అదే ఫార్ములా రిపీట్ చేస్తున్న బిగ్ బాస్ 4 టీం
బిగ్ బాస్ సీజన్ 3 సూపర్ హిట్ అయ్యింది. ఈ సీజన్కు సీనియర్ హీరో కింగ్ నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరించాడు. అందుకే ఇప్పుడు నాలుగో సీజన్కు కూడా నాగార్జుననే వ్యాఖ్యతగా తీసుకున్నారు. ఇప్పటికే నాగ్తో ప్రమోను కూడా షూట్ చేశారు. ఈ నెలాఖరునే షోను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
అంతర్జాతీయ స్థాయిలో ఘనవిజయం సాధించిన టీవీ రియాలిటీ షో బిగ్ బాస్. ఇండియాలో దాదాపు అన్ని భాషల్లో సక్సెస్ అయిన ఈ షో తెలుగులో నాలుగో సీజన్కు రెడీ అవుతోంది. గత మూడు సీజన్లు ఘన విజయం సాధించటంతో మూడో సీజన్పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అందుకు తగ్గట్టుగా షో నిర్వాహకులు భారీగా ప్లాన్స్ చేస్తున్నారు.
ముఖ్యంగా నిర్వహణతో పాటు సక్సెస్ చేసేందుకు గతంలో సూపర్ హిట్ అయిన ఫార్ములాలను రిపీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే అందుకు తగ్గట్టుగా టాస్క్లు, గేమ్స్ ను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే కోవిడ్ నేపథ్యంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయిన ఎంటర్టైన్మెంట్కు మాత్రం కొదువ లేకుండా ప్లాన్ చేస్తున్నారట.
బిగ్ బాస్ సీజన్ 3 సూపర్ హిట్ అయ్యింది. ఈ సీజన్కు సీనియర్ హీరో కింగ్ నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరించాడు. అందుకే ఇప్పుడు నాలుగో సీజన్కు కూడా నాగార్జుననే వ్యాఖ్యతగా తీసుకున్నారు. ఇప్పటికే నాగ్తో ప్రమోను కూడా షూట్ చేశారు. ఈ నెలాఖరునే షోను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక కంటెస్టెంట్ల ఎంపికలోనూ అదే గత సీజన్ స్ట్రాటజీనే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా గత సీజన్లో సింగర్గా ఎంటర్టైన రాహుల్ సిప్లిగంజ్ షోను టర్న్ చేసిన నేపథ్యంలో ఈ సారి నోయల్ను తీసుకోవాలని భావిస్తున్నారట. నోయల్, రాహుల్ స్టైల్లోనే షోలో ఎంటర్టైన్ చేస్తాడన్న భావిస్తున్నారు.
ఇక గత సీజన్లో కొరియోగ్రాఫర్ భాస్కర్ షోలో ఓ రేంజ్లో కామెడీ పండించాడు. అందుకే ఈ సీజన్లో కూడా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను తీసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక వేళ జానీ మాస్టర్ కాకపోతే రఘు మాస్టర్ అయినా షోలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే కంటెస్టెంట్లకు కోవిడ్ టెస్ట్లు చేసి అందరినీ క్వారెంటైన్కు తరలించినట్టుగా తెలుస్తోంది. కరోనా నిబంధనల మేరకు షోలో ఇచ్చే టాస్క్ల విషయంలో కూడా మార్పులు చేసే ఆలోచనలో ఉంది బిగ్ బాస్ టీం.