పూజా హెగ్డేనా? జాన్వీ కపూరా?.. తేల్చుకోలేకపోతున్న విజయ్ దేవరకొండ.. బుట్టబొమ్మకి ఇలాంటి పరిస్థితేంటి?
విజయ్ దేవరకొండ చాలా కన్ఫ్యూజన్లో పడ్డాడు. ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. పూజా హెగ్డే, జాన్వీ కపూర్ ఇద్దరిలో ఎవరితో రొమాన్స్ చేయాలనే సందిగ్దంలో పడ్డారు.
పూజా హెగ్డే (Pooja Hegde) తిరుగులేని స్టార్ హీరోయిన్. ఇది మొన్నటి వరకు మాట. కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. వరుసగా మూడు ఫ్లాప్లు పడటంతో పూజా ఇప్పుడు జస్ట్ ఛాయిస్గా మారిపోతుంది. యంగ్ హీరోలు కూడా పూజాని కేవలం ఛాయిస్గా భావిస్తుండటం ఆమె ఇమేజ్ ఎలా మారిపోతుందో అర్థం చేసుకోవచ్చు.
విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో `లైగర్`(Liger) చిత్రంలో నటించారు. ఇది ఆగస్ట్ లో విడుదల కాబోతుంది. దీంతోపాటు పూరీ జగన్నాథ్తో `జనగణమన`(JGM) సినిమా చేస్తున్నారు. ఇది చిత్రీకరణ ప్రారంభమైంది. త్వరలో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఇందులో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. తాజాగా ఇద్దరు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి.
విజయ్ దేవరకొండతో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తుందని అనుకున్నారు. ఆ మధ్య ముంబయిలో ఓ పార్టీలోనూ విజయ్, పూరీ, జాన్వీ, ఛార్మి కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. దీంతో జాన్వీ హీరోయిన్గా కన్ఫమ్ అనే వార్తలొచ్చాయి. పైగా `లైగర్`లోనూ జాన్వీ హీరోయిన్గా నటించాల్సి ఉంది. కానీ డేట్స్ సెట్ కాకపోవడంతో కుదరలేదు. దీంతో `జనగణమన`(Janaganamana)లో ఫైనల్ అయ్యిందని టాక్ వినిపించింది.
దీనికి తోడు జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. మంచి ప్రాజెక్ట్ ద్వారా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు. తండ్రి బోనీ కపూర్ కూడా జాన్వీ సౌత్లో రాణించేలా ప్లాన్ చేస్తున్నారు. ఆయన కూడా మంచి ప్రాజెక్ట్ కోసం వేచి చూస్తున్న నేపథ్యంలో విజయ్తో `జనగణమన` అయితే బాగుంటుందని భావించారట. కానీ ఇప్పుడు మరో హీరోయిన్ పేరు తెరపైకి రావడం ఆలోచనలో పడేసింది.
పూజా హెగ్డే పేరుని పరిశీలిస్తున్నారట. పూజా హెగ్డే మొన్నటి వరకు గోల్డెన్ లెగ్గా ఉంది. పైగా స్టార్ హీరోయిన్. బాలీవుడ్లోనూ ఆమెకి మార్కెట్ ఉంది. పూజాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా తెలుగు, తమిళంలో భాషల్లోనూ హెల్ప్ అవుతుందని భావించారట. కానీ ఇటీవల పూజా నటించిన మూడు సినిమాలు పరాజయం చెందాయి. `రాధేశ్యామ్`, `బీస్ట్`, `ఆచార్య` చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో పూజాని ఎంపిక చేయాలా? వద్దా? అనే డైలామాలో పడ్డారట విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్.
జాన్వీ కపూర్కి బాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగులో నటించకపోయినా, ఆమెని సోషల్ మీడియాలో తెలుగు ఆడియెన్స్ కూడా ఫాలో అవుతున్నారు. కానీ పూజా హెగ్డే స్థాయిలో ఆమెకి ఇక్కడ మార్కెట్ లేదు. దీంతో తెలుగు విషయంలో జాన్వీ పేరు గురించి సందిగ్దంలో ఉన్నారట. ఈ ఇద్దరిలో ఎవరిని హీరోయిన్గా ఎంపిక చేసుకోవాలి, ఎవరితో రొమాన్స్ చేయాలనే విషయంలో విజయ్ ఎటూ తేల్చుకోలేక సందిగ్దంలో పడ్డాడని టాక్. అయితే మొన్నటి వరకు సినిమాల్లో హీరోయిన్గా ఓన్లీ ఛాయిస్ గా ఉన్న పూజా ఇప్పుడు జస్ట్ ఛాయిస్గా మారడం సక్సెస్ వైపరిత్యంగా చెబుతున్నారు నెటిజన్లు.