`పోకిరి` ఎందుకు హిట్ అయ్యిందో అర్థం కాలే.. పూరీ జగన్నాథ్ ఇలా షాకిచ్చాడేంటి?
మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన మొదటి మూవీ `పోకిరి`. అప్పట్లో ఇది సంచలన విజయాన్ని సాధించి ఇండస్ట్రీ రికార్డులు కొట్టింది. దీనిపై పూరీ షాకింగ్ కామెంట్ చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబుకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ `పోకిరి`. ఈ చిత్రంతో ఆయన సూపర్ స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకోవడమే కాదు, టాలీవుడ్లో స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. అప్పట్లో ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. అంతేకాదు అప్పటి వరకు సినిమా హిట్ అంటే ఎన్ని రోజులు ఆడిందనే లెక్కలు వేసేవాళ్లు. కానీ ఎంత కలెక్ట్ చేసిందనే లెక్కలకు ప్రయారిటీ ఉండదు. కానీ `పోకిరి` సినిమా కలెక్షన్ల టేస్ట్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది.
ఇందులో పూరీ జగన్నాథ్ బోల్డ్ టేకింగ్, మహేష్ బాబు మాస్ అవతార్, యాక్షన్, డైలాగ్లు, దీనికితోడు ఇలియానా అందాలు యాడ్ కావడం సినిమాని పెద్ద హిట్ చేశాయి. ఆ మూవీ గురించి చాలా రోజులు మాట్లాడుకున్నారు. ఈ సినిమా తర్వాత పూరీకి యావరేజ్లు పడ్డాయి, ఏదో ఆడుతున్నాయిగానీ, `పోకిరి` రేంజ్లో లేవు. చాలా మంది కూడా పూరీకి ఇదే విషయాన్ని చెప్పారట.
ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రశ్న పూరీకి ఎదురైంది. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ, `పోకిరి` ఆడుతుందని అనుకున్నాం. కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని, ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తుందని అనుకోలేదు. మహేష్ బాబు గానీ, నేను గానీ ఊహించలేదు. మాకు పెద్ద సర్ప్రైజ్ అని తెలిపారు. `నా వద్ద ఉన్న కథల్లో అది కూడా ఓ కథ మాత్రమే, మంచి సినిమా అవుతుంది, బాగుంటుందని అనుకున్నామే తప్ప దీన్ని అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదని తెలిపారు పూరీ జగన్నాథ్.
`పోకిరి` ఇంత పెద్ద హిట్కి కారణం ఏంటనేది అడిగిన ప్రశ్నకి పూరీ స్పందిస్తూ, నిజం చెప్పాలంటే `పోకిరి` తర్వాత నేను చేసిన సినిమాలు ఏదో ఆడుతున్నాయిగానీ `పోకిరి`లా పెద్ద హిట్ కావడం. అందరు అదే మాట అంటున్నారు. దీంతో అసలు నేను ఏం తీశాను అని చెప్పి ఓ రోజు `పోకిరి` సినిమాని ప్రసాద్ ల్యాబ్లో వేసుకుని చూశా. నాకు ఏం అర్థం కాలేదని షాకిచ్చాడు పూరీ. `ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే` టాక్ షోలో ఆయనఈ కామెంట్ చేశారు.
మరి `పోకిరి` హిట్ కి కారణమేంటనేది చూస్తే, ఆ సినిమా క్లైమాక్స్ మెయిన్ రీజన్. సినిమా మొత్తానికి క్లైమాక్స్ హైలైట్గా నిలుస్తుంది. అప్పటి వరకు హీరో మహేష్ రౌడీగా ఉన్న మహేష్ క్లైమాక్స్ ట్విస్ట్ తో పోలీస్ ఆఫీసర్గా ఎంట్రీ ఇచ్చే సీన్ హైలైట్గా నిలుస్తుంది. సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లిందే. ఆ ఒక్క సీన్ కోసమే రిపీటెడ్ ఆడియెన్స్ సినిమాని చూశారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇక ఇప్పుడు పూరీ జగన్నాథ్.. రామ్ పోతినేని హీరోగా `డబుల్ ఇస్మార్ట్` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. `ఇస్మార్ట్ శంకర్`కి సీక్వెల్గా వస్తుంది. ఆగస్ట్ 15న సినిమా విడుదల కానుంది. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఇంటర్నేషనల్ మూవీ రేంజ్లో దీన్ని తెరకెక్కించబోతున్నారు.