- Home
- Entertainment
- Rajamouli: రాజమౌళిలో ధైర్యం నింపిన సినిమా.. చిరంజీవి సినిమాతో పూర్తిగా అప్పుల్లోకి, కానీ
Rajamouli: రాజమౌళిలో ధైర్యం నింపిన సినిమా.. చిరంజీవి సినిమాతో పూర్తిగా అప్పుల్లోకి, కానీ
దర్శక ధీరుడు రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి అంజి మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి నటించిన అంజి చిత్రం గ్రాఫిక్స్ తో అబ్బుర పరిచింది కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.

రాజమౌళి సినిమాలు
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారణాసి అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. 1300 కోట్ల అత్యంత భారీ బడ్జెట్ లో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం రాజమౌళి సినిమా అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉండే అంచనాలు వేరు. తెలుగు సినిమా స్థాయిని పాన్ వరల్డ్ రేంజ్ కి తీసుకెళ్లిన ఘనత రాజమౌళి కే దక్కుతుంది.
అలాంటి వారంటే ఇష్టం
అయితే రాజమౌళి కి ఇండస్ట్రీలో స్ఫూర్తిదాయకంగా నిలిచిన కొందరు ప్రముఖులు ఉన్నారు. వారిలో ఓ వ్యక్తి గురించి రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ..కష్టపడుతూ, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ఎదిగిన వారు ఎవరైనా తనకి ఇష్టమే అని రాజమౌళి అన్నారు.
అరుంధతి మూవీ
అలాంటి వారిలో మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఒకరు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు చిరంజీవి అంజి మూవీ తర్వాత చాలా డౌన్ అయ్యారు. అప్పుల్లో కూరుకుపోయారు. ఆ తర్వాత అరుంధతి సినిమాని అప్పుల్లో ఉండే ప్రారంభించారు. తక్కువ బడ్జెట్ లో అనుకున్నప్పటికీ బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడం కోసం మరింత అప్పులు చేశారు. చివరికి అరుంధతి చిత్రాన్ని అత్యద్భుతంగా తీర్చి దిద్దారు.
ధైర్యాన్ని ఇచ్చింది
సినిమా అంటే అంత ఫ్యాషన్ ఉన్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. నేను ఆ పరిస్థితుల్లో ఉండి ఉంటే అంత ధైర్యం చేయగలిగే వాడిని కాదు. అరుంధతి సినిమా తనకు కూడా ధైర్యాన్ని ఇచ్చిన చిత్రం అని రాజమౌళి తెలిపారు.
అనుష్క క్రేజ్
కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అరుంధతి చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీతో అనుష్క టాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది.

