రజనీకాంత్ను దాటేసిన ప్రభాస్.. ఇండియాలోనే టాప్!
బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. ఆ తరువాత రూపొందిన సినిమాలన్నీ భానీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో రూపొందుతుండటంతో ప్రభాస్ పారితోషికం కూడా అదే స్థాయిలో పెరిగింది. తాజాగా ప్రభాస్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న స్టార్గా ఎదిగాడన్న ప్రచారం జరుగుతోంది.
ఇండియా అత్యధిక పారితోషికం అందుకుంటున్న తారలు సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్.
అయితే ఇటీవల అందరినీ బీట్ చేస్తూ ఇండియాలో హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్గా అవతరించాడు రజనీకాంత్. ఇటీవల రజనీకాంత్ ఒక్కో సినిమాకు 60 నుంచి 70 కోట్ల వరకు పారితోషికంగా అందుకుంటున్నట్టుగా కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే రజనీకాంత్ను కూడా కోలీవుడ్ దళపతి విజయ్ బీట్ చేశాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న మాస్టర్ సినిమాకు విజయ్ 80 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడట.
వర్షం, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి లాంటి సినిమాలతో స్టార్ ఇమేజ్ అందుకున్న ప్రభాస్, బాహుబలితో ఎవరికీ అందనంత స్థాయికి ఎదిగాడు.
2015లోొ రిలీజ్ అయిన బాహుబలి తొలి భాగంతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్, 2017లో రిలీజ్ అయిన బాహుబలి 2తో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన స్టార్ హీరోగా నిలిచాడు. ఈ సినిమాతో ఎన్నో రికార్డ్లను తన ఖాతాలో వేసుకున్నాడు ప్రభాస్.
ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమాలో నటిస్తున్న ప్రభాస్, ఆ తరువాత మహానటి ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. అయితే ఈ సినిమాకు దాదాపు 70 కోట్ల వరకు పారితోషికం అందుకోబోతున్నాడట ప్రభాస్. అంతేకాదు డబ్బింగ్ రైట్స్ లో కూడా సగం వాటా ప్రభాస్ పారితోషికం అందుకోనున్నాడట, మొత్తంగా కలిపి 100 కోట్ల వరకు పారితోషికం అందుకున్నాడు.
దీంతో సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ అందుకుంటున్న పారితోషికాన్ని మించి ప్రభాస్ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడన్న టాక్ వినిపిస్తోంది.