మళ్ళీ దొరికిన మంచు లక్ష్మి.. ఆడేసుకుంటున్న నెటిజన్లు..
మళ్ళీ దోరికేసింది మంచు లక్ష్మీ. ఇండస్ట్రీలో నెటిజన్లు టార్గెట్ చేసే ఫ్యామిలీల్ మంచు వారు ముందు వరుసలో ఉంటారు. వారు ఏది మాట్లాడినా.. ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు. తాజాగా మరోసారి మంచు లక్ష్మిని టార్గెట్ చేశారు సోషల్ మీడియా జనాలు.. ఇంతకీ మ్యాటర్ ఎంటంటే..?
- FB
- TW
- Linkdin
Follow Us
)
హాలీవుడ్ లో మంచి కెరీర్ వదిలేసి.. టాలీవుడ్ కు వచ్చేసింది మంచు లక్ష్మి. మోహన్ బాబు వారసురాలిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తోంది. హీరోయిన్ గా, నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. హోస్ట్ గా.. నిర్మాతగా.. యూట్యూబర్ గా.. ఇలా మల్టీ టాలెంట్ చూపిస్తూ.. ఇండస్ట్రీలో తన క్రేజ్ ను అమాంతం పెంచుకుంటూపోతోంది.
Manchu Lakshmi
చాలా తక్కువ టైంలోనే ఫేమస్ అయ్యింది మంచు లక్ష్మీ.. . బుల్లితెర పై హోస్ట్గా టాక్ షోలకి క్రేజ్ పెరిగేలా చేసింది మంచు లక్ష్మీనే.! ఆ తర్వాత విలన్ గా సినిమాల్లోకి అడుగుపెట్టి తన తండ్రికి తగ్గ వారసురాలు అనిపించుకుంది. అనగనగా ఓ ధీరుడు, గుండెల్లో గోదారి,ఓ కొడతారా ఉలిక్కి పడతారా, దొంగాట, వైఫ్ ఆఫ్ రామ్ వంటి మంచి సినిమాల్లో నటించింది.
ఎప్పటికప్పుడు మంచు లక్ష్మీ మాట్లాడే మాటలు ట్రోల్ కు గురవుతుంటాయి. తాజాగా మరోసారి ఆమె దొరికిపోయింది. మంచు లక్ష్మీ ఎంత ట్రోల్ కు గురయినా.. తను చేసే మంచి పనులు కూడా ఈమధ్య బాగా హైలెట్ అవుతున్నాయి. ఈమె ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేసింది. అందుకే మంచు లక్ష్మీ అంటే ఇండస్ట్రీలో అందరికీ ప్రత్యేకమైన గౌరవం ఏర్పడింది.
స్కూల్స్ ను దత్తత తీసుకుని.. స్మార్ట్ స్కూల్స్ గా మార్చి.. పేద విదార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలని ఎన్టీఓస్ తో కలిసి కృషి చేస్తుంది. ఈక్రమంలో ఆమె ఎంతో మంది మెప్పు పొందుతోంది. అయితే ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తెలుగు హీరోయిన్ల మీద మేకర్స్ మీద కామెంట్స్ చేసింది. అయితే ఇటీవల ఆమె తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలను హీరోయిన్లుగా ఎంపిక చేసుకోరు.. ఇక్కడి మేకర్స్ పక్క రాష్ట్రాల నుండీ వచ్చిన అమ్మాయిలకే పెద్ద పీట వేస్తారు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
ఇక లక్ష్మీ చేసిన కామెంట్ల నెటిజన్లు గట్టిగా చురకలు వేస్తున్నారు. టాలీవుడ్ గురించి.. మేకర్స్ గురించి మాట్లాడే ముందు.. ఆ విషయం లో ముందు మీ తమ్ముళ్లకు చెప్పండి. మీరు నిర్మించే సినిమాలు.. మీ తమ్ముళ్ళు హీరోలుగా చేసే సినిమాల్లో.. ఇతర రాష్ట్రాలకు చెందిన హీరోయిన్ల ను తీసుకున్నారు.. వేరే రాష్ట్రాలకి చెందిన అమ్మాయిలతో సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. మరి ఆ విషయంలో ఏమంటారు అంటూ ప్రశ్నిస్తున్నారు.
మీ తమ్ముళ్లు హీరోగా కాజల్, పాయల్, సన్నీ లియోన్ వంటి వారితో సినిమాలు చేశారు.. వారి బదులుగా మీరు అంటున్న నీహారిక, బింధు మాధవి, ఈషా రెబ్బా వంటి హీరోయిన్లతో సినిమాలు చేయమని చెప్పొచ్చు కదా అంటూ ఆమెను నిలదీస్తున్నారు.