తల్లైన ప్రియాంక చోప్రా.. కొత్త ఫ్యామిలీ మెంబర్కు స్వాగతం పలికిన పీసీ జోడి
బాలీవుడ్ నుంచి హాలీవుడ్లో అడుగు పెట్టిన హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ తమ కుటుంబంలోకి కొత్త సభ్యున్ని ఆహ్వానించారు. వారు కొత్తగా ఓ కుక్కను దత్తత తీసుకున్నారు.
హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ మరో కుక్కను దత్తత తీసుకున్నారు. అంతేకాదు ఈ కుక్క పేరు మీద కూడా ఓ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను ప్రారంభించారు.
పీసీ తమ కొత్త కుక్క పిల్లను అభిమానులకు పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ డాగ్ హస్కీ ఆస్ట్రేలియన్ షెప్పర్డ్ అయి ఉంటుందని పీసీ కామెంట్ చేసింది.
ప్రియాంక తన ఇన్స్టాగ్రామ్లో `ఇది కొత్త ఫ్యామిలీ పిక్చర్.. ఓ రెస్క్యూలో ఈ పాండాను మేము కొద్ది రోజుల క్రితం తీసుకున్నాము` అంటూ కామెంట్ చేసింది ప్రియాంక.
తన మరో డాగ్ డయనా ఫోటోను కూడా షేర్ చేసింది ప్రియాంక.
అయితే ఈ ఫోటోలో తమ మరో పెట్ డాగ్ ఫోటోనే గ్రాఫిక్స్ లో యాడ్ చేశారు. అందుకు కారణం కూాడా వివరించింది. తమ ఫస్ట్ ఫెట్ డాగ్ ప్రస్తుతం తమతో లేదని అందుకే దాన్ని ఫోటోషాప్ చేసి యాడ్ చేశామని చెప్పింది.
కరోనా లాక్ డౌన్ ప్రకటించిన దగ్గర నుంచి ప్రియాంక, నిక్లు అమెరికా, కాలిఫోర్నియాలోని తమ ఇంట్లోనే ఉంటున్నారు. అప్పటి నుంచి జూమ్ ద్వారా ఇండియాలోని తమ సన్నిహితులతో టచ్లోనే ఉంటుంది.
ఇటీవల మీడియాకు ఓ ఇచ్చిన ఇంటర్వ్యూలో తానకు ఆస్థామా, తన భర్తకు డయాబెటిస్ ఉంది కాబట్టి కరోనా విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నామని తెలిపిందే. అందుకే ఎవరినీ ప్రత్యక్షంగా కలవకపోయినా జూమ్ ద్వారా అందరితో టచ్లోనే ఉంటున్నామని క్లారిటీ ఇచ్చింది పీసీ.