- Home
- Entertainment
- Akhil: తెలిసీతెలియక బురదలో కాలేశా, రంగస్థలం నా మైండ్ సెట్ మార్చింది.. తన మూవీపై తానే సెటైర్లు వేసిన అఖిల్
Akhil: తెలిసీతెలియక బురదలో కాలేశా, రంగస్థలం నా మైండ్ సెట్ మార్చింది.. తన మూవీపై తానే సెటైర్లు వేసిన అఖిల్
లెనిన్ తో ఫస్ట్ హిట్ కొట్టాక అఖిల్ అక్కినేని తన తొలి చిత్రం అఖిల్ పై సెటైరికల్ కామెంట్స్ చేశాడు. అదే విధంగా రాంచరణ్ రంగస్థలం మూవీ గురించి అఖిల్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

Akhil Akkineni
అఖిల్ అక్కినేని నటించిన తాజా చిత్రం లెనిన్ ఘనవిజయం సాధించింది. పదేళ్లుగా ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కి సరైన సక్సెస్ లభించింది. స్వయంగా నాగార్జున నిర్మించిన ఈ చిత్రం బయ్యర్లకు లాభాలు అందిస్తోంది. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించారు.
తొలి చిత్రంపై సెటైర్లు
లెనిన్ సక్సెస్ తర్వాత అఖిల్ తన కెరీర్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కెరీర్ బిగినింగ్ లో ఎదురైన పరాజయాలు, వాటి నుంచి నేర్చుకున్న అనుభవాలని పంచుకున్నారు. పెద్దగా మెచ్యూరిటీ లేని టైంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాను. నేను ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నది మెథడ్ యాంక్టింగ్. కానీ నా సినిమాల్లో ఎప్పుడూ అది చేయలేదు. నా ఫస్ట్ మూవీలో 6 పాటలు, 5 ఫైట్స్, 5 కామెడీ సీన్లు, 3 సెంటిమెంట్ సీన్లు ఉంటాయి.
అదే బురదలో కాలేశాను
తెలుగు కమర్షియల్ సినిమాల్లో ఇది రొటీన్ ఫార్ములా. ఆ ఫార్ములా ఎండ్ అయిపోతున్న దశలో నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. తెలిసీ తెలియక అదే బురదలో కాలేశాను. రొటీన్ ఫార్ములా కావడంతో అఖిల్ మూవీ డిజాస్టర్ అయింది. ఆ టైం లో వచ్చిన అర్జున్ రెడ్డి మూవీ అదరగొట్టేసింది. జనాలు కొత్తదనం కోరుకుంటున్నారు అని అర్థం అయింది. అర్జున్ రెడ్డి కమర్షియల్ మూవీ కాదు.
మార్పు తీసుకువచ్చిన చిత్రం రంగస్థలం
కమర్షియల్ సినిమాల్లో నా మైండ్ సెట్ మార్చిన మూవీ రంగస్థలం. అసలు ఏం సినిమా అది. రాంచరణ్ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా నటించాడు. ఒక స్టోరీని నమ్మి వాళ్ళు దానిని పెద్ద స్కేల్ లో తీసేశారు. జనాలు పిచ్చెక్కిపోయారు. ఆ యుఫోరియా నాకు ఇంకా గుర్తుంది. కమర్షియల్ సినిమాల్లో మార్పు తీసుకొచ్చిన చిత్రం రంగస్థలం. పెద్ద హీరోలతో, పెద్ద బడ్జెట్ లో ఇలాంటి సినిమాలు కూడా తీయొచ్చు అని నిరూపించింది.
రాంచరణ్ పై గౌరవం పెరిగింది
ఆ మూవీ తర్వాత మన హీరోలు క్యారెక్టర్ బేస్డ్ సినిమాలు చేస్తున్నారు. అప్పటికే రాంచరణ్ కి బాక్సాఫీస్ సక్సెస్ ఉంది. కానీ రంగస్థలం చిత్రంతో రాంచరణ్ పై నటుడిగా గౌరవం పెరిగింది అని అఖిల్ తెలిపారు.

