ప్రియాంక చోప్రా టాలీవుడ్ ఎంట్రీ, స్టార్ హీరో సినిమాలో నటించబోతున్న గ్లోబల్ బ్యూటీ..?
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందా..? పాన్ ఇండియా స్టార్ కు జతగా సినిమాచేయబోతుందా..? సౌత్ నుంచి హీరోయిన్ గా మరోసారి మెరుపులు మెరిపించబోతుందా..? ఈ వార్తల్లో నిజమెంత.
ఇండియా నుండి హాలీవుడ్ చేరి.. గ్లోబల్ స్టార్డమ్ ని సొంతం చేసుకున్న బ్యూటీ ప్రియాంక చోప్రా. బాలీవుడ్ లో స్టార్ గా వెలుగు వెలిగిన ప్రియాంక... గత కొన్నేళ్లుగా.. బాలీవుడ్ ను వదిలిపెట్టేసింది. అంతే కాదు అప్పుడప్పుడు బాలీవుడ్ కు చురకలు కూడా అంటిస్తుంటుంది గ్లోబల్ బ్యూటీ.
బాలీవుడ్ లో చాలా మంది వారసత్వంగా వచ్చి సెటిల్ అయినవారే.. కాని ఎటువంటి ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోయిన్ గా ఎదిగి స్టార్డమ్ అందుకున్నబ్యూటీ ప్రియాంకచోప్రా. కొన్నాళ్లుగా ఇండియన్ సినిమాలకు దూరంగా ఉంటోంది. అడపాదడపా హిందీ సినిమాలు చేస్తూ అప్పడుప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తుంటుంది.
ప్రస్తుతం ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలే చేస్తోంది ప్రియాంక చోప్రా. రీసెంట్ గా అమెరికా వెళ్ళిన రాజమౌైళి టీమ్ ను కూడా కలిసింది. గోల్డెన్ గ్లోబ్ సాధించినందకు కంగ్రాట్స్ కూడాచెప్పింది బ్యూటీ. ఇక తనకంటే పదేళ్లు చిన్నవాడైన
హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ని ప్రేమించి పెళ్లాడింది ప్రియాంక. సరోగసి ద్వారా ఓ కూతురిని కూడా కన్నది. రీసెంట్ గానే కూతురిని గా ఫ్యాన్స్ కి చూపించింది.
ఈ క్రమంలో చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇండియాకి వచ్చింది ప్రియాంక. ఇండియాలో తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలి అనుకుంటుందట. అయితే.. ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ఈసారి బాలీవుడ్ లోకాకుండా సౌత్ పై దృష్టి పెట్టిందట ప్రియాంక. సౌత్ స్టార్ హీరోలతో ముఖ్యంగా టాలీవుడ్ హీరోలతో నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తోందట.
ఇక ప్రియాంక సౌంత్ ఎంట్రీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రియాంక చోప్రా తెలుగు హీరోతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతుందంటున్నారు. వరుస పాన్ ఇండియా సినిమాలతో యూనివర్సల్ క్రేజ్ సొంతం చేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు జతగా ప్రియాంక నటించబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.
మైత్రి మూవీ మేకర్స్ ప్రభాస్ – హృతిక్ రోషన్ కాంబినేషన్ లో ఓ భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈక్రమంలో ఈ సాలిడ్ యాక్షన్ మూవీలో ప్రియాంక చోప్రా ప్రభాస్ జతగా నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈసినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని నెట్టింట్లో వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
అంతే కాదు మరోవైపు డైరెక్టర్ సందీప్ రెడ్డి ప్రభాస్ తో రూపొందించబోతున్న స్పిరిట్ సినిమాలో కూడా ప్రియాంకని తీసుకునే ఆలోచన చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈరెండు సినిమాల విషయంలో.. ప్రియాంక చోప్రా సౌత్ ఎంట్రీ విషయంలో అఫీషియల్ గా మాత్రం ఎటువంటి అనౌన్స్ మెంట్ లేదు. ఒక వేళ ఈ వార్త నిజమైతే.. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ప్రియాంక చోప్రా రామ్ చరణ్ జోడీగా.. జంజీర్ సినిమాలో నటించింది. కాకపోతే ఈ మూవీ బాలీవుడ్ మూవీగా తెరకెక్కి.. టాలీవుడ్ లో తుఫాన్ టైటిల్ తో రిలీజ్ అయ్యి.. డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు డైరెక్ట్ ఎంట్రీకి రెడీ అయ్యిందట ప్రియాంక. ఇప్పటికే దీపికా పదుకొనే, కియారా అద్వానీ, మృణాల్ ఠాకూర్ లాంటి తారలు టాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. ఇక వీరికి జతగా ప్రియాంక చేరబోతున్నట్టు తెలుస్తోంది.