చిరంజీవి మీద విషప్రయోగం... ఆయన్ని చంపాలని చూసింది ఎవరో తెలుసా?
చిరంజీవి ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగారు. నెంబర్ వన్ హీరో ఏళ్ల తరబడి పరిశ్రమను ఏలాడు. అయితే ఆయన మీద విష ప్రయోగం జరిగిన సంగతి చాలా మందికి తెలియదు.
చిరంజీవి చెన్నైలో నటనలో శిక్షణ తీసుకుంటున్న రోజుల్లో పునాది రాళ్లు మూవీలో ఆఫర్ వచ్చింది. అయితే రిలీజ్ అయిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు. కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి విలన్, సపోర్టింగ్ రోల్స్ కూడా చేశారు.
Chiraneevi
1988 లో చిరంజీవి మరణమృదంగం మూవీ చేశాడు., అప్పటికే ఆయన స్టార్ హోదా తెచ్చుకున్నాడు. అంచలంచెలుగా ఎదుగుతున్న చిరంజీవిని చంపాలని కొందరు ప్లాన్ చేశారట. ఆయన మీద విష ప్రయోగం చేశారట.
Chiranjeevi
చిరంజీవి స్టార్ గా ఎదిగిన నేపథ్యంలో ఆయన షూటింగ్ జరిగే ప్రదేశాలకు భారీగా జనాలు వచ్చేవారట. మరణ మృదంగం షూటింగ్ జరుగుతుండగా ఓ అభిమాని షూటింగ్ సెట్స్ కి వచ్చాడట. నా పుట్టిన రోజు కేక్ కట్ చేసి మీరు తినాలని ఇబ్బంది పెట్టాడట.
చిరంజీవి వద్దు అంటున్నా కేక్ తినిపించాడట. కాసేపటికి చిరంజీవి పెదాలు రంగు మారిపోయాయట. వెంటనే చెన్నై లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారట. రెండు రోజు చిరంజీవి చికిత్స తీసుకున్నాడట. చిరంజీవి మీద విష ప్రయోగం జరిగిందని వైద్యులు ధృవీకరిచారట.
ఈ విషయాన్ని నటుడు మురళీ మోహన్ కూడా ధృవీకరించారు. ఆయన స్టార్ గా ఎదుగుతున్న నేపథ్యంలో విష ప్రయోగం జరిగి ఉండవచ్చు అన్నారు . అయితే చిరంజీవి మీద విష ప్రయోగం చేశారు అన్నది మాత్రం నిజమో అబద్దమో తెలియదు...