ఇంటర్నెట్ ని షేక్ చేసిన ఎన్టీఆర్ కిడ్స్... ఇండస్ట్రీని ఏలేయడం ఖాయం!
జూనియర్ ఎన్టీఆర్ కిడ్స్ ఇంటర్నెట్ ని షేక్ చేశారు. ఈ ఇద్దరు లిటిల్ క్యూట్ బ్రదర్స్ నెటిజెన్స్ మనసు దోచారు. ఎన్టీఆర్ ఇద్దరు కుమారుల పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది.
స్టార్స్ కి సంబంధించిన ప్రతి విషయంపై ఫ్యాన్స్ కి ఆసక్తి ఉంటుంది. ఇక స్టార్స్ వారసులకు వాళ్ళ తండ్రులతో సమానమైన ఫాలోయింగ్ ఉంటుంది. చిన్నప్పటి నుండే డై హార్డ్ ఫ్యాన్స్ స్టార్ కిడ్స్ ని ఫాలో అవుతూ ఉంటారు.
టాలీవుడ్ లో భారీ స్టార్ డమ్ కలిగిన జూనియర్ ఎన్టీఆర్ పిల్లలకు కూడా భారీ క్రేజ్ ఉంది. అరుదుగా బయటికి వచ్చే వాళ్ళ ఫోటోలను మురిసిపోతూ వైరల్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
నిన్న ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. అభయ్, భార్గవ్ ఒకరిని ఒకరు ముద్దు పెట్టుకుంటున్న ఆ ఫోటోలు నెటిజెన్స్ కి విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఇక భవిష్యత్ సూపర్ స్టార్స్ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. వీరిద్దరి ఫోటోలు క్షణాల్లో అభిమానుల డీపీలుగా మారిపోయాయి. పసి ప్రాయంలోనే అభయ్, భార్గవ్ ఈ రేంజ్ లో పాప్యులర్ కావడం విశేషం అని చెప్పాలి.
ఎంత పెద్ద స్టార్ అయినా ఎన్టీఆర్ కుటుంబం లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పబ్లిక్ వేడుకలలో చాలా తక్కువగా కనిపిస్తారు. మిగతా స్టార్స్ వైఫ్స్ తో పోల్చుకుంటే ఆమె సోషల్ మీడియాకు కూడా దూరం.
ఇక ఎన్టీఆర్ సైతం తన పర్సనల్ విషయాలు చాలా అరుదుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ముఖ్యమైన విషయాలకు మాత్రమే సోషల్ మీడియాలో స్పందిస్తారు. దీనివలన ఎన్టీఆర్ పిల్లల ఫోటోలు బయటికి రావడం చాలా అరుదు.
2011లో ఎన్టీఆర్ - లక్ష్మీ ప్రణతి వివాహం చేసుకోగా వీరికి 2014లో మొదటి సంతానంగా అభయ్ రామ్, 2018 లో రెండవ సంతానంగా భార్గవ్ రామ్ పుట్టారు.
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆయన ఈ చిత్రంలో కొమరం భీమ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆర్ ఆర్ ఆర్ కి సంబంధించిన కీలక పోరాట సన్నివేశాలలో ఎన్టీఆర్ పాల్గొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.