జోరు వానలో అప్సరసలా కారుదిగిన కియారా అద్వాని, దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు, కారణమేంటి..?
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానిపై మండిపడుతున్నారు నెటిజన్లు. నీకు చేతులు లేవా.. నీ పని నువ్వు చేసుకోలేవా అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ అంత తప్పు కియారా ఏం చేసింది..?
అటు బాలీవుడ్లో.. ఇటు టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ తో దూసుకుపోతోంది యంగ్ బ్యూటీ కియారా అద్వాని. వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ.. కుర్రాళ్ల హృదయాలను కొల్లకొడుతోంది.
టాలీవుడ్ , బాలీవుడ్ యంగ్ బ్యూటీస్ లో కియారా అద్వానీ స్పెషల్ క్రేజ్ ఉంది. ఇటు తెలుగులో అటు బాలీవుడ్ లో వరుస ఆఫర్లతో ఆమె దూసుకుపోతోంది. అంతే కాదు పాన్ఇండియా సినిమాలు కూడా చేస్తోంది కియారా. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.
తాజాగా ఈ చిన్నది నెటిజన్ల నుంచి ధారుణమైన ట్రోలింగ్ ను ఫేస్ చేస్తోంది. ఓ సినిమా షూటింగ్ కోసమని వెళ్తూ ముంబైలో ఆమె కారులో నుంచి కిందకు దిగింది. అయితే షూటింగ్ స్పాట్ కు ఆమె వెళ్తోంన్న టైమ్ లో.. వర్షం పడుతుండటంతో... ఆమె తడవకుండా ఈమె సెక్యూరిటీ సిబ్బంది, బాడీ గార్డ్ గొడుగు పట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోనే కియారాపై నెటిజన్ల కోపానికి కారణం అయ్యింది. గొడుగు పట్టుకోడానికి కూడా చేతకావడంలేదా..? లేక నీకు చేతులు లేవా? అని కొందరు సోషల్ మీడియా జనాలు మందడిపడుతున్నారు. ఆమెకు చేతుల్లేవేమో, అందుకే గొడుగు కూడా పట్టుకోలేక పోతోంది అంటూ విమర్శించారు.
అంతే కాదు నీకు గొడుగు పట్టుకోవడం మాత్రమే ముఖ్యమా..? నీకు రక్షణగా ఉండే సెక్యూరిటీ గార్ట్ లు ఏమైపోయినా పర్లేదా..? వాళ్ళు తడుస్తూ..నీకు గొడుగు పట్టుకోవాలా అంటూ.. సెటైర్లు వేస్తున్నారు. తిట్టిపోస్తున్నారు.
ఇక భరత్ అనే నేను సినిమాతో మహేశ్ బాబు జోడీగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కియారా. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు వచ్చిపడ్డాయి . అటు బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయామకు. దీనికితోడు బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది బ్యూటీ. త్వరలో వీరు పెళ్ళి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.