దారుణంగా ట్రోలింగ్.. అయినా బాత్ టబ్ ఫోటోలు షేర్ చేస్తున్న ప్రణీత, ఎందుకో తెలుసా
ప్రణీత సుభాష్ పేరు చెప్పగానే అత్తారింటికి దారేది చిత్రంలో అందంగా మెరిసిన బాపు బొమ్మ గుర్తుకు వస్తుంది. ప్రణీత 'ఏం పిల్లో ఏం పిల్లడో' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

ప్రణీత సుభాష్ పేరు చెప్పగానే అత్తారింటికి దారేది చిత్రంలో అందంగా మెరిసిన బాపు బొమ్మ గుర్తుకు వస్తుంది. ప్రణీత 'ఏం పిల్లో ఏం పిల్లడో' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన 'అత్తారింటికి దారేది' చిత్రంలో నటించే గోల్డెన్ ఛాన్స్ అందుకుంది.
ఈ చిత్రం నుంచే ప్రణీతని అభిమానులు బాపు బొమ్మ అని పిలవటం ప్రారంభించారు. ప్రణీత కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించింది. కానీ సరైన విజయం దక్కలేదు. ప్రణీత తెలుగులో అత్తారింటికి దారేది, రభస , బ్రహ్మోత్సవం లాంటి చిత్రాల్లో నటించింది.
ఇదిలా ఉండగా ప్రణీత 2021 లో వివాహ బంధంలోకి అడుగుపెట్టి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. బెంగళూరుకి చెందిన నితిన్ రాజు అనే బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుంది. ఇటీవల ప్రణీత ఓ బిడ్డకు తల్లి కూడా అయింది. ప్రణీత ప్రస్తుతం కంప్లీట్ గా మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రణీత వివాహం తర్వాత కూడా నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. తన గ్లామరస్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.
తాజాగా ప్రణీత సుభాష్ షేర్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారడం మాత్రమే కాదు.. ట్రోలింగ్ కి కూడా కారణం అవుతోంది. ప్రణీత బాత్ టబ్ లో స్నానం చేస్తున్న వీడియో షేర్ చేసింది.
ఇలాంటి వీడియోలు ఫోటోలు షేర్ చేసి నీపై ఉన్న విలువ పోగొట్టుకోకు అంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలాంటివి నీ నుంచి ఆశించలేదని అంటున్నారు. అయినా కూడా ప్రణీత తగ్గడం లేదు. తాజాగా మరోసారి బాత్ టటబ్ లో స్నానం చేస్తున్న పిక్స్ షేర్ చేసింది. అయితే ప్రణీత ఇలా చేయడానికి కారణం ఉంది.
ఇటీవల ప్రణీత తన 3వ మ్యారేజ్ యనవర్సరీ సెలెబ్రేట్ చేసుకుంది. మే 30న ప్రణీత 3 వ మ్యారేజ్ యానవర్సరీ. దీనితో తన భర్త నితిన్ తో కలసి ప్రణీత థాయ్ ల్యాండ్ వెకేషన్ వెళ్ళింది. వెడ్డింగ్ యానవర్సరీ కాబట్టి భర్తతో రొమాంటిక్ గా ఎంజాయ్ చేస్తోంది. తన భర్తతో రొమాంటిక్ గా రెస్టారెంట్స్, స్విమింగ్ పూల్స్ ఇలా వివిధ చోట్ల ఉన్న పిక్స్ షేర్ చేస్తోంది.