- Home
- Entertainment
- Priyamani : శారీలో మెస్మరైజ్ చేస్తున్న ‘ప్రియమణి’.. ఆమె అందానికి ఫిదా అవ్వాల్సిందే..
Priyamani : శారీలో మెస్మరైజ్ చేస్తున్న ‘ప్రియమణి’.. ఆమె అందానికి ఫిదా అవ్వాల్సిందే..
తెలుగింటి అమ్మాయి అనిపించుకున్న హీరోయిన్ ప్రియమణి ( Priyamani). అటు సినిమాలు, ఇటు టీవీ షోలతో ప్రేక్షకులను అలరిస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ తన గ్లామర్ తో నెటిజన్లను ఆకర్షిస్తోందీ ‘ఢీ’( Dhee) బ్యూటీ .

టాలీవుడ్ లో గ్లామర్, నటనతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ‘ప్రియమణి’. స్టార్ హీరోల సరసన నటించిన ఆడియెన్స్ ను మెప్పించింది. తనకంటూ మంచి కేరీర్ ను బిల్డప్ చేసుకుంది.
2003లో ‘ఎవరే అతగాడు’తో ప్రియమణి తన సినీ రంగ ప్రవేశం చేసింది. అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ నే ఉంది. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ మూవీల్లోనూ నటించిన తన పాపులారిటీని పెంచుకుంది.
అయితే 2010 వరకు నాగార్జున (Nagarjuna) ప్రధాన కథానాయకుడిగా విడుదలైన ‘రగడ’ మూవీ వరకు ప్రియమణి ఒక్క ఊపూపింది. రక్త చరిత్ర, గోలీమార్, సాధ్యం, శంభోశిబశంభో, యమదొంగ వంటి చిత్రాల్లో నటించి ఆడియెన్స్ ను తన అభిమానులుగా మార్చుకుంది.
రగడ మూవీ తర్వాత అరకొరగా తెలుగులో సినిమాలు చేసిన పెద్దగా ఆమెకు గుర్తింపు రాలేదు. ఈ సమయంలో కన్నడలో ఎక్కువ చిత్రాల్లో నటించింది.
దాదాపుగా తెలుగు సినిమాలకు నాలుగేండ్ల పాటు దూరంగా ఉన్న ప్రియమణి విక్టరీ వెంకటేశ్ నటించిన ‘నారప్ప’, ‘భామా కలాపం’, ‘విరాట పర్వం’తో మళ్లీ స్పీడ్ పెంచింది.
ప్రియమణి నటించిన తొలి ఓటీటీ మూవీ ‘భామా కలాపం’. అభిమన్యు దర్శకుడిగా పరిచయమైన ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీని సుధీర్ ఈదర, బాపినీడు బి నిర్మించారు. ఈ సినిమా ఇటీవల విడుదలై ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
క్రైమ్ కామెడీతో తెరకెక్కిన ఈ సినిమా ప్రియమణికి మంచి పేరుతీసుకొచ్చింది. అదే విధంగా ఈ ఏడాది ప్రియమణి చాలా మూవీల్లో నటిస్తోంది. హిందీలో ‘మైదాన్’, కన్నడలో ‘సైనైడ్’, ‘డాక్టర్ 56’, ‘కైమారా’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ కూడా కొనసాగుతోంది.
అలాగే తమిళంలోనూ ‘కొటేషన్ గ్యాంగ్’ మూవీతో పాటు, హిందీలోనూ మరో చిత్రానికి సైన్ చేసిందంట ప్రియమణి. మొత్తం మీద అన్ని భాషల్లో తన గ్లామర్ తో హీరోయిన్ గా క్రేజ్ పెంచుకుంటోందీ భామా.
మరోవైపు ‘ఢీ’ షోకు జడ్జీగా వ్యవహరిస్తూ బిజీగా గడుపుతోంది. తెలుగులో ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఢీ 14’కి కూడా ప్రస్తుతం ఫీమేల్ జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో ‘ప్రియమణి’ అపియరెన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక సోషల్ మీడియాలనూ తన క్రేజ్ మామూలుగా లేదు.
గత కొద్ది రోజులుగా ప్రియమణి శారీలో దర్శనమిస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తన అందాలను విందుగా చేస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా లైట్ రెడ్ కలర్ శారీలో హాట్ స్టిల్స్ ఇచ్చింది. ‘మీకు సరిపోయే ఫ్యాషన్ని మార్చవద్దు.. కానీ మీకు ఫిట్ అయ్యే ఫ్యాషన్ని మార్చండి’ అంటూ నోట్ రాసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.