ఏకాంతంలో హద్దులు లేని రొమాన్స్ తో రెచ్చిపోయిన నిహారిక... వైరల్ అవుతున్న హనీమూన్ ఫోటోలు!
న్యూలీ వెడ్డింగ్ కపుల్ నిహారిక, చైతన్య హానీమూన్ మూడ్ లో ఉన్నారు. చల్లని సాగరతీరం దేశం మాల్దీవ్స్ కి వెళ్లిన నిహారిక, చైతన్య ఏకాంతంలో హద్దులు లేని రొమాన్స్ అనుభవిస్తున్నారు. పెళ్ళైన తరువాత మొదటి ట్రిప్ గా మాల్దీవ్స్ వెళ్లిన ఈ జంట ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారని ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది.
క్రిస్మస్ సెలెబ్రేషన్స్ కుటుంబంతో జరుపుకున్న నిహారిక చైతన్య... డిసెంబర్ 26న హనీమూన్ కి వెళ్లడం జరిగింది. ప్రంపంచంలో అందమైన సముద్ర తీర దేశమైన మాల్దీవ్స్ కి హనీమూన్ కొరకు వెళ్లారు. వయసు పైబడిన జంటలకే రొమాంటిక్ ఆలోచనలు తెప్పించే సాగర తీరంలో కొత్తగా పెళ్ళైన నవ జంట మరింత రెచ్చిపోతున్నారు.
నిహారిక తన హనీమూన్ వెకేషన్ పిక్స్ ఇంస్టాగ్రామ్ లో పంచుకోగా వైరల్ అవుతున్నాయి. నిహారిక హాట్ పోజులు, రొమాంటిక్ హగ్స్ సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి.
నిహారిక విలాసవంతమైన సాగరతీర హోటల్స్ లో కైపెక్కించే దుస్తులలో హీటు పుట్టిస్తున్నారు. నచ్చిన వాడితో అందమైన అనుభవాలు పంచుకుంటూ ప్రతిక్షణం ఆస్వాదిస్తున్నారు.
ఇక న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కూడా మాల్దీవ్స్ లోనే జరుపుకున్నారు నిహారిక, చైతన్య. వీరిద్దరి అత్యంత క్లోజ్ ఫ్రెండ్స్ ఈ వేడుకలలో వీరితో పాటు జాయిన్ కావడం జరిగింది.
ఒకవైపు హనీమూన్, మరోవైపు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కలిసి వచ్చేలా చక్కగా ట్రిప్ ప్లాన్ చేశారు నిహారిక అండ్ చైతన్య. మరోవారం వీరి ట్రిప్ కొనసాగనుందని సమాచారం.
కుటుంబంతో కలిసి చైతన్య, నిహారిక క్రిస్మస్ సెలెబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న చరణ్, వరుణ్ కోవిడ్ బారినపడడంతో ట్రిప్ లో ఉన్న వీరు కూడా కోవిడ్ టెస్టులు చేయించుకున్నారు. ఐతే నిహారిక, చైతులకు కరోనా నెగిటివ్ అని రావడం జరిగింది.
నిహారిక, చైతన్యల వివాహం డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఘనంగా జరిగింది.
మెగా హీరోలందరూ పాల్గొన్న ఈ వేడుక దాదాపు ఐదు రోజులు అక్కడ ఘనంగా నిర్వహించారు. నిహారిక పెళ్లి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.