`అబార్షన్తో ఆత్మహత్య`ః రూమర్స్ పై `పోకిరి`భామ ఇలియానా క్లారిటీ.. ఎమోషనల్
గోవా బ్యూటీ ఇలియానా మరోసారి తన `అబార్షన్`పై స్పందించింది. తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని వార్తలు పుట్టించారని వాపోయింది. ఆ టైమ్లో అసలేం జరిగిందో వివరించింది ఇలియానా.
`పోకిరి` బ్యూటీ ఇలియానా ఇటీవల తాను సోషల్ మీడియాలో ఎదుర్కొన్న ట్రోల్స్ పై స్పందించింది. బాడీ షేమింగ్పై తాను ఎదుర్కొన్న కామెంట్లని గుర్తు చేసుకుని ఆవేదన చెందింది. చాలా అబ్యూసింగ్ ప్రశ్నలు ఎదుర్కొన్నట్టు చెప్పింది.
తాజాగా మరోసారి ఎమోషనల్ అయ్యింది ఇలియానా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, రూమర్స్ గురించి స్పందించింది. ఫేక్ న్యూస్ల వల్ల తాను ఎంతగా ఇబ్బంది పడ్డానో వివరించింది. తనపై అనేక పుకార్లు షికార్లు చేశాయని చెప్పింది ఇలియానా, దీని వల్ల తాను మానసికంగా ఎంతో కృంగిపోయినట్టు వెల్లడించింది. పుకార్లు ఓ వ్యక్తి జీవితాన్ని ఎంతగా మార్చేస్తాయో వెల్లడించింది.
`ఒకానొక సమయంలో నేను అబార్షన్ చేసుకోబోతున్నాని రూమర్స్ క్రియేట్ చేశారు. అది విని నేను చాలా బాధపడ్డాను. మరీ ఇంత దారుణంగా రూమర్స్ స్ర్పెడ్ చేస్తారా? అని షాక్కి గురయ్యాను.
ఓ సందర్భంలో నేను ఇలాంటి వార్తలతో సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించానని, నా పనిమనిషి చూసి అడ్డుకుందనే వార్తలొచ్చాయి. నిజానికి నాకు పనిమనిషి ఎవరూ లేదు. అసలు నేను సూసైడ్ ప్రయత్నమే చేయలేదు. అయినా ఇలాంటి రూమర్స్, పిచ్చి పిచ్చి వార్తలు ఎక్కడ దొరుకుతాయో అర్థం కావడం లేదు` అని ఇలియానా వాపోతూ ఎమోషనల్ అయ్యింది.
ఇదిలా ఉంటే ఇలియానా.. బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్తో కొన్నాళ్లపాటు డేటింగ్ చేసిందని, ఆ తర్వాత 2018లో వీరిద్దరు బ్రేకప్ తీసుకున్నారని, కానీ అంతకు ముందే వీరికి పెళ్లి అయ్యిందని, పిల్లల్ని కనేందుకు ప్లాన్ చేశారని వార్తలొచ్చిన విషయం తెలిసిందే.
దీనిపై అప్పట్లోనే స్పందించి వివరణ ఇచ్చిన ఇలియానా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి దీనిపై స్పందించింది. రూమర్స్ గురించి చెబుతూ, ఈ విషయాలను పంచుకుంది ఇలియానా. తానెప్పుడూ ప్రెగ్నెంట్ కాలేదని వివరించింది.
ఇలియానా తెలుగులో `దేవదాసు` చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయ్యింది. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పట్లో ఈ గోవా బ్యూటీ నడుముపై తెగ చర్చ నడిచింది. అంతేకాదు ఆమె నడుమే అనేక అవకాశాలు తెచ్చిపెట్టిందని, దానిపై కొన్ని పాటలు కూడా రావడం విశేషం.
అంతగా తన సన్నని నడుముతో ఆకట్టుకున్న ఇలియానా మహేష్తో `పోకిరి`, రవితేజతో `ఖతర్నాక్`, `కిక్`, `దేవుడు చేసిన మనుషులు`, `అమర్ అక్బర్ ఆంటోని`, ఎన్టీఆర్తో `రాఖీ`, `శక్తి`, సిద్ధార్థ్ తో `ఆట`, పవన్ కళ్యాణ్తో `జల్సా`, ప్రభాస్తో `మున్నా`, నితిన్ తో `రెచ్చిపో`, రానాతో `నేను నా రాక్షసి`, అల్లు అర్జున్తో `జులాయి` చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం బాలీవుడ్పైనే పెట్టింది. ఇప్పుడు `ఫెయిర్ అండ్ లవ్లీ` చిత్రంలో నటిస్తుంది.