50ఏళ్ల వ్యక్తి నుంచి ప్రపోజల్ వచ్చింది.. అందుకే సింగిల్గా ఉన్నాః రకుల్ షాకింగ్ కామెంట్
టాలీవుడ్ హాట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మ్యారేజ్పై షాకింగ్ కామెంట్ చేసింది. తనకు యాభై ఏళ్ల వ్యక్తి నుంచి మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిందట. తాను పెళ్లి చేసుకోకపోవడానికి కారణమే అని చెప్పి షాక్ ఇచ్చింది. మరి ప్రస్తుతం శివరాత్రి ఉత్సవాల్లో భక్తితో మునిగిపోతున్న రకుల్ ఈ వ్యాఖ్యలు ఎప్పుడు చేసిందనే డౌట్ రావచ్చు. అ వివరాల్లోకి వెళితే..
రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల మ్యారేజ్ విషయంలో స్పందిస్తూ ఫ్యాన్స్ విస్తూ పోయే విషయాన్ని వెల్లడించింది.
ప్రస్తుతం బాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల కపిల్ శర్మ టాక్ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా తాను సింగిల్గా ఉండటంపై అసంతృప్తిని వ్యక్తి చేసింది. ఒంటరిగా ఉండటం కాస్త ఇబ్బందిగా ఉందట.
`దే దే ప్యార్ డే` సినిమా ప్రమోషన్ టైమ్లో ఓసారి కమిల్ శర్మ టాక్ షోలో పాల్గొంది రకుల్.ఈ సందర్భంగా ఓ రూమర్ గురించి చెప్పారు. అది నిజమా కాదా చెప్పాల్సి ఉంటుంది.
ఈ టాస్క్ లోనే రకుల్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. `దే దే ప్యార్ దే` తర్వాత రకుల్కి 50ఏళ్ల వ్యక్తి నుంచి ప్రపోజల్ వచ్చిందనేది దాని సారాంశం.
దీనిపై రకుల్ స్పందిస్తూ, అందుకే నేను ఇంకా సింగిల్గానే ఉన్నాను అని చెప్పింది రకుల్. `దే దే ప్యార్ దే`లో రకుల్ యాభై ఏళ్ల వ్యక్తిని ప్రేమిస్తుంది. యాభైఏళ్ల వ్యక్తిగా అజయ్ దేవ్గన్ నటించారు.
ఇందులో ఆయనతో డేట్ చేయడం ఆసక్తికరంగా, టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. దీంతో రకుల్కి నిజజీవితంలో కూడా అలాంటి ప్రపోజల్స్ వచ్చాయని ఈ టాక్ షోలో వెల్లడించింది.
అయితే తర్వాత ఆరా తీస్తే, ఇది నిజం కాదని, కేవలం ఆ టాక్ షోని రక్తికట్టించేందుకు మాత్రమే రకుల్ అలా చెప్పిందని అన్నారు. ఎంటర్టైన్ పంచడం కోసం అలా చేశారని కపిల్ శర్మ చెప్పారు.
మొత్తానికి రకుల్ ఇచ్చిన ఆ స్టేట్మెంట్ మాత్రం సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. ఇప్పుడు మరోసారి అది చర్చకు వచ్చింది.
ఇక రకుల్ ఇంకా పెళ్లిపై స్పందించడం లేదు. దేనికైనా టైమ్ రావాలంటుంది. మ్యారేజ్ ప్రశ్నలను ఆమె తప్పించుకుంటుంది.
ఇటీవల తెలుగులో `చెక్` చిత్రంలో మెరిసిన రకుల్ ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ సరసన క్రిష్ చిత్రంలో నటిస్తుంది. మరోవైపు హిందీలో నాలుగైదు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఓ రకంగా తెలుగు సినిమాలు తగ్గించి హిందీపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం శివరాత్రి ఉత్సవాల్లో బిజీగాఉంది. అందుకోసం కోయంబత్తూర్లోని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇషా ఫౌండేషన్ కి వెళ్లారు. అక్కడ పెద్ద శివుడి విగ్రహం వద్ద శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
సమంత, మంచు లక్ష్మీ, శిల్పారెడ్డిలతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొంటుంది రకుల్ ప్రీత్ సింగ్. ఆయా ఫోటోలను పంచుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
అక్కడ గురువారం ఉపవాస దీక్షలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.