బాలయ్య మనస్తత్వం అంతే.. పోసాని కృష్ణమురళి హాట్ కామెంట్స్
సినీ పెద్దలు రాజకీయా నేతలతో జరుపుతున్న చర్చల వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. చర్చలకు బాలయ్యను ఆహ్వానించకపోవటంపై, దాని గురించి బాలయ్య స్పందనపై ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై పోసాని కృష్ణమురళి కూడా స్పందించాడు.
బాలయ్య వ్యాఖ్యలపై స్పందించిన పోసాని కృష్ణమురళీ `బాలయ్యకు కోపం ఎక్కువ అన్న మాట నిజమే, కానీ ఆ కోసం వెనుక పెద్ద కారణమే ఉంటుంది. నేను బాలయ్యతో రెండు మూడు సినిమాలకు కలిసి పనిచేశాను. ఆయన చాలా డీసెంట్గా ఉంటారు. పని పట్ల చాలా నిబద్దతగా ఉంటారు. మంచి ఉంటే మంచి చెడు ఉంటే చెడు అన్నట్టు వ్యవహరిస్తారు బాలయ్య` అని చెప్పుకొచ్చారు.
అంతేకాదు బాలయ్య ముఖానికి తెర వేసుకోడని లోపల ఏది అనిపిస్తే అదే చేస్తాడని చెప్పాడు. మేకప్ ముందు ఒక మాట మేకప్ తరువాత ఓ మాట చెప్పే మనస్తత్వం బాలయ్యది కాదని చెప్పాడు. బాలయ్య ఎప్పుడూ ఒకేలా ఉంటాడని సర్టిఫికేట్ ఇచ్చాడు పోసాని.
బాలయ్య వ్యక్తులు చిన్నవారా పెద్ద వారా అన్న విషయం కూడా పట్టించుకోడని చెప్పాడు. సీఎం అయినా సామాన్యుడైనా ఒకే విధంగా గౌరవిస్తాడని తెలిపాడు. అవినీతి అక్రమం చేద్దామన్న ఆలోచన కూడా ఆయనకు ఉండదని, చాలా జెన్యూన్గా ఉంటాడని చెప్పాడు.
ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన పదవిని అడ్డు పెట్టుకొని సంపాదించుకోవాలని ఆయన కుమారులెవరూ అనుకోలదని, అందరూ స్వశక్తితోనే పైకి వచ్చారని తెలిపాడు. ముఖ్యంగా బాలయ్య రాంగ్ రూట్లోకి ఎప్పుడూ వెళ్లలేదని చెప్పారు.