- Home
- Entertainment
- ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున నటించిన ఆ మూడు చిత్రాలు.. ఎప్పటికీ ఎవ్వరూ తిరిగి చేయలేరు
ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున నటించిన ఆ మూడు చిత్రాలు.. ఎప్పటికీ ఎవ్వరూ తిరిగి చేయలేరు
తెలుగు సినిమా స్థాయిని పెంచేలా అప్పుడప్పుడు కొన్ని చిత్రాలు వస్తుంటాయి. అలాంటి చిత్రాలను ప్రేక్షకులు దశాబ్దాల పాటు గుర్తుంచుకుంటారు. ప్రేక్షకులను, చిత్ర పరిశ్రమని ప్రభావితం చేసేలా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఎన్నో చిత్రాలు రూపొందించారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Nagarjuna, Chiranjeevi, Sr NTR
తెలుగు సినిమా స్థాయిని పెంచేలా అప్పుడప్పుడు కొన్ని చిత్రాలు వస్తుంటాయి. అలాంటి చిత్రాలను ప్రేక్షకులు దశాబ్దాల పాటు గుర్తుంచుకుంటారు. ప్రేక్షకులను, చిత్ర పరిశ్రమని ప్రభావితం చేసేలా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఎన్నో చిత్రాలు రూపొందించారు. అయితే తన కెరీర్ లో వచ్చిన కొన్ని అద్భుతమైన చిత్రాలని ఎప్పటికీ ఎవ్వరూ తిరిగి చేయలేరని రాఘవేంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాఘవేంద్రరావు రూపొందించిన అంతటి అద్భుతమైన చిత్రాలు ఏంటి? వాటి గురించి ఆయన ఏం చెప్పారు ఇప్పుడు తెలుసుకుందాం.
raghavendra rao
రాఘవేంద్రరావు మాట్లాడుతూ ముందుగా ఎన్టీఆర్ తో రూపొందించిన అడవి రాముడు చిత్రం గురించి ప్రస్తావించారు. నా కెరీర్ ని పూర్తిగా మార్చేసిన చిత్రం అది. థియేటర్లో ఒక సినిమా చూస్తూ ప్రేక్షకులు డబ్బులు విసిరేయడం అనేది అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు. అది నా కెరీర్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఆ సినిమా సాధించిన రెవెన్యూ కూడా ఒక సంచలనం.
అడవి రాముడు
లెజెండ్రీ నటుడు రాజ్ కపూర్ కూడా అడవి రాముడు మూవీ చూసి ఆశ్చర్యపోయారు అని రాఘవేంద్రరావు అన్నారు. అడవి రాముడు చిత్రంలో సాంగ్స్ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ మూవీ 200 రోజులు ఫంక్షన్ కి ఆయన హాజరయ్యారు అని రాఘవేంద్రరావు అన్నారు. రాఘవేంద్రరావు ప్రస్తావించిన మరో చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి. మెగాస్టార్ చిరంజీవి, రాఘవేంద్రరావు, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన దృశ్య కావ్యం అది.
ఆ సినిమా రిలీజ్ టైం లో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన తుఫాను ఉంది. థియేటర్లో కూడా వరద నీరు చేరాయి. అయినా కూడా ప్రేక్షకులు ఆ మూవీ చూస్తూ థియేటర్ నుంచి బయటికి వెళ్లలేదు. దీంతో ఫైర్ ఇంజన్ తీసుకువచ్చి వర్షపు నీటిని తొలగించాల్సి వచ్చింది అని రాఘవేంద్రరావు గుర్తు చేసుకున్నారు.
ఇక తనకి ఎంతో ఇష్టమైన చిత్రం అన్నమయ్య. అప్పటివరకు నేను కమర్షియల్ చిత్రాలు తీశాను. కానీ అన్నమయ్య నాలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఈ మూడు చిత్రాలను నేను కూడా తిరిగి అంత గొప్పగా తీయలేను. తెలుగు సినిమా చరిత్రలో అలాంటి చిత్రాలు ఇక రావు అని రాఘవేంద్రరావు అన్నారు.