`రాధేశ్యామ్` పోస్టర్లో పవన్, శ్రీరెడ్డి.. నన్ను ఇలా కించపరుస్తున్నారేంట్రా అంటూ ఫైర్.. ఫోటో వైరల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. `రాధేశ్యామ్` సినిమా చేస్తున్నాడా? ఆయనకు జోడిగా శ్రీరెడ్డి నటిస్తుందా? తాజా పోస్టర్ అలానే అనిపిస్తుంది. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న `రాధేశ్యామ్` పోస్టర్ ని పవన్, శ్రీరెడ్డి ఫోటోలతో మార్ఫింగ్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై శ్రీరెడ్డి సంచలన కామెంట్ చేసింది.
వివాదాస్పద నటి శ్రీరెడ్డి మూడేళ్ల క్రితం సంచలనం క్రియేట్ చేసింది. నగ్నంగా ఫిల్మ్ ఛాంబర్ ముందు కూర్చొని టాలీవుడ్ స్టార్స్ ఓ రేంజ్లో ఆడుకుంది. పవన్ కళ్యాణ్ని ఈ వివాదంలోకి లాగింది.
పవన్ పెళ్లిళ్లలపై, కొత్త వారిని ఎంకరేజ్ చేయడంపై ఆయనకు అమ్మాయిల పిచ్చి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మెగా ఫ్యామిలీ టార్గెట్గా పాపులర్ అయ్యింది శ్రీరెడ్డి. అలాగే ఇండస్ట్రీలో `మీటూ` విషయాలను వెల్లడించింది. మరోవైపు గతంలో పవన్కి, శ్రీరెడ్డికి పెళ్లి చేసినట్టుగా కూడా ఫోటోలు మార్ఫింగ్ చేశారు. దీనిపై కూడా మండిపడింది శ్రీరెడ్డి.
దీనంతటికి కారణం దర్శకుడు రామ్గోపాల్ వర్మనే అని, అతనే ఇలా కావాలని శ్రీరెడ్డికి డబ్బు ఆశ చూపించి ఉసిగొల్పారనే కామెంట్లు వచ్చాయి. దీనిపై పవన్ చాలా సీరియస్ అయ్యాడు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సమయం దొరికినప్పుడల్లా పవన్ని టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తుంది శ్రీరెడ్డి. ఈ మధ్య ఆయన పార్టీపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తుంది. పవన్ పేరుని రోజుకి ఒక్కసారైనా తలుచుకుంటుంది.
ఆమె బాధని గమనించిన అభిమానులు ఇద్దరికి జోడి కట్టారు. అందుకు ప్రభాస్ని ఇన్వాల్వ్ చేశారు. ప్రభాస్ నటిస్తున్న `రాధేశ్యామ్` పోస్టర్ని పూజా హెగ్డే ప్లేస్లో శ్రీరెడ్డి ఫోటోని, ప్రభాస్ ఫేస్కి బదులు పవన్ ఫేస్ని మార్ఫింగ్ చేశారు.
తాజాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన కంట పడటంతో దీన్ని ఫేస్బుక్ ద్వారా పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర కామెంట్ చేసింది. పవన్తో నన్ను కలపడమేంట్రా అంటూ ఘాటుగా స్పందించింది.
`అరేయ్ ఏంట్రా ఇది? నాకొక టేస్ట్ ఉంటదని గుర్తించండ్రా. నన్ను ఎలా కించ పరుస్తారేంట్రా?` అంటూ కామెంట్ పెట్టింది శ్రీరెడ్డి. ప్రస్తుతం ఈ ఫోటో హల్చల్ చేస్తుంది. అభిమానులు విభిన్నమైన కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. చాలా వరకు శ్రీరెడ్డికి సపోర్ట్ గా కామెంట్లు ఉండగా, పవన్పై విమర్శించేలా చాలా కామెంట్లు ఉన్నాయి.