కాళ్ల మీద పడ్డ ఆ ఇద్దరెవరో చెప్పేసిన నిహారిక.. ప్రీ వెడ్డింగ్ ఫోటోస్..
మెగా ఫ్యామిలీ ఇంట్లో పెళ్ళి సందడి ప్రారంభమైంది. నిన్నటి వరకు పార్టీలతో ఎంజాయ్ చేసిన వీరంతా ఇప్పుడు వెడ్డింగ్ పనుల్లో బిజీ అయ్యారు. తాజాగా నిహారిక ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ని షురూ చేసింది. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు ఈ సీక్రెట్ని రివీల్ చేసిందీ అమ్మడు.
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక గుంటూరుకి చెందిన ఐజీ జె.ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యతో నిహారిక వివాహం జరుగనుంది. ఈ నెల 9న ఉదయ్పూర్లోని ఉదయ్ విలాస్లో పెళ్ళి జరగనుంది. ఆగస్ట్ లో వీరి ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే.
ఎంగేజ్మెంట్ అయిన మరుక్షణమే తన ఫ్రెండ్స్ కి బ్యాచిలరేట్ పార్టీ ఇచ్చింది నిహారిక. మరోవైపు తమ మెగా డాటర్స్ కి ఓ డిన్నర్ పార్టీ ఇచ్చింది. ఇటీవలే కాబోయే పెళ్ళి జంటకి ఓ సర్ప్రైజ్ ఏర్పాటు చేశారు మెగా ఫ్యామిలీ. తమ కుటుంబంలోకి చైతన్యని ఆహ్వానించారు. చిరంజీవి కుమార్తె సుస్మిత, శ్రీజ దంపతులు బుధవారం రాత్రి ఓ స్పెషల్ పార్టీ ఇచ్చారు.
ఇందులో వరుణ్ తేజ్, సాయితేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్, అల్లు అర్జున్ సతీమణి స్నేహా, అల్లు శిరీష్, అల్లు వెంకటేష్ దంపతులు, అలాగే ఇతర మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దిగిన ఫోటోలను కళ్యాణ్ దేవ్ పంచుకున్నారు. `నిస్చే` యాష్ ట్యాగ్తో ఈ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. `నిస్చే సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. రాత్రి పార్టీ చాలా సంతోషంగా జరిగింది. ఎప్పటికీ గుర్తుండిపోయే పార్టీ ఇది` అని పేర్కొన్నాడు కళ్యాణ్ దేవ్.
`నిస్చే సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. రాత్రి పార్టీ చాలా సంతోషంగా జరిగింది. ఎప్పటికీ గుర్తుండిపోయే పార్టీ ఇది` అని పేర్కొన్నాడు కళ్యాణ్ దేవ్.
చైతన్య స్పందిస్తూ, పార్టీతో తనకి ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను అందించిన శ్రీజ, సుస్మితలకు ధన్యవాదాలు ` అని తెలిపారు. చైతన్యని తమ ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తూ సుస్మిత ఫోటోని పంచుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా నిహారిక మూడు ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో భాగంగా ఆమెను ఇద్దరు లేడీస్ రెడీ చేస్తున్నారు.
వారిద్దరూ తన కాళ్లు పట్టుకున్నట్లుగా ఈ ఫొటో ఉంది. చూసిన వారంతా అదే అనుకుంటారని భావించిన నిహారిక ఈ ఫొటో గురించి వివరణ ఇచ్చింది.
ఈ ఫొటోలోని వారు నా హీల్స్ను సరిచేస్తున్నారు. వారిద్దరూ పెళ్లికూతురుని చక్కగా రెడీ చేస్తారు కాబట్టే.. నాకు తెలిశారు. లవ్ యు గర్ల్స్..` అని చెబుతూ, మరో ఫొటోలో వారిద్దరిని పరిచయం చేసింది నిహారిక. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే కరోనా కారణంగా కొద్దిమంది బంధుమిత్రులు, సినీ వర్గాల సమక్షంలో ఈ మ్యారేజ్ ఈవెంట్ జరుగనుంది.