో సమంత హోస్ట్ గా `సామ్జామ్` టాక్ షో నడుస్తున్న విషయం తెలిసిందే.
వరుసగా బిగ్ స్టార్స్ ఇందులో సందడి చేస్తున్నారు. ఈ నెల 25న మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్న ఎపిసోడ్ పాల్గొనబోతుంది.
ఇప్పటికే తమన్నా, అల్లు అర్జున్ పాల్గొన్నారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొంది.
రకుల్, దర్శకుడు క్రిష్ ఇందులో సందడి చేశారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రకుల్ హీరోయిన్గా నటిస్తుంది. వైష్ణవ్ తేజ్ ఇందులో హీరో.
ఈ సందర్బంగా వీరిద్దరు `సామ్జామ్`లో పాల్గొని సందడి చేశారు. వీరి ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ఇవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇటీవల రకుల్ పై డ్రగ్స్ కేసు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాజాగా రకుల్ `సామ్జామ్`లో పాల్గొనడం ఆసక్తి నెలకొంది.
రకుల్ నుంచి సామ్ ఏం రాబట్టబోతుంది, రకుల్ ఏం చెబుతుందనేది మరింత ఆసక్తిగా మారింది. ఇది ఫన్నీగా, నవ్వులు పూయించడంతోపాటు ఎమోషనల్గానూ సాగుతుందని, చాలా ఎనర్జిటిక్గా ఉంటుందని సమంత తెలిపింది.