- Home
- Entertainment
- హైపర్ ఆది, పూర్ణ, దీపికా పిల్లి కాంబో రిపీట్.. ఈ సారి రచ్చ వేరే లెవల్.. ఢీ ప్రీమియర్ లీగ్ షురూ..
హైపర్ ఆది, పూర్ణ, దీపికా పిల్లి కాంబో రిపీట్.. ఈ సారి రచ్చ వేరే లెవల్.. ఢీ ప్రీమియర్ లీగ్ షురూ..
పూర్ణ, హైపర్ ఆది, దీపికా పిల్లి మరోసారి `ఢీ` షోలోకి రాబోతున్నారు. వీరితోపాటు కొందరు సర్ప్రైజింగ్ స్టార్స్ సందడి చేయబోతుండటం విశేషం. ఈ సారి షో లో రచ్చ మామూలుగా ఉండదట. గ్లామర్, వినోదం నెక్ట్స్ లెవల్ అంటున్నారు.

తెలుగు టెలివిజన్స్ లో పాపులర్ డాన్సు షోగా నిలిచింది `ఢీ`. ఇప్పటి వరకు పదిహేను సీజన్లు పూర్తయ్యాయి. ఈ సారి 16వ సీజన్ చాలా స్పెషల్గా ఉండబోతుంది. గ్లామర్, హంగామా, ఎంటర్టైన్మెంట్ మేళవింపుతో రచ్చ రచ్చ చేసేందుకు వస్తున్నారు. నేటి(జూన్ 21) నుంచీ ఈ సరికొత్త సీజన్ ప్రారంభమవుతుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో క్రేజీ సెలబ్రిటీలు సందడి చేయడం విశేషం.
తాజాగా విడుదలైన ప్రోమో చాలా క్రేజీగా ఉంది. అయితే ఈ సారి `ఢీ`రెట్టింపు ఎనర్జీతో, మరింత స్పెషల్ గా రాబోతుంది. అందుకు పేరు కూడా మార్చారు. `ఢీ ప్రీమియర్ లీగ్` పేరుతో ఈ 16వ సీజన్ని స్టార్ట్ చేస్తుండటం విశేషం. ఇందులో గత సీజన్ లో సందడి చేసిన కమెడియన్ బ్యాచ్ని దించారు. హైపర్ ఆదిని గత సీజన్లో తొలగించారు. ఇప్పుడు ఆయన్ని మళ్లీ తీసుకొచ్చారు. రావడం రావడంతోనే తనదైన స్టయిల్లో పంచ్ లు, సెటైర్లు, కామెడీతో నవ్వులు పూయించారు. డబుల్ మీనింగ్ డైలాగ్లతో రచ్చ చేశాడు హైపర్ ఆది.
గ్లామర్ సైడ్ దీపికా పిల్లిని దించారు. గత రెండు సీజన్లలో ఈ బ్యూటీని పక్కన పెట్టారు. ఇప్పుడు మరోసారి తీసుకొచ్చారు. ఆమె రావడం రావడంతో డాన్సులతో రచ్చ చేసింది. కిర్రాక్ లుక్, డాన్సుతో ఫిదా చేసింది. ఆమెతోపాటు జడ్జ్ గా హాట్ బ్యూటీ పూర్ణ వచ్చింది. ఆమె గత సీజన్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. పెళ్లి, ప్రెగ్నెంట్ కావడంతో దూరంగాఉన్నారు. ఇప్పుడు నార్మల్ స్థితికి రావడంతో మళ్లీ తీసుకొచ్చారు. అప్పుడు హాట్గా అలరించిన పూర్ణ ఇప్పుడు బొద్దుగా మారిపోయింది. క్యూట్గానూ అయ్యింది. ఆమెతోపాటు శేఖర్ మాస్టర్ జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు.
ఇందులో మేల్స్ డాన్సర్ల టీమ్ వైపు లీడర్స్ గా బిగ్ బాస్ విన్నర్ సన్నీని దించారు. బిగ్ బాస్ ఐదో సీజన్లో సన్నీ విన్నర్గా నిలిచిన విషయం తెలిసిందే. సన్నీతోపాటు కమెడియన్ సుదర్శన్ సైతం వచ్చారు. అలాగే హీరో వరుణ్ సందేశ్ కూడా షోలో భాగం కాబోతున్నారు. మరి ఆయన గెస్ట్ గా వచ్చారా? షో మొత్తం ఉంటారా? అనేది చూడాలి. ఇక యాంకర్గా ప్రదీప్ కంటిన్యూ అవుతున్నారు.
గత సీజన్లో `ఢీ` అంత కిక్ ఇవ్వలేదు. స్టార్ కమెడియన్లు లేకపోవడం, గ్లామర్ డోస్ తగ్గడంతో ఆడియెన్స్ అంతగా ఆసక్తి చూపలేదు. గత సీజన్ లో కేవలం శ్రద్ధా దాస్ మాత్రమే గ్లామర్ సైడ్ ఆకట్టుకుంది. కానీ వినోదం మిస్ అయ్యింది. దానికి రేటింగ్ కూడా తగ్గడంతో ఆ నష్ట నివారణ చర్యలు చేపట్టింది టీమ్. ఇప్పుడు ఫుల్ ఫ్యాక్డ్ గా `ఢీ ప్రీమియర్ లీడ్`ని తీసుకురానుండటం విశేషం. మరి ఇది ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో, అలరిస్తుందో చూడాలి.
ఢీ షో రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన టాలెంట్ ఉన్న డాన్సర్లని వెలికితీసే ప్రోగ్రామ్. ఈ సారి నాలుగు టీమ్ల మధ్య పోటీగా ఈ షోని నిర్వహించబోతున్నారు. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, నెల్లూరు ల నుంచి నాలుగు టీమ్లు చేశారు. వీరిలో `హైదరాబాద్ ఉస్తాద్స్`, `బెజవాడ టైగర్స్`, `నెల్లూరు నెరజాణలు`, `ఓరుగల్లు వీరులు` లుగా ఈ నాలుగు టీమ్లు డాన్సు షోలో రచ్చ చేయబోతున్నారు.