MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • పూరి జగన్నాథ్‌ తమ్ముడు `ఒక పథకం ప్రకారం` ఏం చేశాడో తెలుసా? అన్నయ్య లోటు కనిపిస్తుందా?

పూరి జగన్నాథ్‌ తమ్ముడు `ఒక పథకం ప్రకారం` ఏం చేశాడో తెలుసా? అన్నయ్య లోటు కనిపిస్తుందా?

దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తమ్ముడు సాయి రామ్‌ శంకర్‌ హీరోగా సక్సెస్ అయ్యాడు, కానీ మధ్యలో బ్రేక్ వచ్చింది. కానీ ఇప్పుడు రెట్టింపు ఎనర్జీతో వస్తున్నాడు.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 21 2025, 11:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ ఇటీవల కాలంలో ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆదరణ పొందటం లేదు. సక్సెస్‌ కోసం స్ట్రగుల్‌ అవుతున్నాడు. ఆయనే కాదు, ఆయన తమ్ముడు హీరో సాయి రామ్‌ శంకర్‌ పరిస్థితి కూడా అంతే. ఆయన వెండితెరపై కనిపించి చాలా ఏళ్లు అవుతుంది.

ఇప్పుడు కమ్‌ బ్యాక్‌ కోసం వస్తున్నాడు. `ఒక పథకం ప్రకారం` వస్తున్నాడు. ఇదే ఆయన చేస్తున్న సినిమా. `ఒక పథకం ప్రకారం` పేరుతో తెరకెక్కుతుంది. ఈ మూవీకి వినోద్‌ కుమార్‌ విజయన్‌ దర్శకత్వంలో  వినోద్ విహాన్ ఫిల్మ్స్ - విహారి సినిమా హౌస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్స్ పై గార్లపాటి రమేష్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ ని మంగళవారం విడుదల చేశారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్‌ చిత్రమిది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఉండబోతుందని, సరికొత్త ట్రీట్‌ని ఇస్తుందని, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా అలరిస్తుందని, కొత్త అనుభూతిని ఇస్తుందని టీమ్‌ తెలిపింది. ఈ మూవీ ఫిబ్రవరి 7న విడుదల కాబోతుంది. అయితే సినిమాని జనాల్లోకి వెళ్లేందుకు ఓ ప్రమోషనల్‌ కంటెంట్‌ని వాడారు.

ఇందులో విలన్‌ ఎవరో ఫస్టాఫ్‌ వరకు గుర్తిస్తే పది వేల రూపాయలు ఇస్తామనే కంటెస్టెంట్‌ పెట్టారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. హీరో సాయి రామ్‌ శంకర మాట్లాడుతూ, ఇది నా కెరీర్ కి ఎంతో హెల్పయ్యే సినిమా. నాకు కచ్చితంగా కమ్ బ్యాక్ ఫిల్మ్ ఆవుతుంది. ఈచిత్ర దర్శకుడు వినోద్  ప్రతిష్టాత్మక బెర్లిన్ అవార్డుతోపాటు నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్న వ్యక్తి. 
 

35

ఇందులో నేను సీదార్ధ నీలకంఠ అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నటించాను. నా నటనలో చిన్నపాటి కృత్రిమత్వం కూడా ఉండకూడదని నెలరోజులపాటు  నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్షణ తీసుకుని నటించాను. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ లో చాలామంది నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఉన్నారు. నేను మళ్ళీ భవిష్యత్తులో ఇంతటి టెక్నీకల్లీ రిచ్ ఫిల్మ్ లో నటించే ఛాన్స్ వస్తుందని నేననుకోను. ఈ చిత్రం ఎవ్వరినీ డిజప్పాయింట్ చేయదు. ఇది నా హామీ. ఇటువంటి సినిమ కోసమే ఇన్నాళ్లుగా వెయిట్ చేశాను. ఇందులో నా పాత్ర స్టోరీని డ్రైవ్ చేస్తుంది` అని అన్నారు. 
 

45

ఈ క్రమంలో అన్నయ్య పూరీ జగన్నాథ్‌ ప్రమేయ గురించి చెబుతూ, ఇన్నేళ్ల తర్వాత కూడా కథల ఎంపికలో, కెరీర్ విషయంలో తన అన్నయ్య పూరి జగన్నాధ్ ను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదన్నది తన భావన అని, అందుకే ఆయన్ని ఒత్తిడి చేయను అని చెప్పాడు. అన్నయ్య మోరల్ సపోర్ట్ తనకు ఎప్పుడూ ఉంటుందని, అడగడం ఆలస్యం సలహాలు-సూచనలు ఇస్తారని సాయిరామ్ తెలిపారు.

ఇద్దరం కలిసి సినిమా చేయడం తన చేతుల్లో లేదని, తాను ఏం చెప్పలేను అన్నారు. ఆకాష్‌ పూరీతో కలిసి సినిమా చేయాలని ఉందని, ఆ ప్లాన్‌ చేస్తామన్నారు సాయి రామ్‌ శంకర్‌. అన్నయ్య పూరీ ప్రారంభంలో సలహాలు ఇచ్చేవారని, స్క్రిప్ట్ ఎంపికలో ఉండేవారని, అందుకే వరుస విజయాలు దక్కాయని, కానీ ఇటీవల అన్నయ్యతో సలహాలు తీసుకోని లోటు కనిపిస్తుందన్నారు. 
 

55

చిత్ర దర్శకనిర్మాత వినోద్ కుమార్ విజయన్ మాట్లాడుతూ... నాకు చిన్నప్పటినుంచి తెలుగు సినిమాలన్నా, తెలుగువాళ్ళన్నా, తెలుగు పచ్చళ్లన్నా చాలా చాలా ఇష్టం. ఒక పథకం ప్రకారం చిత్రంలో ప్రతి మూడు నాలుగు సీన్స్ కు ఒక ట్విస్ట్ ఉంటుంది. ఇందులో ఉన్న రెండు పాటలూ కథను ముందుకు తీసుకువెళ్లేలా ఉంటాయి.

రెండు పాటలూ సిడ్ శ్రీరామ్ పాడారు. రాజీవ్ రాయ్ సినిమాటోగ్రఫీ, గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి" అన్నారు. సాయి రామ్‌ శంకర్‌, శృతి సోధి, ఆషిమా నర్వాల్, సముద్రఖని, రవి పచ్చముత్తు, భానుశ్రీ, గార్లపాటి కల్పలత, పల్లవి గౌడ ముఖ్య పాత్రలు పోషించారు.  
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved