Prakash Raj : రామాయణంపై జోకులు.. ప్రకాశ్ రాజ్పై కేసు.. ఇంతకీ ఏమన్నారంటే?
రామాయణంపై నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయనపై కేసు కూడా నమోదైంది. మత మనోభావాలను దెబ్బతీశారని కొందరు ఆరోపిస్తుండగా, ఆన్లైన్లో ఈ అంశంపై పెద్ద చర్చే జరుగుతోంది.

న్యాయపరమైన చిక్కుల్లో ప్రకాశ్ రాజ్
రామాయణంపై ప్రకాశ్ రాజ్ కామెంట్స్..
ఈమధ్య కాలంలో చేసిన ప్రసంగంలో ప్రకాశ్ రాజ్, రామాయణాన్ని వ్యంగ్యంగా, ఆధునిక శైలిలో చెప్పారు. రాముడు, రావణుడి మధ్య గొడవ 'పండ్లు దొంగిలించడం' వల్లే మొదలైందని, జీఎస్టీ వంటి పదాలను కూడా వాడారు. ఇది కేవలం జోక్ అయినా, పవిత్ర గ్రంథాన్ని అవమానించడమేనని చాలామంది భావిస్తున్నారు.
Prakash Raj narrates a made up version of Ramayan to mock Hindus
-Ram JI was North Indian
-Ravan was South Indian tribal
-They became enemies bcz Ram Ji stole fruits from Ravan
And he made this blasphemous story only to promote beef eating and create north south divide
Shame… pic.twitter.com/HFAV95HXbR— Amit Kumar Sindhi (@AMIT_GUJJU) April 16, 2026
విలక్షణ నటుడిపై ఆడియన్స్ ఆగ్రహం..
ఈ వీడియో ఆన్లైన్లో వైరల్ అవ్వగానే, చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. మత మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ ఆయనపై క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. రామాయణాన్ని అవమానించినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.
ప్రశాక్ రాజ్ కు సపోర్ట్ గా..
ఈ వివాదంపై ప్రజల అభిప్రాయాలు రెండుగా విడిపోయాయి. మత గ్రంథాలపై ఎలాంటి జోకులు వేయకూడదని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ప్రకాశ్ రాజ్కు సపోర్ట్ గా నిలుస్తూ.. ఇది భావప్రకటనా స్వేచ్ఛ కిందికే వస్తుందని మరికొందరు వాదిస్తున్నారు.

